Radhe Shyam: 2018 మే 29 టు 2022 మార్చి 11.. ‘రాధేశ్యామ్’ ప్రయాణమిదీ!
పోరాటాలు చేసే ప్రభాస్ను ఎంతమంది ఇష్టపడతారో రొమాంటిక్గా కనిపించే ప్రభాస్ను అంతకన్నా ఎక్కువమంది ఇష్టపడుతుంటారు. సుమారు దశాబ్దం తర్వాత క్లాస్ లుక్లో, హస్తసాముద్రికా నిపుణుడిగా సందడి చేసేందుకు ఆయన సిద్ధమయ్యారు.
ఇంటర్నెట్ డెస్క్: పోరాటాలు చేసే ప్రభాస్ను ఎంతమంది ఇష్టపడతారో రొమాంటిక్గా కనిపించే ప్రభాస్ను అంతకన్నా ఎక్కువమంది ఇష్టపడుతుంటారు. సుమారు దశాబ్దం తర్వాత క్లాస్ లుక్లో, హస్తసాముద్రికా నిపుణుడిగా సందడి చేసేందుకు ఆయన సిద్ధమయ్యారు. ‘డార్లింగ్’, ‘మిస్టర్ పర్ఫెక్ట్’ చిత్రాల తర్వాత ప్రభాస్ (Prabhas) నటించిన క్లాసీ చిత్రం ‘రాధేశ్యామ్’ (Radhe Shyam). పలుమార్లు కొవిడ్/లాక్డౌన్ సమస్యలు దాటుకొని ఈ సినిమా ఎట్టకేలకు మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుంది. యావత్ సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ప్రయాణం ఎలా సాగిందో ఓ సారి చూద్దాం..
ద్వితీయ యజ్ఞం..
దర్శకుడిగా రాధాకృష్ణ కుమార్ చేసిన రెండో ప్రయత్నమిది. దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటి దగ్గర ‘ఒక్కడున్నాడు’, ‘ప్రయాణం’, ‘సాహసం’ తదితర చిత్రాలకు రచయితగా పనిచేసిన రాధాకృష్ణ ‘జిల్’ సినిమాతో మెగాఫోన్ పట్టారు. గోపీచంద్, రాశీఖన్నా జంటగా రూపొందించిన ఈ సినిమా ఆయనకు మంచి పేరు తీసుకొచ్చింది. ఈ చిత్రం 2015 మార్చి 27న విడుదలైంది. అన్ని కేంద్రాల్లోనూ హిట్టాక్ సొంతం చేసుకోవడంతో చిత్ర పరిశ్రమలో రాధాకృష్ణ పేరు అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ స్టైలిష్ డైరెక్టర్ తదుపరి ప్రాజెక్టు ఎవరితో చేస్తాడా? అన్న ప్రశ్నకు 2018 మే 29న శుభంకార్డు పడింది. అదే రోజు ‘‘ఓ పే.. ద్ద ప్రాజెక్టులో పెద్ద స్టార్. సంబంధిత వివరాలు త్వరలోనే వస్తాయి’’ అని ట్వీట్ చేస్తూ #Prabhas20 అనే హ్యాష్ట్యాగ్ ఇవ్వడంతో రాధాకృష్ణ.. ప్రభాస్ను డైరెక్ట్ చేయబోతున్నాడని అభిమానులు ఫిక్సయ్యారు. హీరోయిన్ ఎవరు, సంగీతం అందించేదెవరు, టైటిల్ ఏంటి, ఏ జానర్ కథ, బడ్జెట్ ఎంత? అంటూ మళ్లీ చర్చలు మొదలయ్యాయి.
సెప్టెంబరులో పూజ..
‘జిల్’ తర్వాత యూవీ క్రియేషన్స్ సంస్థలోనే రాధాకృష్ణ మరో సినిమాకు పనిచేయాలనుకున్నారు. దానిపై వర్కవుట్ చేస్తున్నప్పుడే.. 18 ఏళ్ల క్రితం అనుకున్న ఓ పాయింట్ మదిలో మెదిలింది. అప్పుడు వదిలేసిన ఈ కథ ముగింపును పూర్తి చేసి నిర్మాతలు, ప్రభాస్కు వినిపించారు. వ్యక్తిగతంగా జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్మని ప్రభాస్ ఈ కథలో నటించేందుకు అంతగా ఆసక్తి చూపించలేదు. ఆయన నో చెప్పాలనుకున్న సమయంలో.. ఇంటర్వెల్ సీన్, ద్వితియార్థం ముగ్దుడ్ని చేశాయి. సినిమాకు పచ్చజండా ఊపాయి. 2018 సెప్టెంబరు 6న హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ‘‘ఈ సినిమాని యువీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ నిర్మిస్తున్నాయి. పూజాహెగ్డే కథానాయిక’’ అని రాధాకృష్ణ ప్రకటించారు. 2018 సెప్టెంబరు 20న యూరోప్లో రెగ్యులర్ చిత్రీకరణ మొదలైంది. 2020 డిసెంబరు 4న అలనాటి నటి భాగ్యశ్రీ ఈ సెట్స్లో అడుగుపెట్టారు. ఓ కీలక పాత్రలో ఆమె కనిపించనున్నారు.
అలా పాన్ ఇండియాగా..
‘బాహుబలి’ కంటే ముందే ప్రభాస్ ఈ కథను ఓకే చేశారు. ‘బాహుబలి’ సిరీస్ చిత్రాలతో ఆయనకు అంతర్జాతీయంగా పేరురావడంతో ‘రాధేశ్యామ్’ను పాన్ ఇండియా స్థాయిలోనే తెరకెక్కించారు. ప్రభాస్ సలహా మేరకు ఈ చిత్ర కథను యూరోప్ నేపథ్యానికి తగ్గట్టుగా దర్శకుడు మార్పులు చేశారు. యూరప్కు చెందిన కీరో అనే ప్రముఖ హస్తసాముద్రికా నిపుణుడి స్ఫూర్తితో ప్రభాస్ పాత్రను తీర్చిదిద్దారు.
సర్ప్రైజ్లు అప్పుడే..
ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్/ ప్రభాస్ ప్రీ లుక్ 2020 జనవరి 17న బయటకు వచ్చింది. ప్రభాస్ స్టాండింగ్ స్టైల్, ఆయన వెనక బ్యాక్గ్రౌండ్ అందరినీ ఆకట్టుకుంది. సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. ఫస్ట్లుక్ 2020 జులై 10న విడుదలైంది. ప్రభాస్, పూజాహెగ్డే కెమిస్ట్రీ కట్టిపడేసింది. ఇదే రోజు టైటిల్ ‘రాధేశ్యామ్’ ఖరారైంది. విడుదలైన 24 గంటల్లో 6.3 మిలియన్కుపైగా ట్వీట్లు నమోదైన పోస్టర్గా నిలిచింది.
ఈ సినిమాలో పూజాహెగ్డే ‘ప్రేరణ’గా నటించింది. సంబంధిత లుక్ 2020 అక్టోబరు 13న వచ్చింది. ప్రభాస్ పోషించిన విక్రమాదిత్య లుక్ అక్టోబరు 21న ఒకటి, 2021 జనవరి 1న మరొకటి విడుదలయ్యాయి. సినిమా థీమ్ ఎలా ఉంటుందో చూపించే వీడియో (బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్) 2020 అక్టోబరు 23న విడుదలై, వావ్ అనిపించింది. 2021 ఫిబ్రవరి 14న టీజర్ అలరించింది. అక్టోబరు 23న విక్రమాదిత్య పాత్రకు సంబంధించిన టీజర్ వచ్చింది. ఈ సినిమాలోని తొలి గీతం ‘ఈ రాతలే’ నవంబరు 15న , రెండో పాట ‘నగుమోము తారలే’ డిసెంబరు 2న, మూడో గీతం ‘సంచారి’ డిసెంబరు 16న విడుదలయ్యాయి. ప్రభాస్ పెద్దనాన్న, ప్రముఖ నటుడు కృష్ణంరాజు ఫస్ట్లుక్ డిసెంబరు 20న రిలీజ్ అయింది. ఇందులో ఆయన పరమహంస అనే కీలక పాత్ర పోషిస్తున్నారు. ట్రైలర్ డిసెంబరు 23న విడుదలై, అనతి కాలంలోనే రికార్డు స్థాయి వ్యూస్ సాధించింది. ‘రిలీజ్ ట్రైలర్’ అంటూ మరో వీడియోను మార్చి 2న విడుదల చేశారు.
