Vani jayaram: బీటౌన్ రాజకీయాలు చూడలేక మద్రాస్కు తిరిగి వచ్చేసిన వాణీ జయరాం
ఎన్నో వేల పాటలు ఆలపించి.. తన మధురమైన గాత్రంతో సినీ ప్రేక్షకులను అలరించిన గాయని వాణీ జయరామ్ (Vani Jayaram). దక్షిణాదికి చెందిన ఆమె బాలీవుడ్లో ఎంతోమంది గొప్ప సంగీత దర్శకుల సారథ్యంలో పాటలు ఆలపించి ఖ్యాతి సొంతం చేసుకున్నారు.
ఇంటర్నెట్డెస్క్: ‘ఆనతి నీయరా హరా’, ‘ఎన్నెన్నో జన్మల బంధం’, ‘దొరకునా ఇటువంటి సేవ’, ‘తెలిమంచు కరిగింది’.. ఇలా ఎన్నో మధురమైన పాటలు ఆలపించి తెలుగువారి మదిలో ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నారు ప్రముఖ గాయని వాణీ జయరాం (Vani jayaram). దక్షిణాదికి చెందిన ఆమె వివాహం తర్వాత ముంబయికి వెళ్లి హిందీ సినిమాల్లో (Bollywood) ఎన్నో పాటలు పాడి.. కొన్నేళ్లపాటు అక్కడ అగ్రస్థానంలో కొనసాగారు. ఈ క్రమంలోనే ఎదురైన పలు చేదు అనుభవాలు తట్టుకోలేక మళ్లీ తాను మద్రాసుకు వచ్చేసినట్లు గతంలో ఇచ్చిన పలు ఇంటర్వ్యూల్లో వాణీ తెలిపారు. ఆమె అకాలమరణంతో సినీ పరిశ్రమలో విషాదం నెలకొన్న వేళ.. తన కెరీర్ గురించి వాణీ జయరామ్ గతంలో పలు సందర్భాల్లో పంచుకున్న విశేషాలు మీకోసం.
చిన్నప్పుడే ఆ మాట చెప్పారు..!
‘‘1945 నవంబర్ 30న నేను జన్మించాను. నా అసలు పేరు కలైవాణి. మా తల్లిదండ్రుల పేర్లు పద్మావతి, దొరస్వామి. మా అమ్మకు సంగీతంలో ప్రావీణ్యం ఉండేది. నా తొలి గురువు ఆమే. చిన్నతనంలోనే నా సంగీత పరిజ్ఞానం చూసి పురోహితులకు జాతకం చూపించగా.. నేను పెద్ద గాయకురాలిని అవుతానని చెప్పారు. అలా, ఐదేళ్ల వయసులోనే సంగీతం నేర్చుకున్నా’’
ఆ పాటలు వింటే అపచారం చేసినట్టే..!
‘‘శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నా, చిన్నప్పటి నుంచి నాకు సినిమా పాటలంటేనే ఎక్కువ మక్కువ. లతా మంగేష్కర్, రఫీ, నూర్జహాన్ పాటలు వినడానికి ఇష్టపడేదాన్ని. అయితే, మా ఇంట్లో సినిమా పాటలు పాడటం, వినడం నిషేధం. ఆ పాటలు వింటే ఏదో అపచారం చేసినట్లు భావించేవారు. ఎవరికీ తెలియకుండా సౌండ్ తగ్గించి రేడియోలో సినిమా పాటలు వినేదాన్ని’’
ఆ మధుర జ్ఞాపకం మర్చిపోను..!
‘‘పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నా తల్లిదండ్రులు మద్రాసుకు మకాం మార్చారు. ఆ సమయంలో నేను వీలు దొరికినప్పుడల్లా రేడియోలో కచేరీలు ఇచ్చేదాన్ని. అలా, ఓసారి ఘంటసాలను కలిశాను. ఆయన వద్దకు వెళ్లి.. ‘‘అంకుల్ నాకోసం ఓ పాట పాడారా’’ అని అడిగాను. ఆయన పాడి వినిపించారు. అలాగే కళాశాలలో చదువుతున్నప్పుడు ఓ సంగీత కచేరీ కోసం ఘంటసాల గారి తంబూర వాయించాను. ఆ రెండు విషయాలను ఎప్పటికీ మర్చిపోను’’
తొలి ఉద్యోగం..!
‘‘డిగ్రీ పాసైన తర్వాత భారతీయ స్టేట్ బ్యాంకులో నాకు ఉద్యోగం వచ్చింది. కొంతకాలం తర్వాత బదిలీలో భాగంగా సికింద్రాబాద్ వచ్చాను. ఇక్కడే నా వివాహం జరిగింది. నా భర్త పేరు జయరాం. మాది పెద్దలు కుదిర్చిన వివాహం. ఆయన ప్రోత్సాహంతోనే సినిమాల్లో పాటలు పాడగలిగాను. మావారి ఉద్యోగ రీత్యా.. వివాహమైన వెంటనే ముంబయికి వెళ్లిపోయాను. మా వారికి సంగీతమంటే ప్రాణం. పండిట్ రవిశంకర్ వద్ద ఆరేళ్లు సితార్ నేర్చుకున్నారు. ఆయన చొరవతోనే వివాహమైన తర్వాత వసంత్దేశాయ్ వద్ద సాధన మొదలుపెట్టాను. శిక్షణకు ఇబ్బంది అవుతోన్న కారణంగా బ్యాంకు ఉద్యోగాన్ని సైతం వదులుకున్నాను’’
‘గుడ్డి’లో తొలి అవకాశం..!
‘‘వసంత్దేశాయ్ సాయంతో ‘గుడ్డి’ అనే హిందీ సినిమాతో గాయకురాలిగా పరిశ్రమలోకి అడుగుపెట్టాను. అందులో నేను పాడిన పాటలు శ్రోతల మదిని గెలిచాయి. ముఖ్యంగా అందులోని ‘బోలే రే పపీ హరా’ పాటకు నాకు ఎన్నో అవార్డులు వచ్చాయి. దాని తర్వాత ప్రముఖ సంగీత దర్శకులు ఆర్.డి.బర్మన్, లక్ష్మీకాంత్ ప్యారేలాల్ వద్ద పాటలు పాడే అవకాశం లభించింది’’
దక్షిణాదిలో తొలి సినిమా..!
‘‘స్వప్నం’ అనే మలయాళీ చిత్రం కోసం మొదటిసారి దక్షిణాదిలో పాట పాడాను. ఆ తరువాత రోజే ‘తాయుంసేయుమ్’ అనే తమిళ సినిమా కోసం పాట పాడాను. నా దురదృష్టం కొద్దీ ఆ సినిమా విడుదల కాలేదు. ‘స్వప్నం’ పాటలు బాగా ప్రాచుర్యం సొంతం చేసుకున్నాయి. దర్శకుడు కోదండపాణి తెరకెక్కించిన ‘అభిమానవంతులు’తో తెలుగువారికి పరిచయం అయ్యాను. ఈ సినిమా తర్వాత ‘నోము’, ‘పూజ’, ‘మరో చరిత్ర’, ‘సీతామాలక్ష్మి’, ‘శంకరాభరణం’, ‘సీతాకోక చిలుక’, ‘ఘర్షణ’, ‘స్వర్ణ కమలం’, ‘స్వాతికిరణం’ వంటి చిత్రాల కోసం తెలుగులో పాటలు పాడాను’’
లతాజీతో గొడవ..!
‘‘నా పాటలు మంచి ఆదరణ పొందేసరికి తనకి ఎక్కడ పోటీగా వస్తానోనని ప్రముఖ గాయని లతా మంగేష్కర్ (Lata Mangeshkar) భయపడ్డారు. ‘గుడ్డి’లో నా పాటలు ప్రజాదరణ పొందాక.. ఆమె ఆశీస్సులు తీసుకోవడానికి వెళ్లాను. కాకపోతే నన్ను కలవడానికి ఆమె ఆసక్తి చూపించలేదు. 1979లో విడుదలైన ‘మీరా’ మా మధ్య మరింత దూరాన్ని పెంచింది. ‘మీరా’ చిత్రానికి పండిట్ రవిశంకర్ను సంగీత దర్శకుడిగా పెట్టుకున్నారు దర్శకుడు గుల్జార్. అయితే అది లతా మంగేష్కర్కు నచ్చలేదు. తన సోదరుడిని మ్యూజిక్ డైరెక్టర్గా తీసుకోకపోతే ఈ సినిమాలో తాను పాటలు పాడనని చెప్పారు. దాంతో గుల్జార్ నాతో ఆ సినిమాలోని పాటలన్నీ పాడించారు. అలా, లతాజీకి నాపై కోపం ఎక్కువైంది. కొన్నాళ్లుకు బాలీవుడ్లో రాజకీయాలు చూసి విసుగు వచ్చేసి మద్రాస్కు తిరిగి వచ్చేశాను’’
19 భాషలు వేల పాటలు..!
‘‘మద్రాసుకు వచ్చిన తర్వాత దక్షిణాది చిత్రాల్లో పాటలు పాడాను. అప్పటికే దర్శకుడు కె.బాలచందర్ తెరకెక్కించిన ‘అపూర్వ రాగంగళ్’లో నేను ఆలపించిన పాటలకు మంచి గుర్తింపు లభించింది. ఆ చిత్రానికి గానూ జాతీయ అవార్డు కూడా అందుకున్నాను. తెలుగులోనూ ‘శంకరభరణం’లోని ‘మానస సంచరరే’ , ‘స్వాతి కిరణం’ ‘ఆనతి నీయరా హరా’ పాటలకు ఉత్తమ గాయనిగా నేషనల్ అవార్డులు పొందాను. వరుస సినిమాల్లో పాటలు పాడుతూ గాయనిగా ఎంతో బిజీ అయ్యాను. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, గుజరాతీ, మరాఠీ మాత్రమే కాకుండా దాదాపు 19 భాషల్లో కొన్ని వేల పాటలు ఆలపించాను’’
మంగళగిరి చీరలంటే మక్కువ..!
‘‘గుంటూరు జిల్లా మంగళగిరి చేనేతలంటే నాకు చాలా ఇష్టం. ఎక్కువగా ఆ చీరలే ధరిస్తుంటాను. నాకు కవిత్వాలు, పాటలు రాయడమంటే ఆసక్తి. వీలు కుదిరినప్పుడు పాటలు రాస్తుంటాను. అప్పుడప్పుడూ పెయింటింగ్ వేస్తుంటాను’’
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యువతరం.. వైవిధ్యమే తొలి విజయం: స్టార్ నటులు మెచ్చిన యంగ్ హీరోలెవరంటే?
విభిన్న కథలను ఎంపిక చేసుకుంటూ విజయాన్ని అందుకుంటున్న యంగ్ హీరోలపై ప్రత్యేక కథనం.. -
ఎవరీ అశ్వత్థామ.. కృష్ణుడు అతడికి ఇచ్చిన శాపం ఏంటి?
ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). ఇందులో ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా (Ashwathama) కనిపించనున్నారు. -
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
ప్రముఖ నటులు కొందరు కలిసి నటిస్తున్న చిత్రాలపై ప్రత్యేక కథనం. ఎవరెవరు ఏయే సినిమాల్లో నటిస్తున్నారంటే? -
నాయికలు ‘తెర’ పంచుకుంటే.. వినోదం పెంచినట్టే
త్వరలో విడుదల కాబోయే సినిమాలు ప్రేక్షకులకు రెట్టింపు వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నాయి. అందుకు కారణం ఒకే మూవీలో ఇద్దరు/ ముగ్గురు హీరోయిన్లు కలిసి నటిస్తుండటమే.. -
సీనియర్ హీరోయిన్ల జోరు ‘తగ్గేదే లే’.. ఎవరెన్ని సినిమాలతో బిజీగా ఉన్నారంటే?
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లపై ప్రత్యేక కథనం. త్రిష, నయనతార, తమన్నా.. ఇలా ఎవరెవరు ఎన్ని సినిమాలతో సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారంటే? -
పృథ్వీరాజ్ సుకుమారన్ బెస్ట్ మూవీస్.. ఇప్పుడు ‘ఆడుజీవితం’.. ఇంతకుముందు?
పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఉత్తమ చిత్రాలు ఏంటంటే..? -
ఆ అవార్డు అందుకున్న తొలి వ్యక్తిని నేనే అని తెలిసి షాకయ్యా.. అల్లు అర్జున్
నటుడు అల్లు అర్జున్ (Allu Arjun) పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన పలు ఆసక్తికర విశేషాలు. -
రికార్డుల్లోనూ ఫస్టే ఈ నేషనల్ క్రష్.. రష్మిక ఖాతాలో ఘనతలెన్నో!
రష్మిక పుట్టినరోజు సందర్భంగా ఆమె సొంతంచేసుకున్న కొన్ని రికార్డులను చూద్దాం.. -
రామ్ చరణ్ బర్త్డే.. ఆయన బాల్యం గురించి ఈ విశేషాలు తెలుసా..?
టాలీవుడ్ ప్రముఖ హీరో రామ్ చరణ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలు.. -
Challenging Roles: పాత్రలకు ప్రాణం పోశారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఇలా.. విక్రమ్ అలా!
పాత్రలకు ప్రాణం పోసేందుకు మానసికంగా, శారీరకంగా ఎంతగానో శ్రమించిన నటులు, వారి సినిమాల వివరాలివీ.. -
Tollywood Actresses: అగ్ర నాయికలు అలా రూటు మార్చి.. హాట్టాపిక్గా నిలిచి!
అగ్ర కథానాయిక- వర్ధమాన హీరో కాంబినేషన్లో వచ్చిన సినిమాల విశేషాలు.. -
Actors turned Directors: ధనుష్, ఉపేంద్ర, కంగన.. మళ్లీ మరో కోణాన్ని చూపించేందుకు...
స్వీయ దర్శకత్వంలో నటించిన హీరో/హీరోయిన్పై ప్రత్యేక కథనం. ఎవరు ఏ సినిమాతో అలరించేందుకు సిద్ధమయ్యారంటే? -
Alia Bhatt: అందుకు క్లాస్లో బెంచీలు తుడిచి.. బ్యాగ్రౌండ్ ఉన్నా ఆడిషన్ ఇచ్చి: అలియా భట్ బర్త్డే స్పెషల్
అలియా భట్ పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించి పలు విశేషాలు.. -
Mamitha Baiju: గిరిజ, సాయి పల్లవిలా మమితా బైజు.. రాజమౌళి మెచ్చిన ఈ నటి ఎవరు?
యంగ్ హీరోయిన్ మమితా బైజును అగ్ర దర్శకుడు ప్రశంసించడం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఎవరీ నటి? -
Comedians as Heros: కమెడియన్లు.. కథానాయకులై.. ఎవరెవరు ఏ సినిమాతో అలరించారంటే?
కమెడియన్లుగా కెరీర్ని ప్రారంభించి హీరోగాను సినిమాలు చేస్తున్న నటులపై ప్రత్యేక కథనం.. -
Krystyna Pyszkova: మనిషే కాదు.. మనసూ అందమే: మిస్ వరల్డ్ క్రిస్టినా గురించి ఆసక్తికర విశేషాలివీ
ప్రపంచ సుందరి-2024 కిరీటం దక్కించుకున్న క్రిస్టినా పిస్కోవా గురించి ఆసక్తికర విశేషాలు మీకోసం.. -
Miss World Pageant: తొలుత ‘బికినీ కాంటెస్ట్’గా.. 28 ఏళ్ల తర్వాత భారత్ ఆతిథ్యం.. ‘మిస్ వరల్డ్’ పోటీల సంగతులివీ!
భారత్ ఆతిథ్యంలో 71వ ఎడిషన్ ‘మిస్ వరల్డ్’ పోటీలు జరుగుతున్నాయి. శనివారం విజేతను ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా ఈ అందాల పోటీల గురించి పలు ఆసక్తికర విశేషాలు.. -
Sini Shetty: మిస్ వరల్డ్ పోటీలు.. ‘బెస్ట్ డిజైనర్ డ్రెస్’ విజేతగా సినిశెట్టి
మిస్ వరల్డ్ 2024 పోటీల్లో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న సినిశెట్టి గురించి ఆసక్తికర విశేషాలివీ.. -
Movies in March: మార్చిలో మురిపించే చిత్రాలు.. వరుణ్ తేజ్ అలా.. ‘టిల్లు’ ఇలా!
మార్చిలో విడుదల కానున్న సినిమాలపై ప్రత్యేక కథనం. ఏ హీరో చిత్రం ఏ రోజు ప్రేక్షకుల ముందుకు రానుందంటే? -
Valentine Day: వాలంటైన్స్ డేకు రీరిలీజ్ కానున్న ప్రేమకథా చిత్రాలివే..
వాలంటైన్స్ డే సందర్భంగా గతంలో అలరించిన ప్రేమ కథాచిత్రాలు మరోసారి వినోదాన్ని పంచేందుకు సిద్ధమయ్యాయి. -
తొలి సినిమా ఫ్లాప్.. ‘బండమొహం వీడేం హీరో’ అన్నారు.. రీల్ కెరీర్ To పొలిటికల్ ఎంట్రీ.. విజయ్ లైఫ్ జర్నీ ఇదే!
Actor vijay: తల్లిదండ్రులకు సినీ నేపథ్యం ఉన్నా, నటుడిగా తనకంటూ తమిళనాట గుర్తింపు తెచ్చుకున్న విజయ్.. రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఈ క్రమంలో ఇప్పటివరకూ ఆయన లైఫ్ జర్నీ ఎలా సాగింది?
తాజా వార్తలు (Latest News)
-
పది కిలోల బంగారం స్వాధీనం
-
భారత్ ఎన్నికల వేళ పాకిస్థాన్ అక్కసు.. ప్రసంగాల్లో వాళ్లపేరు లాగొద్దట!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
-
దలైలామా ప్రతినిధులతో మాత్రమే చర్చిస్తాం: చైనా