Suriya: అభిమానులకు సూర్య ప్రత్యేక విందు.. ఎందుకంటే!

అభిమానులకు నటుడు సూర్య ప్రత్యేక విందు ఇచ్చారు.

Updated : 04 Mar 2024 15:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: హీరోలు సూర్య (Suriya), కార్తి(karthi) సాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. తాజాగా వీరు మరోసారి మంచి మనసు చాటుకున్నారు. గతంలో మిగ్‌జాం తుపాను సమయంలో సూర్య ఫ్యాన్స్‌ వేలమంది బాధితులకు సాయం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ అభిమానులకు సోదరులు విందు ఇచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి.

గతేడాది డిసెంబర్‌లో వచ్చిన మిగ్‌జాం తుపాను దెబ్బకు చెన్నై మహా నగరం మొత్తం అతలాకుతలమైంది. సాధారణ ప్రజలతోపాటు సెలబ్రిటీలు కూడా ఇబ్బందులు పడ్డారు. ఆ సమయంలో తన అభిమానులందరూ స్వచ్ఛందంగా వచ్చి బాధితులను ఆదుకోవాలని కోరారు. రూ.10లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. దీంతో తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ఫ్యాన్స్‌ భోజనాలు ఏర్పాటు చేసి పలు సేవలు చేశారు. వారి సేవలను గుర్తించిన సూర్య వాళ్లందరినీ విందుకు ఆహ్వానించారు. వారికి స్వయంగా ఆయనే వడ్డించారు.

శివరాత్రి స్పెషల్‌.. ఈవారం అలరించే థియేటర్‌/ఓటీటీ చిత్రాలివే

సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం సూర్య ‘కంగువా’లో నటిస్తున్నారు. శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో  ఆరు భిన్నమైన అవతారాల్లో కనిపించనున్నట్లు సమాచారం. ఐమ్యాక్స్‌, 3డీ వెర్షన్‌లోనూ ఇది అందుబాటులో ఉండనుంది. దిశా పఠానీ కథానాయికగా నటిస్తుండగా.. బాబీ దేవోల్‌ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. జగపతి బాబు, యోగిబాబు, కోవై సరళ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వేసవి కానుకగా ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని