మహేశ్‌ కోసం సెట్స్‌కు వెళ్లి స్పెషల్‌ పర్సన్‌నుకలిసి..

టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబును కలిసేందుకు ‘సరిలేరు నీకెవ్వరు’ సెట్స్‌కు ఆయన సోదరి మంజుల వెళ్లారు. అయితే సెట్‌లో విజయశాంతితో కలిసి దిగిన ఓ ఫొటోను ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు. 25 సంవత్సరాల తర్వాత విజయశాంతిని కలవడం చాలా సంతోషంగా ఉందని..

Published : 04 Jan 2020 21:44 IST

కొన్ని బంధాలను మెరుగుపరచుకోవాలి: మంజుల ఘట్టమనేని

హైదరాబాద్‌: టాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబును కలిసేందుకు ‘సరిలేరు నీకెవ్వరు’ సెట్స్‌కు ఆయన సోదరి మంజుల వెళ్లారు. ఆ సెట్‌లో విజయశాంతితో కలిసి దిగిన ఓ ఫొటోను ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు. 25 సంవత్సరాల తర్వాత విజయశాంతిని కలవడం చాలా సంతోషంగా ఉందని మంజుల పేర్కొన్నారు. ‘మా సోదరుడు మహేశ్‌ను కలిసేందుకు ‘సరిలేరు నీకెవ్వరు’ సెట్‌కు వెళ్లాను. అక్కడ విజయశాంతిని కలిశాను. మేమిద్దరం కలిసి ‘రాజస్థాన్‌’ అనే తమిళ చిత్రంలో పనిచేశాం. 25 ఏళ్ల తర్వాత నేడు ఆమెను  కలిశాను. మేము నిన్నే కలిసినట్టు అనిపిస్తోంది. కొన్ని బంధాలను ఎప్పటికీ మెరుగుపరచుకోవాలి.’ అని మంజుల పేర్కొన్నారు.

మహేశ్‌ కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. మేజర్‌ అజయ్‌ కృష్ణ పాత్రలో మహేశ్‌ కనిపించనున్న ఈ సినిమాలో విజయశాంతి ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు. రష్మిక కథానాయిక. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దిల్‌రాజు, మహేశ్‌బాబు, అనిల్‌ సుంకర నిర్మాతలుగా వ్యవహరించారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని