అది హృదయానికి చేరువగా ఉంటుంది: చైతన్య

తాను కథానాయకుడిగా నటించిన ఓ సినిమా తన హృదయానికి ఎప్పటికీ ఎంతో చేరువగా ఉంటుందని టాలీవుడ్‌ యువ కథానాయకుడు నాగచైతన్య అన్నారు. వివాహమైన తర్వాత తన సతీమణి సమంతతో కలిసి ఆయన నటించిన మొదటి సినిమా ‘మజిలీ’ విడుదలై నేటితో సంవత్సరమైంది....

Published : 05 Apr 2020 16:42 IST

ట్వీట్‌ చేసిన హీరో

హైదరాబాద్‌: తాను కథానాయకుడిగా నటించిన ఓ సినిమా తన హృదయానికి ఎప్పటికీ ఎంతో చేరువగా ఉంటుందని టాలీవుడ్‌ యువ కథానాయకుడు నాగచైతన్య అన్నారు. వివాహమైన తర్వాత తన సతీమణి సమంతతో కలిసి ఆయన నటించిన మొదటి సినిమా ‘మజిలీ’ విడుదలై నేటితో సంవత్సరమైంది. ‘మజిలీ’ చిత్రం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సోషల్‌మీడియాలో సదరు చిత్రానికి సంబంధించిన ఓ కామన్‌ డీపీ చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో నాగచైతన్య ట్విటర్‌ వేదికగా ఓ ట్వీట్‌ పెట్టారు. ‘‘మజలీ’ చిత్రం ఏడాది పూర్తయిన సందర్భంగా స్పెషల్‌ పోస్టర్‌ను రూపొందించిన వారందరికీ నా ధన్యవాదాలు. ‘మజిలీ’ని నా గేమ్‌ ఛేంజర్‌ చిత్రంగా మలిచినందుకు థ్యాంక్యూ. ఎప్పటికీ ఇది నా హృదయానికి చేరువగా ఉంటుంది. ఇంట్లోనే ఉండండి.. జాగ్రత్తలు పాటించండి’ అని చైతన్య ట్వీట్‌ చేశారు.

‘నిన్నుకోరి’ ఫేం శివనిర్మాణ దర్శకత్వం వహించిన ‘మజిలీ’ చిత్రంలో నాగచైతన్య, సమంత నటీనటులుగా నటించారు. ఇందులో సమంత, నాగచైతన్య భార్యాభర్తలుగా నటించగా.. నాగచైతన్య ప్రియురాలిగా దివ్యాన్ష కౌశిక్‌ మెప్పించారు. విభిన్న ప్రేమకథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమా గతేడాది ఏప్రిల్‌ 5న విడుదలై మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకి గోపీ సుందర్‌ స్వరాలు అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని