Acharya: అభిమానులకు చిరు కానుక.. ఆ 152 థియేటర్లలో హంగామాకు సిద్ధమా..!

చిరంజీవి ‘ఆచార్య’ సినిమా విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ యాక్షన్‌ డ్రామా చిత్రం ఏప్రిల్‌ 29న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్‌ను రిలీజ్‌ చేసేందుకు ఇప్పటికే ముహూర్తం ఖరారు చేసిన చిత్ర బృందం అభిమానులకు శుభవార్త వినిపించింది.

Published : 12 Apr 2022 01:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చిరంజీవి ‘ఆచార్య’ సినిమా విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ యాక్షన్‌ డ్రామా చిత్రం ఏప్రిల్‌ 29న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్‌ను రిలీజ్‌ చేసేందుకు ఇప్పటికే ముహూర్తం ఖరారు చేసిన చిత్ర బృందం అభిమానులకు ఓ శుభవార్త వినిపించింది. సోషల్‌ మీడియాతోపాటు వెండితెరపైనా ప్రచార చిత్రాన్ని ఆవిష్కరించనున్నట్టు తెలిపింది. చిరంజీవికి ఇది 152వ సినిమా కావడంతో ముఖ్యమైన 152 థియేటర్లలో ట్రైలర్‌ను ప్రదర్శించబోతుంది. తెలుగురాష్ట్రాలతోపాటు తమిళనాడు, కర్ణాటకలోని కొన్ని థియేటర్లలో ఆచార్య ట్రైలర్‌ సందడి చేయనుంది. ఏప్రిల్‌ 12న సాయంత్రం 5:49 గం.లకు ట్రైలర్‌ విడుదలకానుంది.

కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చిరంజీవి పవర్‌ఫుల్‌గా కనిపించనున్నారు. ఆయన సరసన కాజల్‌ నటించింది. రామ్‌చరణ్‌, పూజాహెగ్డే ముఖ్య భూమికలు పోషించారు. నిరంజన్‌రెడ్డి, అవినాష్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించారు. ఈ క్రేజీ ట్రైలర్‌ విడుదలయ్యే థియేటర్ల వివరాలివీ...

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని