Leo2: ఇదేం ట్విస్ట్ లోకేషా... ‘లియో’ ఫ్లాష్ బ్యాక్ ఫేక్ అట!
Leo2 Update: ప్రస్తుతం ‘లియో’లో ఉన్న విజయ్ ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్ అసలైనది కాదని, వేరే ఉందని దర్శకుడు లోకేష్ కనగరాజ్ చెప్పారు.
ఇంటర్నెట్డెస్క్: ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో క్రేజ్ ఉన్న దర్శకుల్లో లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) ఒకరు. ఆయన దర్శకత్వంలో విజయ్ (Vijay) కథానాయకుడిగా నటించిన ‘లియో’ (leo) ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. మిశ్రమ స్పందనలు అందుకున్నా, ‘ఖైదీ’, ‘విక్రమ్’ మూవీల వల్ల వచ్చిన క్రేజ్ కారణంగా కలెక్షన్ల పరంగా రికార్డులు సృష్టిస్తోంది. తన సినిమాలోని పాత్రలతో లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (ఎల్సీయూ)ను సృష్టించిన లోకేష్ తాజాగా ‘లియో’ గురించి మాట్లాడుతూ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ప్రస్తుతం మనం సినిమాలో చూసిన ‘లియో’ ఫ్లాష్బ్యాక్ అసలైనది కాదట. ఫేక్ అట. పార్తిబన్ అలియాస్ లియో గురించి తెలుసుకునే క్రమంలో జైలులో ఉన్న హిదయరాజ్ (మన్సూర్ అలీఖాన్)ను ఫారెస్ట్ ఆఫీసర్ ఆండ్రూస్ (గౌతమ్ వాసుదేవ్ మేనన్)కలుస్తాడు. ఈ సందర్భంగా ‘నా దృష్టికోణం నుంచి లియో కథ ఇది’ అని అతడు చెబుతాడు. కానీ, ‘లియో’ అసలు జీవితం మరొకలా ఉంటుందని లోకేష్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ‘లియో2’లో దాని గురించి పూర్తిగా ఉంటుందన్నట్లు సూచనప్రాయంగా తెలిపారు. దీంతో సినిమా చూసిన ప్రేక్షకులు అందరూ ఇంత సినిమా తీసి, ‘ఇదేం ట్విస్ట్ లోకేషా...’ అంటూ ఆశ్చర్యపోతున్నారు.
అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారా?
భారీ అంచనాల మధ్య విడుదలైన ‘లియో’ (Leo) సగటు ఎల్సీయూ (LCU) అభిమానిని కాస్త నిరాశపరిచిన మాట వాస్తవం. అందుకు కారణం.. ‘లియో’ ఫ్లాష్ బ్యాక్ను పవర్ఫుల్గా ఎస్టాబ్లిష్ చేయలేదు. లియో తండ్రి ఆంటోనీ దాస్, బాబాయ్ హరోల్డ్ దాస్ పాత్రలను కూడా బలంగా తీర్చిదిద్దలేదు. దీనికి తోడు ఆంటోనీదాస్ మూఢనమ్మకాలను విశ్వసిస్తుంటాడు. అది సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి ఆసక్తి కలిగించదు. హీరో కంటే విలన్ బలంగా ఉన్నప్పుడే కథ రక్తికడుతుంది. ఆ విషయంలో లోకేష్ ‘లియో’ఫ్లాష్ బ్యాక్ను చుట్టేశారేమో అనిపించింది. ఈ క్రమంలో విజయ్ అభిమానులతో పాటు, ఎల్సీయూకు కనెక్ట్ అయిన వారిని తృప్తిపరిచేందుకు ‘లియో ఫ్లాష్బ్యాక్ అది కాదు’ అంటూ లోకేష్ కొత్త పల్లవి అందుకున్నారనిపిస్తోంది. ‘లియో’కు అసలైన, బలమైన ఫ్లాష్ బ్యాక్ ఉన్నప్పుడు దాన్ని ఇప్పుడు వచ్చిన సినిమాలోనే చూపించి ఉంటే బాగుండేది కదాని అభిప్రాయపడుతున్నారు. బహుశా ‘ఎల్సీయూ’ ఒత్తిడి నేపథ్యంలో దాన్ని విస్మరించి ఉండవచ్చు. ఇప్పుడు ‘లియో2’లో ఆ పాత్రకు సంబంధించిన అసలు హీరోయిజాన్ని ఎలివేట్ చేసే అవకాశం ఉంది. కానీ, ‘లియో2’ అనుకున్న త్వరగా రాకపోవచ్చు.
ఇటీవల వివిధ ఇంటర్వ్యూల్లో లోకేష్ పంచుకున్న వివరాల ప్రకారం.. ప్రస్తుతం ఆయన దృష్టి మొత్తం రజనీకాంత్ సినిమాపైనే ఉంది. ఇది వచ్చే ఏడాది సెట్స్పైకి వెళ్తుంది. దీని తర్వాత వెంటనే ‘ఖైదీ2’ మొదలవుతుంది. దాని తర్వాత ‘రోలెక్స్’ పాత్ర నేపథ్యంలో స్పెషల్ మూవీ చేస్తారు. ఇది పూర్తయితేనే ‘లియో2’కు ఛాన్స్ ఉంటుంది. అప్పటి పరిస్థితిని బట్టి పక్కన కూడా పెట్టవచ్చు. ఒకవేళ ఇప్పుడు చూపించిన లియో ఫ్లాష్బ్యాక్ ఫేక్ అయితే, ఒరిజినల్ ఫ్లాష్బ్యాక్లో ఆంటోనీదాస్, హరోల్డ్ దాస్ పాత్రలు మళ్లీ వస్తాయి. దీన్ని ‘విక్రమ్2’తో కనెక్ట్ చేస్తారు. ఎల్సీయూలో చివరి సినిమాగా అంటే ‘ది ఎండ్ గేమ్’ మాదిరిగా ‘విక్రమ్2’ను తెరకెక్కిస్తారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కిర్రాకు పుట్టిస్తున్న అషు.. కేక పెటిస్తున్న ఖుషీ..
social look: సామాజిక మాధ్యమాల వేదికగా మన సినీ తారలు పంచుకున్న ఆసక్తికర అప్డేట్స్ మీకోసం.. -
టాప్లో ప్రభాస్ మూవీ.. ప్రేక్షకులు వీటి కోసమే వేచి చూస్తున్నారట
Imdb top movies: ప్రముఖ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ ఐఎండీబీ ఆసక్తికర మూవీల జాబితాను విడుదల చేసింది. -
మేకప్ రూమ్లో బంధించారు.. నిర్మాతపై నటి ఆరోపణలు
నిర్మాత వేధింపుల కారణంగా బాలీవుడ్ డ్రామా షో ‘శుభ్ షగున్’ నుంచి బయటకు వచ్చేసినట్లు నటి కృష్ణ ముఖర్జీ తెలిపారు. -
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
ప్రేమ స్వభావం ఎలా ఉన్నప్పటికీ దానిని వదులుకోవడం చాలా కష్టమన్నారు అగ్ర కథానాయకుడు కమల్ హాసన్. -
హాలీవుడ్కు వెళ్లాక భయపడ్డా.. ఆ భావన మనసును కుంగదీసింది: ప్రియాంక చోప్రా
హాలీవుడ్కు వెళ్లిన తొలినాళ్లలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నట్లు స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తెలిపారు. -
ఆ సమయంలో 32 కిలోల బరువు పెరిగాను: సోనమ్ కపూర్
బరువు పెరిగినప్పుడు బాధపడినట్లు బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ తెలిపారు. -
అభిమానుల ప్రేమను పొందడం సులభం కాదు: సమంత
తన అభిమానులపై సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
కియారా కీలక పాత్ర.. అవన్నీ రూమర్సే!
కియారా అడ్వాణీ ఓ పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్ర పోషించనుందంటూ ప్రచారం జరిగింది. అది రూమరే అని స్పష్టత వచ్చింది. -
మహేశ్ బాబు, మమ్ముట్టి, షారుక్లతో సినిమా.. నెల్సన్ ప్లాన్ ఇదే..
ఇండస్ట్రీకి చెందిన ముగ్గురు హీరోలతో సినిమా తీయడం తన కల అని దర్శకుడు నెల్సన్ దిలీప్కుమార్ చెప్పారు. -
సూర్య చెప్పాకే జ్యోతిక ఈ చిత్రాన్ని ఓకే చేశారు: దర్శకుడు తుషార్ హీరానందానీ
‘శ్రీకాంత్’ చిత్రంలోని పాత్రను జ్యోతిక మొదట అంగీకరించలేదని.. సూర్య చెప్పాక ఓకే చేశారని ఆ చిత్ర దర్శకుడు తెలిపారు. -
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
మనిషి ఆలోచనల వల్లే యుద్ధాలు జరుగుతాయని పూరి జగన్నాథ్ అన్నారు. ‘పూరి మ్యూజింగ్స్’లో మరో ఆసక్తికర వీడియోను పంచుకున్నారు. -
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
సల్మాన్ఖాన్ ఇంటి ముందు ఇద్దరు దుండగులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో సల్మాన్ ఇల్లు మారనున్నారంటూ జరుగుతోన్న ప్రచారంపై ఆయన సోదరుడు స్పందించారు. -
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
తన ప్రియుడు శాంతనుకు నటి శ్రుతిహాసన్ (Shruti Haasan) బ్రేకప్ చెప్పారంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
ప్రేమపై చిన్నప్పటినుంచే నమ్మకముంది: అదితీరావ్ హైదరీ
ప్రేమపై తనకు చిన్నప్పటి నుంచే నమ్మకముందని నటి అదితిరావ్ హైదరీ (Aditi Rao Hydari) తెలిపారు. -
మమ్ముట్టి అద్భుతంగా నటించారు: విద్యాబాలన్
మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో నటించిన ‘కాదల్.. ది కోర్’ (Kaathal The Core)ను ఉద్దేశించి నటి విద్యాబాలన్ (Vidya Balan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రం తనకెంతో నచ్చిందన్నారు. -
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
శునకంతో పోల్చుతూ ట్రోల్ చేశారు.. భావోద్వేగానికి గురైన హీరో
తనపై వచ్చిన ట్రోల్స్ చూసి ఎంతో బాధపడినట్లు బాలీవుడ్ హీరో ఆయుష్ శర్మ చెప్పారు. -
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
నటి విద్యా బాలన్ తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన అవమానాన్ని గుర్తుచేసుకున్నారు.