Vamshi Paidipally: ‘వారసుడు’ పక్కా తమిళ చిత్రం.. మహేశ్ ఫుల్ హ్యాపీ: వంశీ పైడిపల్లి
ప్రభాస్, ఎన్టీఆర్, మహేశ్ బాబు వంటి టాలీవుడ్ స్టార్ హీరోలతో సినిమాలు చేసి దర్శకుడిగా పేరు సొంతం చేసుకున్నారు వంశీ పైడిపల్లి (Vamshi Paidipally). ప్రస్తుతం ఆయన కోలీవుడ్ స్టార్ హీరో విజయ్తో ‘వారిసు’ (Varisu) చేస్తోన్న విషయం తెలిసిందే. ఆ సినిమా విశేషాలు మీకోసం..
ఇంటర్నెట్డెస్క్: దళపతి విజయ్ (Vijay) - వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) కాంబినేషన్లో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘వారిసు’ (Varisu). దిల్ రాజు (Dil Raju) నిర్మాత. ఇదే చిత్రాన్ని ‘వారసుడు’ (Vaarasudu) పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో వంశీ పైడిపల్లి తొలిసారి కోలీవుడ్ మీడియాతో ముచ్చటించారు. ‘వారసుడు’ గురించి ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు.
ఎన్నో ప్రశ్నలు..!
‘‘నిర్మాత దిల్రాజ్ ఓసారి నా వద్దకు వచ్చి.. ‘మన దగ్గర కథ ఉంది కదా. విజయ్కు చెబుదాం’ అని అన్నారు. విజయ్ పేరు వినగానే షాకయ్యా. ప్రాజెక్ట్ ఓకే అవుతుందో? లేదో? తెలియదు కానీ ఆయన్ని ఒక్కసారైనా కలిసే అవకాశం వస్తుంది కదా అనుకున్నా. అలా కో-డైరెక్టర్ హరితో కలిసి చెన్నైకు వెళ్లా. అక్కడ ఫ్లైట్ దిగగానే నాకు కంగారు పెరిగింది. విజయ్కు నేను చెప్పే కథ నచ్చుతుందా?లేదా? ఇలా ఎన్నో ప్రశ్నలు నా మదిలో మెదిలాయి. ఎందుకంటే ఏ దర్శకుడికైనా ఇలాంటి అవకాశం ఎప్పుడో ఒక్కసారే వస్తుంది’’
చెమటలు పట్టేశాయి..!
‘‘విజయ్ ఇంటికి చేరుకోగానే మమ్మల్ని ఓ గదిలో కూర్చొమన్నారు. కొంతసేపటికి విజయ్ అక్కడికి వచ్చారు. ఆయన చాలా సింపుల్. కథ చెప్పడం మొదలుపెట్టగానే నాకు చెమటలు పట్టేశాయి. నా టెన్షన్ గమనించిన ఆయన.. రూమ్లో ఏసీ పెంచారు. సుమారు గంటపాటు కథ వివరించాను. ఆయన సైలెంట్గా వింటూ కూర్చొన్నారు. కథ పూర్తైన వెంటనే.. ‘సర్. ఇది కథ. ఇలా శుభం కార్డు పడుతుంది’ అని చెప్పాను. 30 సెకన్లు ఆయన ఏం మాట్లాడలేదు. దాంతో నేను విజయ్ని మాత్రమే కలవగలిగానని ఫిక్స్ అయిపోయా. అనంతరం ఆయన నా వద్దకు వచ్చి ‘కథ చాలా బాగుంది. చేద్దాం’ అని చెప్పారు. ఆ క్షణం జీవితంలో ఎప్పటికీ ఓ మధురానుభూతిగానే ఉంటుంది. అలా మా ప్రయాణం మొదలైంది’’
ఇంత తక్కువ సమయంలో..!
‘‘విజయ్ని కలిసి బయటకు వచ్చాక.. అక్కడున్నవాళ్లతోనే ఒక్కటే చెప్పా. ‘ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకు చెన్నైకు వచ్చా. రాత్రి 9 గంటలకు మళ్లీ హైదరాబాద్కు రిటర్న్ అయిపోతా. నాకు తెలిసి ఇంత తక్కువ సమయంలో చెన్నైలో ఇంత గొప్పగా ఎవరూ ఏం సాధించలేదు’ అంటూ నా ఆనందాన్ని పంచుకున్నా’’
అన్నీ ఆరులోనే..!
‘‘ఇది నా ఆరో చిత్రం. విజయ్కు 66వ చిత్రం. షూటింగ్ కూడా ఏప్రిల్ ఆరునే మొదలైంది. అయితే, ఇది మేము అనుకుని చేసింది కాదు. అనుకోకుండా అన్నీ అలా జరిగిపోయాయి. క్రికెట్లో అత్యధిక రన్స్ సిక్స్. ఆ విధంగా చూసుకుంటే ఇదొక సెంటిమెంట్గా భావిస్తున్నాం. ఇక, దిల్ రాజు సినిమా హిట్ అయితే దాన్ని సిక్సర్ అనే అభివర్ణిస్తారు. దేవుడి దయ వల్ల ఈ సినిమా కూడా సిక్సర్ కొడుతుందని భావిస్తున్నా’’
అంతకు మించి..!
‘‘ఇది ఫ్యామిలీ ఎంటర్టైనరే అయినప్పటికీ.. అంతకు మించి ఉంటుంది. విజయ్ ఇమేజ్ని దృష్టిలో ఉంచుకుని ఫ్యాన్స్ ఎలాంటి సినిమాని కోరుకుంటున్నారో అలాంటి చిత్రాన్నే చేస్తున్నాం. చిన్నా పెద్దా అందరూ చూసే సినిమా ఇది’’
న్యాయం చేసేలా..!
‘‘సినిమా థీమ్కు న్యాయం చేసేలా టైటిల్ ఉండాలి. ఈ టైటిల్కు ఒక అర్థం ఉంది. సినిమా చూశాక ప్రేక్షకులకు అది తెలుస్తుంది. దిల్రాజు ఈ సినిమాపై ఎంతో డబ్బు ఖర్చు పెడుతున్నారు. కాబట్టి, కథ గురించి ఇప్పుడే ఏం చెప్పలేను’’ (నవ్వులు)
రష్మిక కల నెరవేరింది..!
‘‘హీరోయిన్ని కేవలం హీరోయిన్గానే చూడకూడదు. ఆమెని కూడా కథలో ఓ పాత్రగానే మనం చూడాలనేది నా ఉద్దేశం. వాళ్లు స్క్రీన్పై కాసేపే కనిపించినా వాళ్ల పాత్రకు ఏదో ఒక అర్థం ఉండేలా చూపించాలి. విజయ్తో ఇప్పటి వరకూ నటించన కథానాయికను మా ప్రాజెక్ట్లోకి తీసుకోవాలని అనుకున్నప్పుడు.. రష్మిక అయితే బెటర్ అనిపించింది. అలా ఆమెను ఓకే చేశాం. వాళ్లిద్దరి కెమిస్ట్రీ స్క్రీన్పై అదిరిపోతుంది. విజయ్కు ఆమె పెద్ద ఫ్యాన్. మూడేళ్ల క్రితం ఓసారి రష్మికను కలిసినప్పుడే ఆమె ఈ మాట చెప్పింది. ఇటీవల విజయ్-రష్మికలపై ఓ సాంగ్ షూట్ చేశాం. చిత్రీకరణ పూర్తైన వెంటనే ఆమె నా వద్దకు వచ్చి.. ‘విజయ్తో డ్యాన్స్ చేయాలనేది నా కల. ఈ రోజుతో నా కల నెరవేరింది’ అని ఆనందం వ్యక్తం చేసింది’’
ఇది పక్కా తమిళ చిత్రం..!
‘‘ఇది పక్కా తమిళ చిత్రం. మిగిలిన భాషల్లోకి డబ్ చేసి రిలీజ్ చేస్తాం. గతంలో భాషా పరమైన వ్యత్యాసాలు ఉండేవి. కానీ, కరోనా తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ప్రేక్షకులు అన్ని భాషల చిత్రాలను ఆదరిస్తున్నారు’’
మహేశ్ ఫుల్ ఖుష్..!
‘‘మహేశ్ బాబు (MaheshBabu) నాకొక సోదరుడులాంటి వ్యక్తి. నేను విజయ్తో సినిమా చేస్తున్నానని తెలిసి మహేశ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ మధ్యే ఫోన్ చేసి తన సంతోషాన్ని పంచుకున్నారు. సినిమాతో మొదలైన మా బంధం.. ఇప్పుడు ఒకే కుటుంబం అన్నట్లు మారింది. ఇక, ఎన్టీఆర్ (NTR) నాకంటే చిన్నవాడైనప్పటికీ నేను అన్నయ్య అని పిలుస్తుంటా. ‘బృందావనం’ ఓకే చేసి ఆయన నాకెంతో సాయం చేశారు. ఆయనపై నాకెప్పటికీ ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది’’ అని వంశీ పైడిపల్లి వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి