Rashmika Mandanna: అతనే ఎక్కువగా సపోర్ట్‌ చేశారు: రష్మిక చెప్పిన ఆ హీరో ఎవరంటే?

‘యానిమల్‌’ చిత్రంతో హిట్‌ అందుకున్న నటి రష్మిక ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్య్వూలో సహ నటుల గురించి మాట్లాడారు.

Published : 01 Feb 2024 02:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘యానిమల్‌’ (Animal) చిత్రంతో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చి, మెప్పించిన కథానాయిక రష్మిక (Rashmika Mandanna). ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. సహ నటులు అమితాబ్‌ బచ్చన్‌, రణ్‌బీర్‌ కపూర్‌, అల్లు అర్జున్‌, విజయ్‌ దేవరకొండ, సిద్ధార్థ్‌ మల్హోత్ర గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. ‘‘అమితాబ్‌ సర్‌.. వయసులో వ్యత్యాసం చూడకుండా అందరినీ ఒకేలా గౌరవిస్తారు. జీవితంలో ఏదైనా చేయగలననే నమ్మకాన్ని రణ్‌బీర్‌ ఇచ్చారు’’ అని తెలిపారు. విజయ్‌ దేవరకొండ గురించి చెబుతూ.. ‘‘నేను చేసే ప్రతి పనిలో తన సహకారం ఎప్పుడూ ఉంటుంది. అతని సలహా తీసుకుంటా. అది నాకు అవసరం. ఏది మంచో, ఏది చెడో వివరిస్తారు. అలా చెప్పడం బాగుంటుంది. వ్యక్తిగతంగా జీవితంలో అందరికంటే ఎక్కువగా సపోర్ట్‌ చేశారు’’ అని తెలిపారు.

వీరిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని, ఫిబ్రవరిలో నిశ్చితార్థం జరగనుందని కొన్ని రోజుల క్రితం వార్తలొచ్చాయి. విజయ్‌ దేవరకొండ వాటిని ఖండించారు. ‘ఫిబ్రవరిలో నిశ్చితార్థం, పెళ్లి జరగడం లేదు. ప్రతీ రెండేళ్లకోసారి నాకు పెళ్లి చేయాలని కొన్ని మీడియా సంస్థలు భావిస్తున్నట్లున్నాయి. వాళ్లు నా చుట్టూ తిరుగుతూ నేను కనిపిస్తే పెళ్లి చేయాలని చూస్తున్నారు. ఏటా ఇలాంటి రూమర్‌ వింటూనే ఉన్నాను’ అని అన్నారు. విజయ్‌-రష్మిక గతంలో రెండు సినిమాల్లో (గీత గోవిందం, డియర్‌ కామ్రేడ్‌) కలిసి నటించారు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి విహార యాత్రలకు, పార్టీలకు వెళ్లడంతో వీళ్లు ప్రేమలో ఉన్నారనే ప్రచారం మొదలైంది. తాము కేవలం స్నేహితులం మాత్రమేనని పలు సందర్భాల్లో చెప్పారు. 

రకుల్‌ ప్రీత్‌ వివాహం.. వేదిక మారడానికి కారణమదేనా?

లక్ష్మణ్‌ ఉటేకర్‌ దర్శకత్వంలో విక్కీ కౌశల్‌తో కలసి రష్మిక నటించిన ‘ఛావా’ చిత్రీకరణ పూర్తయింది. ఛత్రపతి శివాజీ కుమారుడు శంభాజీ మహరాజ్‌ జీవితాధారంగా దీన్ని రూపొందిస్తున్నారు. మరోవైపు, అల్లు అర్జున్‌ సరసన ‘పుష్ప 2’లో నటిస్తున్నారు. ‘రెయిన్‌ బో’, ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ చిత్రాలతోనూ అలరించనున్నారు. ప్రస్తుతం.. ‘ఫ్యామిలీ స్టార్‌’లో నటిస్తున్న విజయ్‌ అది పూర్తైన తర్వాత గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో నటించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని