ఏనుగులతో ఆ ఒక్కరోజు చాలా భయమేసింది!
‘అరణ్య చిత్రం నాలో చాలా మార్పులు తీసుకొచ్చింది’ అన్నారు కథానాయకుడు రానా దగ్గుబాటి. రానా ప్రధాన పాత్రలో దర్శకుడు ప్రభు సాల్మన్ తెరకెక్కించిన చిత్రమిది. ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా విలేకర్లతో ముచ్చటించారు రానా
కథానాయకుడు రానా దగ్గుబాటి
‘అరణ్య చిత్రం నాలో చాలా మార్పులు తీసుకొచ్చింది’ అన్నారు కథానాయకుడు రానా దగ్గుబాటి. ఈయన ప్రధాన పాత్రలో దర్శకుడు ప్రభు సాల్మన్ తెరకెక్కించిన చిత్రమిది. ఈ నెల 26న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా విలేకర్లతో ముచ్చటించారు రానా. ఆ ఆసక్తికర విశేషాలేంటో చదివేయండి...
ప్రతిరోజూ అదే చర్చ..
అసోంలోని కాజీరంగా ప్రాంతంలో జరిగిన వాస్తవ సంఘటనల ఆధారంగా దర్శకుడు ప్రభు సాల్మన్ ఈ కథని రాసుకున్నారు. ఆయన స్ర్కిప్టు వినిపిస్తున్నపుడే తెలియని నాలో తెలియని ఉత్సాహం కలిగింది. ప్రభు ‘కుంకి’ అనే చిత్రం చేస్తున్నపుడే ఏనుగుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేశారు. దాదాపు నాలుగేళ్లు ఈ ప్రాజెక్టు కోసం వెచ్చించారు. ఇందులో 18 ఏనుగులతో సాగే ప్రయాణం కొత్త అనుభూతి పంచుతుంది. షూటింగ్కి పదిహేను రోజుల ముందే థాయ్లాండ్కి వెళ్లాం. ప్రతిరోజూ నేనూ ప్రభు అడవికి వెళ్లి నా పాత్రకి, అక్కడున్న మొక్కకి ఏంటి సంబంధం? నాకు, కుందేలుకి ఏంటి సంబంధం? అంటూ చర్చించుకునేవాళ్లం. అడవిలో ఉండే ప్రతి జీవంతో నా పాత్ర ముడిపడి ఉంటుంది. శిక్షకుల సాయంతో ఏనుగులకి స్నానం చేయించి, ఆహారం అందించి వాటిని మచ్చిక చేసుకున్నాను.
అరటిపండు, బెల్లం..
ఏనుగులు మనుషుల్ని ఓ ఎనర్జీతో గుర్తిస్తాయి. తాకితే చాలు ఎవరు అనే విషయం ఇట్టే కనిపెట్టేస్తాయి. తొలినాళ్లలో అవి ఏమైనా చేస్తాయనే భయంతో జేబులో అరటిపండు, బెల్లం పెట్టుకుని తిరిగేవాణ్ని. ఓసారి జేబులోంచి అరటిపండు బయటికి వచ్చిన సంగతి నేను గుర్తించలేదు. అరటిపండు చూడగానే అక్కడున్న అన్ని ఏనుగులు నా వైపునకు వస్తుండటంతో చాలా భయపడ్డాను. కానీ అనుకున్నంతగా ఏం జరగలేదు. వారం రోజుల్లోనే వాటితో స్నేహం కుదిరింది.
ఏనుగుల కోసం పోరాటం..
ఈ చిత్రంలో నరేంద్ర భూపతిగా కనిపిస్తాను. ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరొచ్చిన తర్వాత గ్రామ ప్రజలంతా ‘అరణ్య’ అని పిలవడం ప్రారంభిస్తారు. ఇప్పటికే ప్రేమ కోసం, ఇతరత్రా వాటికోసం పోరాడే సినిమాలు చేశాను. ఇది భూమి కోసం, జంతువుల కోసం పోరాడే చిత్రం కావడంతో ఎలాగైనా చేయాలనుకున్నాను. భవిష్యత్తు తరాలకు చూపించాల్సిన సినిమా ఇది. గతంలో జంతువు- మనిషి మధ్య అనుబంధం చూపించిన సినిమాలు వచ్చాయి కానీ పూర్తి స్థాయిలో ఏనుగుల గురించి రాలేదు. సినిమా ప్రారంభంలో ఏనుగులతోపాటు అడవిలో ఉండే అన్ని జంతువుల్ని చూపించాం. వెండితెరపై అడవుని చూసిన ప్రేక్షకులు మంచి అనుభూతికి లోనవుతారు. బయట కూడా కనిపించని పచ్చగా, ఆహ్లాదకరంగా ఉంటుంది. అంతగా మాయ చేశారు దర్శకుడు, ఛాయాగ్రాహకుడు.
కథల్ని బట్టి సమయం..
ఈ కథే నాకు స్ఫూర్తినిచ్చింది. ‘బాహుబలి’, ‘అరణ్య’ లాంటి సినిమాకు సమయం వెచ్చించినా నటులుగా కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం ఉంటుంది. అరణ్య త్వరగానే పూర్తవుతుందని అనుకున్నా కానీ సెట్కి వెళ్లాక అర్థమైంది ఇలాంటి కథలు అనుకున్నంత తేలిక కాదు అని. వేణు ఊడుగుల తెరకెక్కిస్తోన్న ‘విరాటపర్వం’ తక్కువ సమయంలోనే పూర్తవుతుంది. ఎంపిక చేసుకున్న కథని బట్టి సమయం పడుతుంది. ‘విరాటపర్వం’లో కథానాయకుడి కలం పేరు ‘అరణ్య’ యాథృచ్చికంగా కుదిరింది. నన్ను పరిశ్రమకు పరిచయం దర్శకుడు శేఖర్ కమ్ములకు, బాబాయ్ వెంకటేష్కి నటుడిగా కొంచెం ఎదిగానని గర్వంతో ఈ చిత్రం చూపించా.
కేవలం వాటితోనే..
‘బాహుబలి’తో పోల్చుకుంటే ‘అరణ్య’నే కష్టమనిపించింది. 30 రోజులు నా పక్కన నటించేందుకు మనుషులకు అవకాశం లేదు. కేవలం ఏనుగులతోనే సన్నివేశాలన్నీ ఉంటాయి. ఈ కథని నాతో అనుకున్నప్పుడు లుక్ టెస్ట్ చేసి గడ్డం పెంచి సన్నగా మారమని చెప్పారు ప్రభు. షూటింగ్ కోసం అడవికి వెళ్లాక పాత్రకు తగ్గట్టు నన్ను నేను మలుచుకున్నాను. అరణ్య నన్ను చాలా మార్చింది. నేను పెళ్లి చేసుకోవడం దానికి నిదర్శనం (నవ్వుతూ).
పవన్తో..
ఎన్నో విభిన్న కథల్ని వినే నేను లాక్డౌన్ వస్తుందని కథగా చెప్పినా నమ్మేవాణ్ని కాదు. ఎవరూ ఊహించలేని పరిణామం అది. ప్రస్తుతం పరిస్థితి కాస్త కుదుట పడింది. కరోనా తర్వాత టాలీవుడ్ నుంచే అధిక సంఖ్యలో సినిమాలు రావడం, ప్రేక్షకులు ఆదరించడం శుభపరిణామం. గ్లోబల్ కథలకు కేరాఫ్గా తెలుగు చిత్ర పరిశ్రమ నిలుస్తుండటం తెలుగువారిగా గర్వపడాల్సిన విషయం. పవన్ కల్యాణ్తో కలిసి నటించే అవకాశం వచ్చినందుకు ఆనందంగా ఉంది. ఆయన నుంచి కొత్త విషయాలు నేర్చుకుంటున్నాను. ఆ సినిమా గురించి త్వరలో మాట్లాడుకుందాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
తాజా వార్తలు (Latest News)
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