Kotabommali PS: ఈ సినిమా ఎవరినీ టార్గెట్ చేసి తీసింది కాదు: అల్లు అరవింద్
శ్రీకాంత్, రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ కలిసి నటించిన చిత్రం ‘కోట బొమ్మాళి పి.ఎస్’. ఈ సినిమా టీజర్ విడుదల వేడుకను హైదరాబాద్లో నిర్వహించారు. ఈ వేదికపై అల్లు అరవింద్ మాట్లాడారు.
హైదరాబాద్: ‘కోట బొమ్మాళి పి.ఎస్’ (Kotabommali PS) చిత్రాన్ని ఒకరిని టార్గెట్ చేస్తూ తీయలేదని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) అన్నారు. ఆ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో ఆయన మాట్లాడారు. శ్రీకాంత్ (Srikanth), రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ (Shivani) ప్రధాన పాత్రల్లో దర్శకుడు తేజ మార్ని తెరకెక్కించిన చిత్రమిది. గీతా ఆర్ట్స్ 2 పతాకంపై బన్నీ వాసు, విద్య నిర్మించారు. నవంబరు 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్లో ఈవెంట్ నిర్వహించారు. దర్శకుడు అనిల్ రావిపూడి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
శుభ్మన్ గిల్తో డేటింగ్.. ఆ సారా నేను కాదు: సారా అలీఖాన్
ఈ వేడుకనుద్దేశించి అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘‘లింగి లింగి లింగిడి పాట ఈ సినిమాకే క్రేజ్ తీసుకొచ్చింది. ఎక్కడ విన్నా ఇదే పాట. టీజర్లోని డైలాగ్స్ బాగున్నాయి. అల్లు అరవింద్.. క్రికెటర్ ధోనీలాంటి వారు. ధోనీని చూసి టీమ్ అంతా బాగా ఆడుతుంది. అలాగే, అరవింద్ను చూస్తూ నిర్మాత బన్నీ వాసు సక్సెస్ అందుకున్నారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ని మరో స్థాయికి తీసుకెళ్లారు. అదే దారిలో ఎస్.కె.ఎన్ వచ్చాడు. ఇప్పుడు విద్య రాబోతున్నారు’’ అని అన్నారు.
అన్నీ డబ్బు కోసం కాదు: అల్లు అరవింద్
‘‘రాజకీయ నాయకులు పోలీసులను ఎలా వాడుకుంటున్నారోనన్న అంశం ఇతివృత్తంగా ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రానికి ‘పోలీస్ ఛేజెస్ పోలీస్’ టైటిల్ పెట్టమని చెప్పా. తెలుగు పేరు బాగుంటుందనే ఉద్దేశంతో ‘కోట బొమ్మాళి’ పెట్టారు. ‘ఎన్ని వసూళ్లు వస్తాయని ఈ సినిమా కోసం ఇంతగా కష్టపడుతున్నారు’ అని మా స్టాఫ్లో కొందరు అనుకున్నారు. అన్ని సినిమాలు డబ్బుల కోసమే కాదు అని నేను సమాధానమిచ్చా’’ అని పేర్కొన్నారు. అనంతరం అరవింద్, నిర్మాత బన్నీ వాసు, రాహుల్, శివానీ, తేజ మార్ని మీడియాతో ముచ్చటించారు. ఆ వివరాలివీ..
* ఏదైనా రాజకీయ పార్టీని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా నిర్మించారా?
బన్నీ వాసు: ఒక పార్టీని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టు చేయలేదు. తమ పార్టీ గురించే చూపించామని ఎవరైనా భుజాలు తడుముకుంటే నాకు సంబంధం లేదు. సమకాలీన రాజకీయాలు ఎలా ఉన్నాయో దాన్నే ప్రస్తావించాం.
అల్లు అరవింద్: ఓ పార్టీనో, ఓ ప్రాంతాన్నో ఉద్దేశించి ఈ సినిమా తీయలేదు. ఇండియన్ పొలిటికల్ సిస్టమ్లో పోలీసులను రాజకీయ నాయకులు ఎంత దారుణంగా చూస్తారు? పోలీసులు ఎంత ఇబ్బంది పడుతున్నారోనన్న నేపథ్యంలో రూపొందింది. ఎవరినీ టార్గెట్ చేసి తీసింది కాదు.
* ఇంతటి సీరియస్ స్టోరీలో ‘లింగిడి’ పాట పెట్టడానికి కారణం?
బన్నీ వాసు: పాటలే సినిమాని ప్రేక్షకులకు దగ్గర చేయగలుగుతాయి. ఈ చిత్రాన్నీ ఎక్కువ మందికి చేరువ చేయాలనే ఉద్దేశంతోనే ఈ పాటను పెట్టాం.
* మాతృక (మలయాళ సినిమా నాయట్టు) కథలో ఎన్ని మార్పులు చేశారు?
తేజ: ఆ సినిమా సోల్ని మాత్రమే తీసుకుని మన నేటివిటీకి తగ్గట్లు మార్పులు చేశాం.
* పోలీసు పాత్రలకు మీ ఫాదర్ (రాజశేఖర్) పెట్టింది పేరు. ఈ సినిమా కోసం మీరు ఖాకీ దుస్తులు ధరించడం ఎలా అనిపించింది?
శివాని: నాన్న పోలీసు పాత్రలతో మంచి గుర్తింపు పొందారు. తాత రియల్ పోలీసు. ఇందులో నేను కానిస్టేబుల్ పాత్ర పోషించా. నాన్నతో పోల్చి చూస్తారేమోనని టెన్షన్ పడేదాన్ని. బాగా నటించాననే అనుకుంటున్నా. ‘నా పరువు తీయకురా’ అని నాన్న సరదాగా అన్నారు.
* ‘గీతా ఆర్ట్స్’ మునుపటిలా పెద్ద సినిమాలు నిర్మించట్లేదనే విమర్శలపై మీరేమంటారు?
అల్లు అరవింద్: పెద్ద ప్రాజెక్టులు రెండు ఉన్నాయి. పలు కారణాల వల్ల అవి వాయిదా పడుతున్నాయి. చిన్న చిత్రాలు నిర్మించి మేం ఇండస్ట్రీని పోషించడమనేదేమీ లేదు. మా ప్రయాణం కొందరికి ఉపయోగపడుతుంది. మా ఉనికి కోసం మేం సినిమాలు చేస్తున్నాం. సినిమా బడ్జెట్లో హీరోలు 20 శాతమే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. హీరోల వల్ల సినిమా కాస్ట్ పెరిగిపోతోందనడం కంటే బడ్జెట్ పెంచిన సినిమాల్లో హీరోలు ఉంటున్నారు అని అనడం బెటరేమో. హీరోలు ఎవరైనా సరే పెద్ద స్కేల్లో చూపిస్తేనే తప్ప ప్రేక్షకులు సినిమాలను ఆదరించని పరిస్థితి.
* త్వరలోనే తెలంగాణలో ఎన్నికలు ఉన్నాయి. వాటిపై ఈ సినిమా ప్రభావం చూపుతుందా?
బన్నీ వాసు: నో కామెంట్స్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘పుష్పక విమానం’ లాంటి మూకీ చిత్రం చేయాలనుంది!
‘‘ఆద్యంతం వినోదం పంచుతూనే మంచి సందేశమిచ్చే చిత్రం ‘ఆ.. ఒక్కటీ అడక్కు’. పెళ్లి వెనకున్న ఓ సమస్యను.. దాని చుట్టూ జరుగుతున్న రూ.కోట్ల వ్యాపారాన్ని.. ఓ స్కామ్ను దీంట్లో వినోదాత్మకంగా చూపించాం. -
ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ తక్కువ.. ఆ ఖాళీని భర్తీ చేయాలనుకుంటున్నా!
faria abdullah interview: అల్లరి నరేశ్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ ‘ఆ ఒక్కటీ అడక్కు’ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో ఫరియా పంచుకున్న విశేషాలు.. -
పరిశ్రమను వదిలి వెళ్లాలనుకున్నా!
‘మురారి’, ‘ఇంద్ర’, ‘మన్మథుడు’లాంటి హిట్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నాయిక సోనాలీ బెంద్రే. చాలా ఏళ్ల విరామం తర్వాత ‘ది బ్రోకెన్ న్యూస్’ అనే సిరీస్తో తెరపై కనిపించింది. -
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు.
తాజా వార్తలు (Latest News)
-
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
‘మాకు పిల్లలు లేరు’.. వారి భవిష్యత్తు కోసమే మా తపన: మోదీ
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
ఎప్పుడూ తెలుపు రంగు ‘టీ-షర్ట్’ ఎందుకు..? రాహుల్ గాంధీ ఏం చెప్పారంటే..
-
హాసన సెక్స్ స్కాం.. ప్రజ్వల్పై బ్లూ కార్నర్ నోటీసు జారీ!