తెలుగు భాషా, సంస్కృతి వికాసానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
అందరికీ అందుబాటులోకి వచ్చే విధంగా తెలుగు సాహిత్య పునరుజ్జీవం జరగాల్సిన అవసరం ఉందని భారత ఉపరాష్ట్రపతి
న్యూదిల్లీ: అందరికీ అందుబాటులోకి వచ్చే విధంగా తెలుగు సాహిత్య పునరుజ్జీవం జరగాల్సిన అవసరం ఉందని భారత ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా సంస్థ ప్రచురించిన 100వ తెలుగు గ్రంథాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ భాష-సంస్కృతుల అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ చొరవ తీసుకోవాలని ఆకాంక్షించారు. 2020 అక్టోబరులో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, శ్రీ సాంస్కృతిక కళా సారథి(సింగపూర్), తెలుగు మల్లి(ఆస్ట్రేలియా), ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ తెలుగు సమాఖ్య(యూకే), దక్షిణ ఆఫ్రికా తెలుగు సాహిత్య వేదిక( జొహానెస్ బర్గ్) సంయుక్తంగా నిర్వహించిన 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సులోని అంశాలను ‘సభావిశేష సంచిక’ పుస్తక రూపంలో తీసుకొచ్చారు.
సాహితీ సదస్సును, పుస్తకాన్ని అమరగాయకుడు ఎస్పీ బాలుకి అంకితం చేయడం పట్ల వెంకయ్యనాయుడు సంతోషం వ్యక్తం చేశారు. 27 ఏళ్లుగా తెలుగు భాషా సదస్సులు నిర్వహిస్తున్న వంగూరి ఫౌండేషన్ చేస్తున్న కృషి ముదావహమని, 100 పుస్తకాలను ప్రచురించడం గొప్ప ప్రయత్నమని కితాబిచ్చారు. తెలుగు భాషా సంస్కృతుల కోసం ప్రతి ఒక్కరి నుంచి ఇలాంటి చొరవను తాను ఆకాంక్షిస్తున్నామని, వాటిని ముందు తరాలకు తీసుకుపోయే ఏ అవకాశాన్నీ వదులుకోరాదని వెంకయ్యనాయుడు సూచించారు. పుస్తక సంపాదకులైన వంగూరి చిట్టెన్ రాజు, శాయి రాచకొండ, రాధిక మంగిపూడి, రచయితలకు, ప్రచురణకర్తలకు అభినందనలు తెలిపారు.
ఈ ఆవిష్కరణ మహోత్సవానికి రాధిక మంగిపూడి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. 7వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు ప్రధాన నిర్వాహకులు రత్నకుమార్ కవుటూరు (సింగపూర్), రావు కొంచాడ (మెల్బోర్న్), వంశీ రామరాజు (హైదరాబాద్), జొన్నలగెడ్డ మూర్తి (ఇంగ్లాండ్), శాయి రాచకొండలతో సహా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలకు చెందిన ప్రవాసాంధ్రులు, తెలుగు భాషాభిమానులు, తెలుగు సాహితీవేత్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి దక్షిణాఫ్రికాకు చెందిన ప్రధాన నిర్వాహకులు రాపోలు సీతారామరాజు వందన సమర్పణ చేశారు.
ఈ ఆవిష్కరణ మహోత్సవం తర్వాత జూమ్ వేదికలో జరిగిన ‘సభా విశేష సంచిక’ డయాస్పోరా తెలుగు కథానిక -15, వెనుతిరగని వెన్నెల (డా.కె.గీత) వీరి వీరి గుమ్మడి పండు, వీరి పేరేమి?( డా. చాగంటి కృష్ణకుమారి) గ్రంథాల పరిచయం, 7వ ప్రపంచ సాహితీ సదస్సు జ్ఞాపకాల రవళి కార్యక్రమం రెండు గంటలకి పైగా అంతర్జాలంలో విజయవంతంగా జరిగింది. ఈ వేదికలో సదస్సు ప్రధాన నిర్వాహకులు, పాల్గొన్న కొందరు వక్తలు, వేదిక నిర్వాహకులు మొదలైన వారు పాల్గొని తమ జ్ఞాపకాలను పంచుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శివపదం గీతాలకు బాలిలో అద్భుత నృత్య ప్రదర్శన
శివపదం గ్లోబల్ ఫ్యామిలీ ఇండోనేషియాలోని బాలిలో భారతీయ శాస్త్రీయ నృత్యాలను ప్రదర్శించింది. తద్వారా ఏకత్వ సందేశాన్ని, కళలకు సరిహద్దులు లేవని చాటి చెప్పింది -
H-1B visa: హెచ్-1బీ వీసాదారులకు గుడ్న్యూస్.. ఇక అమెరికాలోనే వీసా రెన్యువల్!
H-1B visa: అమెరికాలో పనిచేస్తున్న భారత టెక్ నిపుణులకు అగ్రరాజ్యం గుడ్న్యూస్ చెప్పింది. స్వదేశాలకు వెళ్లకుండానే ఎన్నారైలు తమ హెచ్-1బీ వీసాలను రెన్యువల్ చేసుకునేలా ఓ పైలట్ ప్రోగ్రామ్ను డిసెంబరు నుంచి అందుబాటులోకి తీసుకొస్తోంది. -
NRI: న్యూజెర్సీలో వైభవంగా కార్తిక పౌర్ణమి వేడుకలు.. పాల్గొన్న సింగర్ మంగ్లీ
అమెరికాలో.. న్యూజెర్సీలోని సాయిదత్తా పీఠం శ్రీ శివ విష్ణు దేవాలయంలో కార్తిక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. సాయిదత్త పీఠం నిర్వాహకులు రఘుశర్మ శంకరమంచి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా సింగర్ మంగ్లీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె శివుడి పాట పాడారు. మంగ్లీ ఆలపించిన పాటతో భక్తులు మంత్ర ముగ్ధులయ్యారు.
-
శివ నామస్మరణతో మార్మోగిన లిమెరిక్ నగరం
కార్తిక మాసం సందర్భంగా ఐర్లాండ్లోని లిమెరిక్ నగరం శివనామస్మరణతో మార్మోగింది. -
ఉత్సాహంగా తానా ‘నెల నెలా తెలుగు వెలుగు’ సాహిత్య సభ
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సాహిత్య విభాగం తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ‘నెల నెలా తెలుగు వెలుగు’ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. -
సింగపూర్లో భక్తి శ్రద్ధలతో కార్తిక వన భోజనాలు
వాసవి క్లబ్ మెర్లియన్ సింగపూర్ ఆధ్వర్యంలో కార్తిక వన భోజనాల కార్యక్రమాన్ని నిర్వహించారు. -
తాకా ఆధ్వర్యంలో కెనడాలో ఘనంగా దీపావళి వేడుకలు
తెలుగు అలయెన్సెస్ ఆఫ్ కెనడా (TACA) ఆధ్వర్యంలో నవంబరు 18న కెనడాలోని గ్రేటర్ టోరొంటో మిస్సిస్సౌగ ఫీల్డ్ గేట్ ఉన్నత పాఠశాలలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. -
NRI: కెనడాలోని టొరొంటోలో ప్రవాసాంధ్రుల దీపావళి సంబరాలు
కెనడాలోని టొరొంటోలోని తెలుగువారు దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. దాదాపు 800 ఎన్నారై కుటుంబాలు ఈ వేడుకల్లో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా సంప్రదాయ నృత్యం కూచిపూడి ప్రదర్శించారు. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా వివిధ కార్యక్రమాలతో చిన్నారులు, కళాకారులు అలరించారు.
-
India-Canada: కెనడియన్లకు ఈ-వీసా సేవల పునరుద్ధరణ.. జీ20 భేటీ వేళ భారత్ కీలక నిర్ణయం!
India-Canada: కెనడా పౌరులకు ఈ-వీసా సేవల (E-Visa Services)ను భారత్ పునరుద్ధరించినట్లు తెలుస్తోంది. దీంతో కెనడియక్లకు అన్ని రకాల వీసా సేవలను అందుబాటులోకి తెచ్చినట్లైంది. -
టాస్-యూకే ఆధ్వర్యంలో ఘనంగా దీపావళి వేడుకలు
తెలుగు అసోసియేషన్ ఆఫ్ స్కాట్లాండ్-యూకే (టాస్-యూకే) ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. -
కెనడా డీటీసీ ఆధ్వర్యంలో ఘనంగా దీపావళి సంబరాలు
కెనడాలోని టొరంటో నగరంలో డుర్హం తెలుగు క్లబ్ (డీటీసీ) ఆధ్వర్యంలో దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
యూఏఈ తెలుగు అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక
యూఏఈ తెలుగు అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం దుబాయిలోని రాయల్ కాంకర్డ్ హోటల్లో నిర్వహించినట్లు సంఘం మీడియా డైరెక్టర్ అబ్దుల్ ఫహీమ్ షేక్ ఓ ప్రకటనలో తెలిపారు. -
హాంకాంగ్ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో ఘనంగా దీపావళి వేడుకలు
ది హాంకాంగ్ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
Qatar: ఖతార్లో కార్తికమాస వనభోజనాలు..పెద్ద సంఖ్యలో హాజరైన ప్రవాసులు
ఖతార్లో కార్తిక మాస వనభోజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.దీనికి పెద్ద ఎత్తున ప్రవాస భారతీయులు హాజరయ్యారు. -
Chandrababu: అక్రమ కేసుల నుంచి చంద్రబాబు బయటపడాలని ఆకాంక్షిస్తూ శాంతిహోమం
అక్రమ కేసుల నుంచి తెదేపా అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కడిగిన ముత్యంలాగా బయటకు రావాలని ఆకాంక్షిస్తూ ఫిలడెల్ఫియాలో శాంతి హోమం నిర్వహించారు. -
పలు సేవల కోసం ప్రవాసులకు సభ్యత్వం ప్రారంభించిన ‘స్వదేశం’
ప్రవాసులకు సేవలు అందిస్తున్న ‘స్వదేశం’ (swadesam) సంస్థ మెంబర్షిప్ ప్రారంభించింది. దీనికి సంబంధించి డిజిటల్ ఐడీ కార్డులను అందించబోతోంది. దీనివల్ల ‘స్వదేశం’ సభ్యత్వం తీసుకున్న వారికి మరింత వేగంగా తమ సేవలు అందించడం సులువవుతుందని నిర్వాహకులు స్వాతి తెలిపారు. -
ఘనంగా సింగపూర్ తెలుగు సమాజం 49వ ఆవిర్భావ వేడుకలు
సింగపూర్ తెలుగు సమాజం ఆవిర్భావ వేడుకల సందర్భంగా ఆ సంస్థ ప్రతినిధులు వృద్ధాశ్రమాన్ని సందర్శించారు. అక్కడి సీనియర్ సిటిజన్లతో సరదాగా గడిపి వారి అనుభవాలను తెలుసుకున్నారు. -
కాన్సాస్లో తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో దీపావళి వేడుకలు
అమెరికాలోని కాన్సాస్ నగరంలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ కాన్సాస్ సిటీ (TAGKC) ఆధ్వర్యంలో స్థానిక బ్లూ వ్యాలీ నార్త్ హైస్కూలో ఘనంగా దీపావళి వేడుకలు నిర్వహించారు. -
తెదేపా- జనసేన ఆధ్వర్యంలో ప్రవాసాంధ్రుల ఆత్మీయ సమావేశం
‘మేము సైతం బాబు కోసం’ అంటూ అమెరికాలోని న్యూజెర్సీలోని ఎడిసన్ నగరంలో ప్రవాసాంధ్రులు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం నాయకులు మన్నవ మోహనకృష్ణ హాజరయ్యారు. -
హ్యూస్టన్లో వైభవంగా దీపావళి సంబరాలు
భారతీయులు ప్రత్యేకించి తెలుగు ప్రవాసులు అధికంగా నివసించే అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రం హ్యూస్టన్ నగరంలో శ్రీస్వామినారాయణ్(అక్షరధామ్) ఆలయంలో సోమవారం దీపావళి వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
TTA: టీటీఏ ఆధ్వర్యంలో ఘనంగా దసరా - దీపావళి వేడుకలు
అమెరికాలో చికాగోలో ట్రై స్టేట్ తెలుగు అసోసియేషన్ (టీటీఏ) ఆధ్వర్యంలో నవంబర్ 11న దసరా, దీపావళి వేడుకలను ఘనంగా నిర్వహించారు.


తాజా వార్తలు (Latest News)
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/11/23)
-
Nani: అందుకే వైజాగ్ నాకు ప్రత్యేకం: ‘హాయ్ నాన్న’ ఈవెంట్లో నాని
-
హైదరాబాద్ ఓటర్ల కోసం ‘పోల్ క్యూ రూట్’ పోర్టల్
-
Minerals Auction: ₹45 వేల కోట్ల విలువైన ఖనిజ బ్లాకులకు ఈ-వేలం షురూ
-
Ts election: దేవుడి తోడు ఆ గుర్తుకే ఓటేస్తా.. రూ.వెయ్యి తీసుకుని ఓటర్ల ప్రమాణం
-
Bumrah: బుమ్రా పోస్టు వెనుక బాధకు కారణమదేనేమో: క్రిష్ శ్రీకాంత్