Karthikeya 2: ఆ చిరు ప్రయత్నమే ‘కార్తికేయ 2’.. వారికీ ఈ చిత్రం అర్థమవుతుంది: చందు
చందు మొండేటి ఇంటర్వ్యూ. ‘కార్తికేయ 2’ సినిమా గురించి ఆయన చెప్పిన విశేషాలివీ..
ఇంటర్నెట్ డెస్క్: చందు మొండేటి (Chandoo Mondeti).. తొలి చిత్రం ‘కార్తికేయ’తో దర్శకుడిగా అందరి దృష్టిని ఆకర్షించారు. ‘ప్రేమమ్’, ‘సవ్యసాచి’ సినిమాలతో ప్రేక్షకులకు కొత్త అనుభూతి పంచారు. ఇప్పుడు ‘కార్తికేయ 2’తో (Karthikeya 2) థ్రిల్ పంచేందుకు సిద్ధమయ్యారు. నిఖిల్ (Nikhil Siddharth), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameshwaran) జంటగా చందు తెరకెక్కించిన ఈ సినిమా ఈ శనివారం విడుదల కానుంది. ఈ సందర్భంగా చందు మీడియాతో పలు విశేషాలు పంచుకున్నారు.
అంచనాలకు తగ్గట్టు..
విజయవంతమైన చిత్రానికి కొనసాగింపుగా మరో చిత్రం వస్తుందంటే ప్రేక్షకుల్లో ఆసక్తి పెరుగుతుంది. కథ, విజువల్స్.. ఇలా అన్ని విషయాల్లోనూ వారు ఏం ఆశిస్తారో అంచనా వేసుకొని దానికి తగ్గట్టు తెరకెక్కించాల్సి వస్తుంది. ‘కార్తికేయ’ క్రేజ్ని దృష్టిలో పెట్టుకుని ఈ సీక్వెల్ రూపొందించా. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు వచ్చిన స్పందన చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది.
శ్రీ కృష్ణుడి గురించి..
అంతుచిక్కని రహస్యాల గురించి తెలుసుకోవడం, అడ్వెంచర్ కథలు చదవటమంటే నాకు బాగా ఇష్టం. వాటితోపాటు మహాభారతం, రామాయణం చదువుతూ పెరిగా. ఆ ఇతిహాసాలకు నాదైన శైలిలో థ్రిల్లింగ్ అంశాలు జోడించి సినిమాలు చేయాలనుకుంటుంటా. అలా శ్రీ కృష్ణుడి గురించి ఈ సినిమాలో చెప్పాలనుకున్నా. ఈ ఆలోచనని ముందుగా నిఖిల్తోనే పంచుకున్నా. బడ్జెట్ని దృష్టిలో పెట్టుకుని పక్కా ప్రణాళికతో ఈ సినిమా నిర్మించాం.
మరిన్ని సీక్వెల్స్..!
‘కార్తికేయ’, ‘కార్తికేయ 2’.. ఈ రెండు సినిమాల కథలు వేరు. కానీ, హీరో పాత్ర ఒకేలా ఉంటుంది. హీరో అందులో మెడికల్ స్టూడెంట్.. ఇందులో డాక్టర్. ‘కార్తికేయ’ను చూడని వారికీ ఈ సీక్వెల్ అర్థమవుతుంది. కృష్ణుడు ఉన్నాడా, లేడా? అనేది చాలామందికి ఉన్న సందేహం. దాని గురించే చెప్పే చిరు ప్రయత్నమే ఈ సినిమా. ఈ చిత్రానికి దక్కే ప్రేక్షకాదరణపై తదుపరి సీక్వెల్స్ ఆధారపడి ఉన్నాయి.
అందుకే అనుపమ్ ఖేర్
ఈ సినిమాలోని కీలక సన్నివేశాలు కొన్ని.. హిమాచల్ ప్రదేశ్ నేపథ్యంలో సాగుతాయి. వాటిల్లో నటించేందుకు అనుపమ్ ఖేర్ అయితేనే బాగుంటుందనిపించింది. మరోవైపు, ఇది పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలనుకున్న చిత్రం కాబట్టి హిందీ ప్రేక్షకులకు తెలిసిన ఓ నటుడు ఉంటే ప్లస్ అవుతుందనుకున్నాం. పాత్రకు తగ్గ న్యాయం చేశారాయన. అనుపమ్ పాత్ర నిడివి తక్కువే అయినా మంచి ప్రభావం చూపుతుంది. పార్ట్ 1లోని పాత్రలన్నింటినీ పార్ట్ 2లో చూపించాలంటే కష్టం. అందుకే ‘కార్తికేయ’లో హీరోయిన్గా నటించిన స్వాతి పాత్ర ‘కార్తికేయ 2’లో ఉండదు.
వారంతా చూస్తే ఆనందం..
ఈ చిత్రం విడుదల పలుమార్లు వాయిదా పడినా నేను ఒత్తిడికి గురికాలేదు. ఓ దర్శకుడిగా కొంత అనుభవం ఉంది కాబట్టి టెన్షన్ అనిపించలేదు. ఇప్పటి వరకూ మా సినిమా విషయంలో అంతా మంచే జరిగింది అనుకుంటున్నా. ఈ చిత్రాన్ని 15 ఏళ్లలోపు వారు ఎంత ఎక్కువ మంది చూస్తే నాకు అంత ఆనందం. పిల్లలు తెలుసుకోవాల్సిన విషయాలు ఈ చిత్రంలో చాలా ఉన్నాయి.
తదుపరి ప్రాజెక్టులు..
ప్రస్తుతానికి రెండు కథల్ని సిద్ధం చేశా. వాటిల్లోని ఓ కథతో గీతా ఆర్ట్స్ నిర్మాణ సంస్థలో ఓ చిత్రం చేయబోతున్నా. హీరోహీరోయిన్ల వివరాలు నిర్మాణ సంస్థే ప్రకటిస్తుంది. ఫలానా నేపథ్యంలోనే సినిమాలు చేయాలని ఎప్పుడూ అనుకోను. నాకు ఏ పాయింట్ నచ్చితే ఆ తరహాలోనే కథల్ని రాసుకుంటా. ఎప్పటికైనా పూర్తిస్థాయి కామెడీ చిత్రాన్ని తీయాలనే కోరిక ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
తాజా వార్తలు (Latest News)
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
-
ఎయిర్ గెశ్చర్స్తో రియల్మీ నుంచి బడ్జెట్ కొత్త ఫోన్
-
రివ్యూ: రత్నం.. విశాల్ నటించిన యాక్షన్ డ్రామా మెప్పించిందా?
-
డీజీసీఏ కొత్త రూల్.. విమాన టికెట్ల ధరలు తగ్గుతాయా?