Janhvi Kapoor: 3న పాజిటివ్‌, 11న నెగెటివ్‌.. కొవిడ్‌ను జయించిన జాన్వీ ఏం చెప్పిందంటే?

తాను, తన సోదరి ఖుషి కపూర్‌ కరోనా నుంచి కోలుకున్నామని బాలీవుడ్‌ నటి, నిర్మాత బోనీ కపూర్‌ తనయ జాన్వీ కపూర్‌ తెలిపారు.

Published : 11 Jan 2022 19:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తాను, తన సోదరి ఖుషి కపూర్‌ కరోనా నుంచి కోలుకున్నామని బాలీవుడ్‌ నటి, నిర్మాత బోనీ కపూర్‌ తనయ జాన్వీ కపూర్‌ తెలిపారు. తమకు జనవరి 3న కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని, 8 రోజుల హోమ్‌ ఐసోలేషన్‌ తర్వాత పరీక్ష చేయించుకోగా నెగెటివ్‌గా తేలిందని వెల్లడించారు. ఈ వైరస్‌ నుంచి రక్షణ పొందాలంటే తప్పకుండా మాస్క్‌ పెట్టుకోవాలని, వ్యాక్సిన్‌ తీసుకోవాలన్నారు. ఈ మేరకు సోషల్‌ మీడియా వేదికగా తన ఐసోలేషన్‌ అనుభవాన్ని పంచుకున్నారు. ‘‘నేనూ నా సోదరి జనవరి 3న కరోనా బారిన పడ్డాం. ఇప్పటి వరకూ హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నాం. తాజా పరీక్షల్లో మా ఇద్దరికీ కొవిడ్‌ నెగెటివ్‌ వచ్చింది. ఐసోలేషన్‌లో తొలి రెండు రోజులు చాలా కష్టంగా గడిచాయి. తర్వాత కాస్త బెటర్‌ అనిపించింది. ఈ వైరస్‌ నుంచి మనల్ని మనం రక్షించుకునేందుకు మాస్క్‌ పెట్టుకోవటం, వ్యాక్సిన్‌ తీసుకోవటమే సరైన మార్గం. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండండి’’ అని జాన్వీ కపూర్‌ విజ్ఞప్తి చేసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని