‘జాతి రత్నాలు’ గుర్తుండిపోయే సినిమా: విజయ్‌

‘జాతి రత్నాలు’ సినిమా అందరికీ గుర్తుండిపోయే సినిమా అవుతుందని.. అందరూ థియేటర్లలో చూడాలని రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ అన్నారు. నవీన్‌ పొలిశెట్టి, ఫారియా అబ్దుల్లా జంటగా నటించారు. అనుదీప్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రియదర్శి,

Published : 07 Mar 2021 22:40 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ‘జాతి రత్నాలు’ సినిమా అందరికీ గుర్తుండిపోయే సినిమా అవుతుందని, అందరూ థియేటర్లలో చూడాలని రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ అన్నాడు. నవీన్‌ పొలిశెట్టి, ఫారియా అబ్దుల్లా జంటగా నటించారు. అనుదీప్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. స్వప్న సినిమాస్‌ పతాకంపై నాగ్‌ అశ్విన్‌ నిర్మించారు. రాధన్‌ స్వరాలు సమకూర్చారు. మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం హన్మకొండలో ప్రిరిలీజ్‌ వేడుక ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి విజయ్‌దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.

ఈ సందర్భంగా విజయ్‌ మాట్లాడుతూ.. ‘‘ఏడాది పాటు థియేటర్లు మూతపడి ఉంటే మేమంతా ఎంతో భయపడ్డాం. కానీ.. మీరు ఆ భయాలన్నీ తొలిగిపోయేలా చేశారు. థియేటర్లు తెరవగానే ఇన్ని సినిమాలు విడుదలవడం, ఇన్ని హిట్లు రావడం మన దగ్గర తప్ప మరెక్కడా లేదు. తెలుగు ప్రేక్షకులను మించిన వాళ్లు లేరు. ‘జాతి రత్నాలు’ గురించి చెప్పాలంటే.. వీళ్లంతా నా కుటుంబ సభ్యుల్లాంటివాళ్లు. నవీన్‌, ప్రియదర్శి, రాహుల్‌.. మేమంతా చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి ఈ స్థాయికి వచ్చాం. ఇది మీ అందరికీ గుర్తుండిపోయే సినిమా అవుతుంది. మార్చి 11న థియేటర్లకు వెళ్లి సినిమా చూడండి’ అని విజయ్‌ అన్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని