నా కాళ్లు కాదు.. నడక గురించి మాట్లాడారు!
‘అల వైకుంఠపురములో..’ సినిమా తనను తెలుగు వారికి మరింత దగ్గర చేసిందని కథానాయిక పూజా హెగ్డే పేర్కొన్నారు. ‘ముకుంద’తో పరిచయమై.. ‘డీజే: దువ్వాడ జగన్నాథమ్’, ‘సాక్ష్యం’, ‘అరవింద సమేత’, ‘గద్దలకొండ గణేష్’ సినిమాలతో ఆకట్టుకున్నారు ఈ భామ. అల్లు అర్జున్ సరసన......
నాకిష్టమైన సీన్ కట్ చేశారు
తారక్కు హ్యాట్సాఫ్: పూజా హెగ్డే
హైదరాబాద్: ‘అల వైకుంఠపురములో..’ సినిమా తనను తెలుగు వారికి మరింత దగ్గర చేసిందని కథానాయిక పూజా హెగ్డే పేర్కొన్నారు. ‘ముకుంద’తో పరిచయమై.. ‘డీజే: దువ్వాడ జగన్నాథమ్’, ‘సాక్ష్యం’, ‘అరవింద సమేత’, ‘గద్దలకొండ గణేష్’ సినిమాలతో ఆకట్టుకున్నారు ఈ భామ. అల్లు అర్జున్ సరసన రెండోసారి ఆమె నటించిన చిత్రం ‘అల వైకుంఠపురములో..’. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జనవరి 12న విడుదలై హిట్ అందుకుంది. బాక్సాఫీసు వద్ద దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో సినిమాలో ‘అమూల్య’గా నటించిన పూజ మీడియాతో మాట్లాడారు. తెలుగు సినిమాల్లో నటించడం గురించి ముచ్చటించారు.
న్యాయం చేయడం లేదు
‘నేను నా పనిపైనే దృష్టి పడతా. సినిమాలు, హిట్లను లెక్కించుకోను. ఈ సినిమా కోసం డబ్బింగ్ చెప్పా. చాలా కష్టంగా అనిపించింది. ఇంగ్లిషు పదాలకు తెలుగు నేటివిటీ కలిసి చెప్పడం ఇంకా కష్టం. ఇప్పుడు ఓ పరంగా నేను తెలుగు అమ్మాయి అయిపోయా. నేను తెలుగు నేర్చుకోవడానికి ఎవరి దగ్గర శిక్షణ తీసుకోలేదు. నా సిబ్బందితో తెలుగులోనే మాట్లాడుతుంటా. కానీ ఇంటర్వ్యూలో తెలుగు మాట్లాడాలంటే భయంగా ఉంది. డబ్బింగ్ ఆర్టిస్టుల్లో కొందరు సరిగ్గా డబ్బింగ్ చెప్పడం లేదు. నా నటనకు తమ డబ్బింగ్ ద్వారా కొందరు ఆర్టిస్టులు న్యాయం చేయడం లేదు అనిపించింది. నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకోవడానికి ఇది ఓ కారణం’.
హీరోయిన్ మెసేజ్ చేసింది
‘‘అరవింద సమేత’ సినిమాలో నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకున్నా. ఆ సమయంలో ఓ హీరోయిన్ నాకు మెసేజ్ చేసింది. ‘నీకు ఎవరు డబ్బింగ్ చెప్పారు?, చాలా బాగుంది. నా సినిమాలో పాత్రకు కూడా ఆమెతోనే డబ్బింగ్ చెప్పిస్తా..’ అనింది. నేను నవ్వి.. ఆమె పారితోషికాన్ని మీరు ఇవ్వలేరులే అన్నా (నవ్వుతూ). ఆ హీరోయిన్ పేరు బయటపెట్టలేను. ఆ రోజు నాకు చాలా సంతోషంగా అనిపించింది. ‘సర్ నేనే డబ్బింగ్ చెప్పాలి అనుకుంటున్నా.. సరిగ్గా ఉంటే నా వాయిస్ పెట్టుకోండి, లేకపోతే డబ్బింగ్ ఆర్టిస్టుతో చెప్పించండి’ అని ‘అరవింద సమేత’ తొలి షెడ్యూల్లో నేను త్రివిక్రమ్ గారితో అన్నాను. నాతో డబ్బింగ్ చెప్పించారు.. త్రివిక్రమ్ సర్కు నచ్చింది’.
కెమిస్ట్రీ కుదిరింది
‘ఈ సినిమా షూటింగ్లో చాలా నవ్వుకున్నాం. ఫన్నీ స్క్రిప్టులో నటించాలని నాకు ఎప్పటి నుంచో ఉంది. త్రివిక్రమ్, బన్నీ కూడా అదే మూడ్లో ఉన్నారు. నేను ఈ సినిమాకు సంతకం చేయడానికి అది ఓ కారణం. అదేవిధంగా త్రివిక్రమ్ సర్తో కలిసి మరోసారి పనిచేయొచ్చని ఒప్పుకున్నా. ఈ సినిమా కథ అందరికీ నచ్చేలా ఉంది. ఇందులో నా పాత్ర చాలా బలంగా ఉంటుంది. అల్లు అర్జున్ హీరోయిన్లను రిపీట్ చేయడు. కానీ నన్ను తీసుకున్నాడు (నవ్వుతూ) అతడితో నటన సౌకర్యంగా ఉంటుంది. ‘డీజే’లో మా కెమిస్ట్రీకి మంచి స్పందన వచ్చింది కాబట్టి ఇప్పుడు నన్ను తీసుకున్నారేమో. ‘నువ్వు ఎందుకు హీరోయిన్స్ను రిపీట్ చేయవు’ అని నేను కూడా ఓసారి అల్లు అర్జున్ను ఏడిపించా’.
అసభ్యంగా లేవుగా..!
‘సినిమాలో మీ కాళ్లపై చాలా సీన్లు ఉన్నాయి. మీకు ఇబ్బందిగా అనిపించలేదా? అని ప్రశ్నించగా.. ‘సాధారణంగా నా కాళ్లను చూసిన ప్రతి ఒక్కరికీ పాఠం చెప్పాలని నేను అనుకుంటే నా పని పక్కనపెట్టాలి. అలా చేయడం సరికాదు. షార్ట్ కాకుండా లంగాఓణి వేసుకున్నా.. నడుం చూస్తారు. అప్పుడు లేనిది.. ఇప్పుడు ఏందుకు? ఏదైనా సరే మనం ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుంది. ఈ సినిమా కథలో భాగంగానే నా కాళ్లపై సీన్లు ఉన్నాయి. అసభ్యకరంగా అయితే లేవు కదా. అతడు నేను నడిచే విధానం గురించి మాట్లాడారు.. అంతేకానీ నా కాళ్లు ఎలా ఉన్నాయని కాదు’.
త్రివిక్రమ్కు ఈగో లేదు
‘త్రివిక్రమ్ సర్ చాలా కామ్గా ఉంటారు. ‘సర్.. సెట్లో అగ్ని్ప్రమాదం జరిగింద’ని ఎవరైనా వచ్చి ఆయనకు చెబితే.. ‘హో.. మంటలు వ్యాపించాయా! ఫర్వాలేదు, ముందు ఇది పూర్తికానీ..’ అంటారు. నేను చాలా మంది దర్శకులతో కలిసి పనిచేశా. వారిలో ఎవరూ ఇంత ప్రశాంతంగా లేరు. ఇలాంటి ఘటన జరిగితే కేకలు పెట్టేవారు.. అక్కడ ఉన్న మేం భయపడిపోయేవాళ్లం. ఓపికగా ఉండాలనే విషయం త్రివిక్రమ్ నుంచి నేర్చుకున్నా. ఆయన సీన్ను పూర్తిగా వివరిస్తారు. ‘సామజవరగమన..’ పాట లిరిక్స్ మొత్తం నాకు వివరించారు, అసలు పాట గురించి నాకు చెప్పాల్సిన అవసరమే లేదు. కానీ మొత్తం చెప్పారు. ఇవాళ నేను కూడా ఆ పాట గురించి మరొకరికి చెప్పగలను. ఆయన ప్రతి ఒక్కరి మాట వింటారు, ఈగో లేదు. సరైన సలహాని తుది నిర్ణయంగా తీసుకుంటారు’.
ఆ సీన్ ఇష్టం
‘ఈ సినిమాలో నేను బన్నీకి సరిపోయేలా డ్యాన్స్ చేశాననే అనుకుంటున్నా. ఇప్పటికే బెస్ట్ డ్యాన్సర్స్ హృతిక్ రోషన్, బన్నీతో కలిసి పనిచేశా. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా డ్యాన్స్ సాధన చేయలేదు. సెట్లోనే ప్రాక్టీస్ చేశా. ఈ సినిమాలో నాకు ఇష్టమైన సన్నివేశాన్ని కట్ చేశారు. దాన్ని ఓ రోజు విడుదల చేస్తారని ఆశిస్తున్నా (నవ్వుతూ). ఇప్పుడు సినిమాలో ఉన్న సన్నివేశాల్లో నాకు ‘బుట్టబొమ్మ..’ పాటకు ముందు వచ్చే సీన్ ఇష్టం’.
ప్రభాస్ స్వీట్..
‘ప్రభాస్తో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నా. ఆయనతో పనిచేయడం చాలా సరదాగా ఉంది, ప్రభాస్ చాలా స్వీట్. ఆ సినిమాకు సంబంధించి రెండు షెడ్యూళ్లు పూర్తయ్యాయి. ఒకటి ఇటలీలో, మరొకటి హైదరాబాద్లో జరిగింది. త్వరలో మూడో షెడ్యూల్ ప్రారంభం కాబోతోంది. ఆ సినిమా వాయిదా పడటం నాకు ఇబ్బందిగా ఏమీ అనిపించలేదు. నా కాల్ఫీట్కు ఇబ్బందిరాలేదు. మరోపక్క అఖిల్తో కూడా నటిస్తున్నా. అతడు కూడా చాలా సరదాగా ఉంటాడు’.
అలా ఎప్పుడూ అనుకోను
‘నాకు విభిన్నమైన పాత్రలు చేయాలని ఉంది. దానికి తగ్గట్టే సినిమాలకు సంతకం చేస్తున్నా. తెలుగులో కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలు తక్కువగా ఉన్నాయి. అలాంటి సినిమాలు నేను నటించలేనని ఎప్పుడూ అనుకోలేదు, అనుకోను. జీవితం ఎప్పుడూ అలా ఉండకూడదు. కొన్నిసార్లు సినిమా హిట్ అవ్వొచ్చు.. కానీ వసూళ్లు రాకపోవచ్చు. హిట్ టాక్ రాకపోయినా.. కలెక్షన్స్ సాధించిన సినిమాలు ఉన్నాయి. స్టార్ హీరోలు చేసిన సినిమాలు కూడా ఎన్నో ఫట్ అయ్యాయి. నాకు ఫలానా భాషలోనే నటించాలనే నియమం లేదు. ఓ ఇండియన్ యాక్టర్గా ఉండాలి అనుకుంటున్నా. తెలుగులోనే కాదు తమిళంలోనూ మంచి కథ వస్తే చేస్తా’.
ఒత్తిడి అనిపించలేదు
‘‘అరవింద సమేత’ షూటింగ్కు హైదరాబాద్కు రావడం సవాలు అయ్యింది. అప్పుడు ఎన్టీఆర్ తండ్రి కన్నుమూశారు. దీంతో సినిమా షెడ్యూల్ వాయిదా పడింది. అయినా సరే ఎన్టీఆర్ గ్యాప్ తీసుకోకుండా షూటింగ్కు వచ్చాడు. నిజంగా అతడికి హ్యాట్సాఫ్ చెప్పాలి. అప్పుడు నేను ‘హౌస్ఫుల్ 4’లో నటిస్తున్నా. జైపూర్లో ఆ షూటింగ్ జరుగుతోంది. ఆ సమయంలో అక్కడి షూటింగ్ పూర్తి చేసుకుని హైదరాబాద్కు రాత్రి 1.30కి వచ్చి.. ఉదయం 5కి నిద్రలేచి ‘అరవింద సమేత’ షూట్కు వెళ్లేదాన్ని. తిరిగి జైపూర్కు పరుగులు తీసేదాన్ని’.
‘హైవేలో ఒంటరిగా కారులో ప్రయాణాలు చేయాల్సి వచ్చేది. అప్పుడు నాతో నా హెయిర్ స్టైలిస్ట్ మాత్రం ఉన్నారు. మా అమ్మానాన్న భయపడుతూ ఉండేవారు. వారికి నా లైవ్ లొకేషన్ షేర్ చేసేదాన్ని. నువ్వెలా విశ్రాంతి లేకుండా పనిచేయగలుగుతున్నావని నన్ను చాలా మంది ప్రశ్నించారు. నాకు మాత్రం ఒత్తిడిగా కాదు.. ఉత్సుకతగా ఉండేది. ఉదయం షూటింగ్కు ముందు నిద్రలేచి ‘అరవింద సమేత’ డబ్బింగ్ చెప్పేదాన్ని. ఒక్కరోజులో మూడు షిఫ్ట్లు చేశా. శ్రీదేవి తర్వాత మూడు షిఫ్ట్లలో చేసిన నటి నువ్వే అని అందరూ అన్నారు’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
తాజా వార్తలు (Latest News)
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి
-
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
-
టీఎస్బీపాస్తోనే అనుమతులు.. డీపీఎంఎస్ విధానం పూర్తిగా నిలుపుదల