అరుదైన ప్రకటన..
ఫస్ట్లుక్స్, వీడియోలతో ఎన్నో అంచనాలు పెంచిన ఈ సినిమా సంగీత దర్శకుడి వివరాలను కొంతకాలం గోప్యంగా ఉంచారు. 2021 ఫిబ్రవరి 11న ఈ చిత్రానికి మ్యూజిక్ అందించేది ఎవరో తెలిసింది. ఒక సినిమాకు ఇద్దరుముగ్గురు సంగీతం ఇవ్వడం చాలా అరుదు. ఈ క్రేజీ ప్రాజెక్టుకు ముగ్గురు సంగీతం అందించారు. దక్షిణాది భాషలకు (తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం) జస్టిన్ ప్రభాకరన్, హిందీ వెర్షన్కు మిథున్, మనన్ భరద్వాజ్ మ్యూజిక్ ఇచ్చారు. హిందీ మినహా ఇతర వెర్షన్లకు తమన్ నేపథ్య సంగీతం అందించారు.
అక్కడ అమితాబ్.. ఇక్కడ రాజమౌళి
ఒక్కో భాషలో ఒక్కో స్టార్ ఈ సినిమా కథను ప్రేక్షకులకు వినిపించబోతున్నారు. హిందీలో అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ ఇస్తే, తెలుగులో రాజమౌళి ఇచ్చారు. కన్నడంలో శివరాజ్కుమార్, తమిళంలో సత్యరాజ్, మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ తమ గాత్రాన్ని అందించారు.
ఏం ఉంటాయి.. ఎవరెవరు కనిపిస్తారు
‘ఈ సినిమా ఏ జానర్లో సాగుతుంది?’ అనేది చాలా మందికి సందేహం. పోస్టర్లనుబట్టి కొందరు లవ్స్టోరీ అనుకుంటే, ట్రైలర్లు చూసిన మరికొందరు సైఫై (సైంటిఫిక్) చిత్రమని అభిప్రాయపడ్డారు. పిష్ ఎపిసోడ్ సీన్ చూసి ‘టైటానిక్’ సినిమాతో పోల్చారు. ‘‘ఈ సినిమాలో యాక్షన్ ఉంది కానీ ఫైట్లు లేవు. లవ్, థ్రిల్లింగ్ అంశాలున్నాయి కాబట్టి దీన్ని థ్రిల్లర్ లవ్స్టోరీ’’ అనుకోవచ్చు అని ప్రభాస్ తెలిపారు. సుమారు రూ. 300 కోట్ల వ్యయంతో నిర్మితమైన ఈ చిత్రంలో భాగ్యశ్రీ, కృష్ణంరాజుతోపాటు జగపతిబాబు, రిద్ది కుమార్, సచిన్ ఖేడ్కర్, మురళీశర్మ, ప్రియదర్శి, జయరామ్ తదితరులు కనిపిస్తారు. సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచే షిప్ ఎపిసోడ్ కోసం దాదాపు రెండేళ్లు శ్రమించారు. నిక్ పావెల్తోపాటు హాలీవుడ్ ప్రముఖ సాంకేతిక నిపుణులు కొందరు ఈ సన్నివేశం తెరకెక్కించడంలో కీలక పాత్ర పోషించారు. ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్, సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస ఈ సినిమా తెర వెనక హీరోలని ప్రభాస్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
ఓ వైపు చలి.. మరోవైపు కరోనా
ఈ సినిమా ఎక్కువ భాగం చిత్రీకరణ యూరప్లోనే జరిగింది. షూటింగ్ సాగుతున్నప్పుడే కొవిడ్ విజృంభించింది. కరోనా వైరస్ భయం ఉన్నా, ఎముకలు కొరికే చలి పెడుతున్నా చిత్ర బృందం లెక్కచేయకుండా చిత్రీకరణను కొనసాగించింది. ఇటలీ, ఆస్ట్రియా, జార్జియా తదితర దేశాల్లో షూటింగ్ చేశారు. ఈ సినిమా కోసం వినియోగించిన బెడ్లను హైదరాబాద్లోని ఓ ఆస్పత్రికి అందించి నిర్మాతలు తమ మంచి మనసును చాటుకున్నారు. విపత్కర సమయంలో ఎందరో కొవిడ్ బాధితులకు అవి ఉపయోగపడ్డాయి.
అట్టహాసంగా..
ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రామోజీ ఫిలిం సిటీ వేదికగా కనుల పండగలా సాగింది. అభిమానులే అతిథులుగా నిర్వహించిన ఈ వేడుకలో యువ నటుడు నవీన్ పొలిశెట్టి చేసిన కామెడీ ఎవ్వరూ మర్చిపోలేరు. ఈ భారీ స్థాయి ఈవెంట్ 2021 డిసెంబరు 23న జరిగింది. అధునాతన టెక్నాలజీ ‘మెటావర్స్’లో ఈ చిత్ర ట్రైలర్ను ప్రదర్శించడం విశేషం.
2019 చివర్లోనే రావాల్సింది..
ముందుగా ఈ సినిమాను 2019 చివర్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేశారు. కానీ, సాధ్యమవలేదు. ఆ తర్వాత 2020లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నారు. కొవిడ్ కారణంగా వాయిదా పడింది. తర్వాత, 2021 జులై 30న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. సెకండ్ వేవ్ కారణంగా మరోసారి వాయిదా వేస్తూ 2022 జనవరి 14న విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ‘‘హమ్మయ్య ఎట్టకేలకు విడుదలవుతుంది. ప్రచారం కూడా పూర్తయింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవంతమైంది. మరికొన్ని రోజుల్లో వెండితెరపై ‘రాధేశ్యామ్’ను చూసేస్తాం’’ అని అనుకున్న చిత్ర బృందం, ప్రభాస్ అభిమానులు, సినీ ప్రియులకు నిరాశే ఎదురైంది. థర్డ్వేవ్ వల్ల ఈ చిత్రం పోస్ట్పోన్ అయింది.
ఏది గెలుస్తుంది..
మళ్లీ ఎప్పుడు విడుదలవుతుందా? అనే అభిమానుల ప్రశ్నకు చిత్ర బృందం ‘మార్చి 11న’ అని సమాధానమిచ్చింది. ఈ శుభవార్త తెలియడమే ఆలస్యం.. రోజులు, గంటలు, నిమిషాలు, సెకన్లు లెక్కపెట్టుకుంటూ సినీ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ‘ప్రేమకు, విధికి జరిగిన యుద్ధంలో ఏది గెలిచింది’ అనేది తెలియాలంటే థియేటర్కు వెళ్లి ‘రాధేశ్యామ్’ చూడాల్సిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యువతరం.. వైవిధ్యమే తొలి విజయం: స్టార్ నటులు మెచ్చిన యంగ్ హీరోలెవరంటే?
విభిన్న కథలను ఎంపిక చేసుకుంటూ విజయాన్ని అందుకుంటున్న యంగ్ హీరోలపై ప్రత్యేక కథనం.. -
ఎవరీ అశ్వత్థామ.. కృష్ణుడు అతడికి ఇచ్చిన శాపం ఏంటి?
ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). ఇందులో ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా (Ashwathama) కనిపించనున్నారు. -
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
ప్రముఖ నటులు కొందరు కలిసి నటిస్తున్న చిత్రాలపై ప్రత్యేక కథనం. ఎవరెవరు ఏయే సినిమాల్లో నటిస్తున్నారంటే? -
నాయికలు ‘తెర’ పంచుకుంటే.. వినోదం పెంచినట్టే
త్వరలో విడుదల కాబోయే సినిమాలు ప్రేక్షకులకు రెట్టింపు వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతున్నాయి. అందుకు కారణం ఒకే మూవీలో ఇద్దరు/ ముగ్గురు హీరోయిన్లు కలిసి నటిస్తుండటమే.. -
సీనియర్ హీరోయిన్ల జోరు ‘తగ్గేదే లే’.. ఎవరెన్ని సినిమాలతో బిజీగా ఉన్నారంటే?
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లపై ప్రత్యేక కథనం. త్రిష, నయనతార, తమన్నా.. ఇలా ఎవరెవరు ఎన్ని సినిమాలతో సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారంటే? -
పృథ్వీరాజ్ సుకుమారన్ బెస్ట్ మూవీస్.. ఇప్పుడు ‘ఆడుజీవితం’.. ఇంతకుముందు?
పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఉత్తమ చిత్రాలు ఏంటంటే..? -
ఆ అవార్డు అందుకున్న తొలి వ్యక్తిని నేనే అని తెలిసి షాకయ్యా.. అల్లు అర్జున్
నటుడు అల్లు అర్జున్ (Allu Arjun) పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు సంబంధించిన పలు ఆసక్తికర విశేషాలు. -
రికార్డుల్లోనూ ఫస్టే ఈ నేషనల్ క్రష్.. రష్మిక ఖాతాలో ఘనతలెన్నో!
రష్మిక పుట్టినరోజు సందర్భంగా ఆమె సొంతంచేసుకున్న కొన్ని రికార్డులను చూద్దాం.. -
రామ్ చరణ్ బర్త్డే.. ఆయన బాల్యం గురించి ఈ విశేషాలు తెలుసా..?
టాలీవుడ్ ప్రముఖ హీరో రామ్ చరణ్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలు.. -
Challenging Roles: పాత్రలకు ప్రాణం పోశారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఇలా.. విక్రమ్ అలా!
పాత్రలకు ప్రాణం పోసేందుకు మానసికంగా, శారీరకంగా ఎంతగానో శ్రమించిన నటులు, వారి సినిమాల వివరాలివీ.. -
Tollywood Actresses: అగ్ర నాయికలు అలా రూటు మార్చి.. హాట్టాపిక్గా నిలిచి!
అగ్ర కథానాయిక- వర్ధమాన హీరో కాంబినేషన్లో వచ్చిన సినిమాల విశేషాలు.. -
Actors turned Directors: ధనుష్, ఉపేంద్ర, కంగన.. మళ్లీ మరో కోణాన్ని చూపించేందుకు...
స్వీయ దర్శకత్వంలో నటించిన హీరో/హీరోయిన్పై ప్రత్యేక కథనం. ఎవరు ఏ సినిమాతో అలరించేందుకు సిద్ధమయ్యారంటే? -
Alia Bhatt: అందుకు క్లాస్లో బెంచీలు తుడిచి.. బ్యాగ్రౌండ్ ఉన్నా ఆడిషన్ ఇచ్చి: అలియా భట్ బర్త్డే స్పెషల్
అలియా భట్ పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించి పలు విశేషాలు.. -
Mamitha Baiju: గిరిజ, సాయి పల్లవిలా మమితా బైజు.. రాజమౌళి మెచ్చిన ఈ నటి ఎవరు?
యంగ్ హీరోయిన్ మమితా బైజును అగ్ర దర్శకుడు ప్రశంసించడం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఎవరీ నటి? -
Comedians as Heros: కమెడియన్లు.. కథానాయకులై.. ఎవరెవరు ఏ సినిమాతో అలరించారంటే?
కమెడియన్లుగా కెరీర్ని ప్రారంభించి హీరోగాను సినిమాలు చేస్తున్న నటులపై ప్రత్యేక కథనం.. -
Krystyna Pyszkova: మనిషే కాదు.. మనసూ అందమే: మిస్ వరల్డ్ క్రిస్టినా గురించి ఆసక్తికర విశేషాలివీ
ప్రపంచ సుందరి-2024 కిరీటం దక్కించుకున్న క్రిస్టినా పిస్కోవా గురించి ఆసక్తికర విశేషాలు మీకోసం.. -
Miss World Pageant: తొలుత ‘బికినీ కాంటెస్ట్’గా.. 28 ఏళ్ల తర్వాత భారత్ ఆతిథ్యం.. ‘మిస్ వరల్డ్’ పోటీల సంగతులివీ!
భారత్ ఆతిథ్యంలో 71వ ఎడిషన్ ‘మిస్ వరల్డ్’ పోటీలు జరుగుతున్నాయి. శనివారం విజేతను ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా ఈ అందాల పోటీల గురించి పలు ఆసక్తికర విశేషాలు.. -
Sini Shetty: మిస్ వరల్డ్ పోటీలు.. ‘బెస్ట్ డిజైనర్ డ్రెస్’ విజేతగా సినిశెట్టి
మిస్ వరల్డ్ 2024 పోటీల్లో భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్న సినిశెట్టి గురించి ఆసక్తికర విశేషాలివీ.. -
Movies in March: మార్చిలో మురిపించే చిత్రాలు.. వరుణ్ తేజ్ అలా.. ‘టిల్లు’ ఇలా!
మార్చిలో విడుదల కానున్న సినిమాలపై ప్రత్యేక కథనం. ఏ హీరో చిత్రం ఏ రోజు ప్రేక్షకుల ముందుకు రానుందంటే? -
Valentine Day: వాలంటైన్స్ డేకు రీరిలీజ్ కానున్న ప్రేమకథా చిత్రాలివే..
వాలంటైన్స్ డే సందర్భంగా గతంలో అలరించిన ప్రేమ కథాచిత్రాలు మరోసారి వినోదాన్ని పంచేందుకు సిద్ధమయ్యాయి. -
తొలి సినిమా ఫ్లాప్.. ‘బండమొహం వీడేం హీరో’ అన్నారు.. రీల్ కెరీర్ To పొలిటికల్ ఎంట్రీ.. విజయ్ లైఫ్ జర్నీ ఇదే!
Actor vijay: తల్లిదండ్రులకు సినీ నేపథ్యం ఉన్నా, నటుడిగా తనకంటూ తమిళనాట గుర్తింపు తెచ్చుకున్న విజయ్.. రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఈ క్రమంలో ఇప్పటివరకూ ఆయన లైఫ్ జర్నీ ఎలా సాగింది?
తాజా వార్తలు (Latest News)
-
అత్యాచారం చేసి.. కాల్చిన ఇనుప రాడ్డుతో ముఖంపై పేరు రాసి..
-
శెభాష్ గుకేశ్.. ₹75 లక్షలు అందజేసిన సీఎం స్టాలిన్
-
బంగ్లాతో తొలి టీ20.. భారత్ ఘన విజయం
-
జాక్స్, కోహ్లీ విధ్వంసం.. బెంగళూరు ఘన విజయం
-
చీరలో మెరిసిన అందాల ‘రాశి’.. కాలేజీ ఈవెంట్లో మాళవిక సందడి
-
₹602 కోట్ల డ్రగ్స్ పట్టివేత.. 14 మంది పాకిస్థానీయుల అరెస్టు