Geetha: ఆహా వేదికగా అలరించడానికి సిద్ధమైన ‘గీత’..

సునీల్‌, హెబ్బా పటేల్‌ ప్రధానపాత్రల్లో నటించిన ‘గీత’ సినిమా ఆహా వేదికగా నవంబర్‌ 4 నుంచి డిజిటల్‌ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.

Published : 03 Nov 2022 12:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్: సునీల్‌, హెబ్బా పటేల్‌ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘గీత’. ‘మ్యూట్‌ విట్నెస్‌’ అనేది ఈ చిత్రానికి ఉపశీర్షిక. విశ్వ దర్శకత్వం వహించిన ఈ సినిమా నవంబర్‌ 4 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహా వేదికగా ప్రీమియర్‌ కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం ట్రైలర్‌ విడుదల చేసింది. అనాథ పిల్లల చుట్టూ తిరిగే కథ అని ఈ సినిమా ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. సప్తగిరి, రాజీవ్‌ కనకాల, పృథ్వీ, తనికెళ్లభరణి కీలకపాత్రల్లో నటించారు. అనాథ శరణాలయం నడుపుతున్న మూగ అమ్మాయి ‘గీత’గా హెబ్బా పటేల్‌ తన నటనతో ఆకట్టుకుంటోంది. సాయికిరణ్‌ విలన్‌గా నటిస్తున్నారు. అనాథ పిల్లల అవయవాలతో వ్యాపారం చేసే ఆయన్ని గీత ఎలా ఎదుర్కొందో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే!


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని