Leo: ఆ విషయంపై హైకోర్టును ఆశ్రయించిన ‘లియో’ నిర్మాతలు..

విజయ్‌ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘లియో’(Leo). ఈ చిత్ర నిర్మాతలు ఓ విషయంలో హైకోర్టును ఆశ్రయించారు.

Published : 16 Oct 2023 17:03 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ప్రముఖ కథానాయకుడు విజయ్‌ (Vijay) నటించిన ‘లియో’ (Leo). అక్టోబర్‌ 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీని కోసం సినీప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా దీని నిర్మాతలు ఓ విషయంలో కోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్‌మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. తమిళనాడు ప్రభుత్వం ఈ సినిమాకు మొదటి ఆరు రోజులు ఐదు షోలను ప్రదర్శించేందుకు అనుమతినిచ్చింది. అయితే, మొదటిరోజు తెల్లవారుజామున 4గంటల ఆట లేకపోవడంపై విజయ్‌ అభిమానులు నిరాశకు లోనయ్యారు. దీంతో సోషల్‌మీడియా వేదికగా చిత్రబృందాన్ని ట్యాగ్‌ చేస్తూ పోస్టులు పెట్టారు. తాజాగా ఈ విషయంపై నిర్మాతలు తమిళనాడు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై అక్టోబర్‌ 17న విచారణ జరగనుంది.

‘నాగా నాయుడు’ మళ్లీ వస్తాడు.. అయితే ఆ కంటెంట్‌ తగ్గిస్తాం: వెంకటేశ్‌

ఇక ‘లియో’ హంగామా చూస్తుంటే మొదటిరోజు భారీ వసూళ్లు సొంతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే దీని టికెట్స్‌ ఓవర్సీస్‌లో రికార్డు స్థాయిలో అమ్ముడయ్యాయి. ‘విక్రమ్‌’ సూపర్‌హిట్‌ తర్వాత లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రంకావడం, ‘మాస్టర్‌’ తర్వాత లోకేశ్‌- విజయ్‌ కాంబోలో రూపొందుతున్న సినిమాకావడంతో ‘లియో’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రమోషన్స్‌లో భాగంగా చిత్రబృందం ఆసక్తికర విషయాలను పంచుకుంటూ వాటిని రెట్టింపు చేసింది. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాలో త్రిష కథానాయిక. సంజయ్‌ దత్‌, అర్జున్‌, గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌, మిస్కిన్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని