Sobhita Dhulipala: సమంత-నాగచైతన్య గురించి తొలిసారి మాట్లాడిన శోభితా ధూళిపాళ్ల

సమంత (Samantha), నాగచైతన్య (Naga Chaitanya)లో తనకు బాగా నచ్చే విషయాలు ఏమిటో చెప్పారు నటి శోభితా ధూళిపాళ్ల (Sobhita Dhulipala). ‘ది నైట్‌ మేనేజర్‌ 2’ (The Night Manager 2) ప్రమోషన్స్‌లో భాగంగా ఆమె వీరిద్దరి గురించి తొలిసారి మాట్లాడారు.

Published : 24 Jun 2023 19:03 IST

ముంబయి: టాలీవుడ్‌లో ఒకప్పటి ప్రేమ జంట, నటీనటులు సమంత (Samantha), నాగచైతన్య (Naga Chaitanya) గురించి తొలిసారి స్పందించారు నటి శోభితా ధూళిపాళ్ల (Sobhita Dhulipala). వీరిద్దరిలో ఏయే విషయాలు తనకు బాగా నచ్చుతాయో తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె చెప్పారు. మొదటిగా సామ్‌ గురించి మాట్లాడుతూ.. ‘‘ఆమె సినీ ప్రయాణం సూపర్‌ కూల్‌గా ఉంటుంది. ఉదాహరణకు సామ్‌ ఫిల్మోగ్రఫీని గమనిస్తే.. ఒక నటిగా మొదలైన ఆమె స్టార్‌గా ఎదిగి ఇప్పుడు కథానాయిక ప్రాధాన్యమున్న చిత్రాలతో అలరిస్తున్నారు. అది నాకు నచ్చింది’’ అని తెలిపారు. అనంతరం నాగచైతన్యలో తనకు నచ్చే లక్షణాల గురించి చెబుతూ.. ‘‘ఆయన స్వభావం నాకెంతో నచ్చుతుంది. ఎప్పుడూ ప్రశాంతంగా, ఎంతో హుందాగా వ్యవహరిస్తుంటారు. దాన్ని నేను తప్పక మెచ్చుకుంటా’’ అని శోభిత అన్నారు.

‘పొన్నియిన్‌ సెల్వన్‌ 2’ (ponniyin selvan 2) తర్వాత శోభితా ధూళిపాళ్ల నటించిన ప్రాజెక్ట్‌ ‘ది నైట్‌ మేనేజర్‌ 2’ (The Night Manager 2). ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన ‘ది నైట్‌ మేనేజర్‌’ సిరీస్‌కు కొనసాగింపుగా ఇది సిద్ధమైంది. డిస్నీ + హాట్‌స్టార్‌ వేదికగా జూన్‌ 30 నుంచి ఇది ప్రసారం కానుంది. ఈ సిరీస్‌ ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమెను ర్యాపిడ్‌ ఫైర్‌ రౌండ్‌లో సామ్‌, చై గురించి అడిగారు. ఈక్రమంలోనే ఆమె వీరిద్దరిలో తనకు నచ్చే లక్షణాల గురించి చెప్పారు.

ఇదీ చదవండి: ప్రారంభంలో ప్రతీది ఓ యుద్ధమే: శోభితా ధూళిపాళ్ల 

ఇక, సమంత-నాగచైతన్య విషయానికి వస్తే.. 2017లో వివాహంతో ఒక్కటైన ఈ ప్రేమజంట.. అనుకోని కారణాలతో 2021లో విడిపోయారు. ఆనాటి నుంచి కెరీర్‌పై దృష్టి పెట్టిన వీరిద్దరూ వివిధ ప్రాజెక్ట్‌లతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. సామ్‌ ప్రస్తుతం ‘ఖుషి’, ‘సిటడెల్‌’ (ఇండియన్‌ వెర్షన్‌) చేస్తుండగా.. నాగచైతన్య నటించిన ‘ధూతా’ సిరీస్‌ విడుదలకు సిద్ధంగా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని