Guntur Kaaram tickets: ‘గుంటూరు కారం’ టికెట్‌ ధరల పెంపు

Guntur Kaaram: మహేశ్‌బాబు నటించిన ‘గుంటూరు కారం’ టికెట్‌ ధరలను పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

Updated : 09 Jan 2024 17:14 IST

హైదరాబాద్: మహేశ్‌బాబు (Mahesh babu) కథానాయకుడిగా నటించిన ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) సినిమా టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. సింగిల్ స్క్రీన్‌లలో రూ.65, మల్టీప్లెక్స్‌లలో రూ.100 పెంచేందుకు వెసులుబాటు కల్పించింది. మహేశ్‌ అభిమానులను దృష్టిలో పెట్టుకుని బెనిఫిట్ షోల ప్రదర్శనకు కూడా ఓకే చెప్పింది. రాష్ట్రంలో 23 చోట్ల ఈనెల 12న అర్ధరాత్రి 1 గంట షో ప్రదర్శించనున్నారు. పండగ సందర్భంగా ‘గుంటూరు కారం’ ఆరో షో ప్రదర్శనకు కూడా ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ నెల 12 నుంచి 18 వరకు ఉదయం 4 గంటల షోలను ప్రదర్శించనున్నారు. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలు. రమ్యకృష్ణ, ప్రకాష్‌రాజ్‌, జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు. హాసిని, హారిక క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ నిర్మించగా, తమన్‌ సంగీతం అందించారు. ఇప్పటికే విడుదల చేసిన పాటలు, ప్రచార చిత్రాలు సినిమాపై అంచనాలను పెంచాయి. మునుపెన్నడూ చూడని సరికొత్త పాత్రలో మహేశ్‌బాబు ఎనర్జిటిక్‌గా నటించారంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని