SSMB 29: మహేశ్‌బాబు- రాజమౌళి కాంబో.. ఆ విషయంపై విజయేంద్ర ప్రసాద్‌ క్లారిటీ

మహేశ్‌బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాకు సంబంధించి రచయిత విజయేంద్ర ప్రసాద్‌ పలు అప్‌డేట్స్‌ ఇచ్చారు.

Updated : 23 Jan 2024 13:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ హీరో మహేశ్‌బాబు (Mahesh Babu)- అగ్రదర్శకుడు రాజమౌళి (Rajamouli) కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. #SSMB29 వర్కింగ్‌ టైటిల్‌. తాను తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో రచయిత విజయేంద్ర ప్రసాద్‌ (Vijayendra Prasad) పలు ఆసక్తికర అప్‌డేట్స్‌ పంచుకున్నారు. ఆ చిత్రం ‘ఇండియానా జోన్స్‌’లా ఉంటుందని స్పష్టం చేశారు. ‘‘ఈ సినిమాకి టైటిల్‌ ఇంకా ఖరారు కాలేదు. కథ ఎక్కువగా అడవి నేపథ్యంలో సాగుతుంది. పీరియాడికల్‌ కాదు. స్క్రిప్టు పూర్తయింది. సంగీత చర్చలు జరుగుతున్నాయి’’ అని తెలిపారు. ‘ఈ సినిమాతో మహేశ్‌బాబు ఇమేజ్‌ ఇంకా పెరిగే అవకాశాలున్నాయా?’ అనే ప్రశ్నపై స్పందిస్తూ.. ‘ప్రధాన పాత్ర పోషించే నటులకు మంచి గుర్తింపురావాలని మా వంతు ప్రయత్నం చేస్తాం’ అని పేర్కొన్నారు.

‘జై హనుమాన్‌’.. ఆంజనేయుడిగా స్టార్‌ హీరో: ప్రశాంత్‌ వర్మ

‘బజరంగీ భాయిజాన్‌’ సీక్వెల్‌ కథ పూర్తయిందని, సల్మాన్‌ఖాన్‌కు వినిపించానని చెప్పారు. చిత్రీకరణ ఎప్పుడు ప్రారంభమవుతుందో చూడాలన్నారు. తన డ్రీమ్‌ ప్రాజెక్టు అయిన ‘సీత’ను హాలీవుడ్‌ స్థాయిలో రూపొందిస్తామని, కొత్త నటి కోసం అన్వేషిస్తున్నామన్నారు. మహేశ్‌ ఇటీవల ‘గుంటూరు కారం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమాలో రమణగా అలరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని