ఒక్కడే వచ్చాడు.. 100 మిలియన్‌ వ్యూస్‌ దాటేశాడు!

యశ్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘కేజీయఫ్‌ చాప్టర్‌2’. దాదాపు చిత్రీకరణ పూర్తి

Updated : 10 Jan 2021 04:13 IST

హైదరాబాద్‌: ‘గ్యాంగ్‌లతో వచ్చేవాడు గ్యాంగ్‌స్టర్‌.. కానీ అతనొక్కడే వస్తాడు.. మాన్‌స్టర్‌’.. ‘కేజీయఫ్‌-1’లో ఈ ఒక్క డైలాగ్‌ చాలు రాకీ పాత్రను ఏ స్థాయిలో హైలైట్‌ చేశారో అర్థమవుతుంది. ఇప్పుడు ఇదే కరెక్ట్‌ అని మరోసారి రాకీభాయ్‌ నిరూపించాడు. యశ్‌ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్‌ సామాజిక మాధ్యమాల్లో రికార్డులు బద్దలు కొడుతోంది. గురువారం రాత్రి టీజర్‌ను విడుదల చేయగా, అతి తక్కువ సమయంలో 100 మిలియన్‌ వ్యూస్‌ను దాటి దూసుకుపోతోంది. 5 మిలియన్లకు పైగా లైక్స్‌ సొంతం చేసుకుంది.

ప్రస్తుతం యూట్యూబ్‌ ట్రెండింగ్స్‌లో టాప్‌లో ఉంది. ఈ సందర్భంగా దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌, కథానాయకుడు యశ్‌ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. ‘పవర్‌ఫుల్‌ పీపుల్‌ మేక్‌ ప్లేసెస్‌ పవర్‌ఫుల్‌: కథ ఇప్పుడే ప్రారంభమవుతోంది’ అంటూ ట్వీట్‌ చేశారు.

చాప్టర్‌-1లో మిగిలిన అనేక ప్రశ్నలకు ఇందులో సమాధానం లభించనుంది. గరుడను చంపడానికి కేజీయఫ్‌లోకి అడుగుపెట్టిన రాకీ ఆ తర్వాత దాన్ని ఎలా సొంతం చేసుకున్నాడు? కేజీయఫ్‌ను దక్కించుకోవడానికి ప్రయత్నించిన రాజేంద్ర దేశాయ్‌, కమల్‌, గురు పాండ్యన్‌, ఆండ్రూస్‌లను ఎలా ఎదుర్కొన్నాడు? గరుడ వేసిన ప్లాన్‌ ప్రకారం చనిపోయిన అధీర ఎలా తిరిగొచ్చాడు? భారత దేశంలోకి ప్రవేశించడానికి ఇనాయత్‌ ఖలీ ఏం చేశాడు? కేజీఎఫ్‌ను దక్కించుకున్న రాకీని అంతం చేయడానికి భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది? తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.

ఇవీ చదవండి..

సంక్రాంతి సినీ ట్రైలర్ల హంగామా

‘కేజీయఫ్‌2’లో నా పాత్ర అలా ఉంటుంది: రవీనా



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని