Siddharth: కన్నడ ప్రజల తరపున సిద్ధార్థ్‌కు క్షమాపణలు: ప్రకాశ్‌ రాజ్

తాజాగా కర్ణాటకలో సిద్ధార్థ్‌ (Siddharth) సినిమా ప్రెస్‌మీట్‌ను నిరసనకారులు అడ్డుకోవడంపై ప్రకాశ్‌ రాజ్ స్పందించారు. దీనిపై ఆయన ట్వీట్‌ చేశారు. 

Updated : 29 Sep 2023 13:14 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కర్ణాటక ప్రజల తరపున సిద్ధార్థ్‌కు (Siddharth) నటుడు ప్రకాశ్‌ రాజ్ క్షమాపణలు చెప్పారు. నదీ జలాల విషయంలో వివాదం నెలకొన్న తరుణంలో సిద్ధార్థ్‌ ‘చిన్నా’ సినిమాకు సంబంధించిన ప్రెస్‌మీట్‌ను కొందరు నిరసనకారులు అడ్డుకున్నారు. దీనిపై ప్రకాశ్‌రాజ్‌ తన ట్విటర్‌లో స్పందించారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన షేర్‌ చేశారు.

‘‘దశాబ్దాల నాటి సమస్యను పరిష్కరించడంలో విఫలమైన రాజకీయ పార్టీలను, నాయకులను ప్రశ్నించకుండా.. కేంద్రంపై ఒత్తిడి తీసుకురాకుండా.. సామాన్యులను, కళాకారులను ఇబ్బంది పెడుతున్నారు. ఇలా చేయడం అసలు ఆమోదయోగ్యం కాదు. కర్ణాటకకు చెందిన మనిషిగా నేను ఈ రాష్టం వాళ్లందరి తరపున సిద్ధార్థ్‌కు క్షమాపణలు చెబుతున్నాను’’ అని ప్రకాశ్‌ రాజ్‌ (Prakash Raj) రాసుకొచ్చారు. దీనికి రెండు చేతులు జోడించి ఉన్న ఎమోజీలను పెట్టారు. ఇక దీనిపై సిద్ధార్థ్‌ అభిమానులు కూడా సోషల్‌ మీడియా వేదికగా వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘ఇలా జరగడం చాలా బాధగా ఉంది’ అని కామెంట్స్‌ పెడుతున్నారు.

 ‘సలార్‌’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌.. అధికారికంగా ప్రకటించిన టీమ్‌

ఇక మరోవైపు సిద్ధార్థ్‌ నటించిన ‘చిన్నా’ సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా అందరి హృదయాలను హత్తుకుంటోంది. తాజాగా ఈ సినిమాను స్టార్‌ హీరో కమల్‌ హాసన్‌ (Kamal Haasan) ప్రశంసించారు. ‘‘చిన్నా’ నాకెంతో నచ్చింది. ఈ సినిమాలో మంచి మెసేజ్‌ ఉంది. ఇది కేవలం ఆడపిల్లలు ఉన్న వారికి మాత్రమే కాదు. పిల్లలు ఉన్న వారందరూ చూడాలి. పిల్లలను పిల్లలానే చూడాలి అనే సందేశాన్ని ఇందులో బాగా చూపించారు’ అంటూ సినిమాపై కమల్‌ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని