vidya balan: మూడోసారీ ఓటీటీకే!

కరోనా దెబ్బకు   థియేటర్‌లు మూతపడిన కాలంలో ఓటీటీలే చాలా సినిమాలకు ఆశాకిరణంలా అనిపించాయి. చిన్న   సినిమాలే కాదు పెద్దవి ఓటీటీ బాట పట్టాయి. అగ్ర నటులూ ఈ బాటేపట్టారు. కరోనా కాలంలో ప్రముఖ కథానాయిక విద్యాబాలన్‌ నటించిన ‘శకుంతల దేవి’తో

Published : 07 Mar 2022 14:40 IST

రోనా దెబ్బకు   థియేటర్‌లు మూతపడిన కాలంలో ఓటీటీలే చాలా సినిమాలకు ఆశాకిరణంలా అనిపించాయి. చిన్న సినిమాలే కాదు పెద్దవి ఓటీటీ బాట పట్టాయి. అగ్ర నటులూ ఈ బాటేపట్టారు. కరోనా కాలంలో ప్రముఖ కథానాయిక విద్యాబాలన్‌ నటించిన ‘శకుంతల దేవి’తో పాటు ‘షేర్నీ’ చిత్రమూ ఓటీటీ ద్వారానే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇప్పుడు ఆమె నటించిన మరో చిత్రం ఓటీటీ ద్వారా విడుదల కానుంది. అదే ‘జల్సా’ చిత్రం. విద్యాబాలన్‌ ‘తుమ్హారీ సులు’ చిత్రం తర్వాత దర్శకుడు సురేష్‌ త్రివేణితో కలిసి పనిచేసిన చిత్రమిది. ఇందులో విద్య..ఓ పాత్రికేయురాలిగా నటించింది. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్‌ ఆకట్టుకుంటోంది. ఈ నెల 18న అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని