తెలుగు రాష్ట్రాల అభివృద్ధి కోసం శాన్‌ ఫ్రాన్సిస్కో కాన్సులేట్‌ సమావేశం

ఇండియా-శాన్‌ ఫ్రాన్సిస్కో కాన్సుల్‌ జనరల్‌ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో తెలుగు రాష్ట్రాల అభివృద్ధిపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని

Published : 19 Feb 2022 18:42 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇండియా-శాన్‌ ఫ్రాన్సిస్కో కాన్సుల్‌ జనరల్‌ ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో తెలుగు రాష్ట్రాల అభివృద్ధిపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లోని వాణిజ్య, పర్యాటక, సాంకేతిక రంగాల్లో అవకాశాలను గుర్తించి ప్రోత్సహించడమే లక్ష్యంగా డయాస్‌ ఫర్‌ డెవలప్‌మెంట్ ఇన్‌ ఆంధ్రప్రదేశ్‌ అండ్‌ తెలంగాణ పేరుతో కాన్సుల్‌ జనరల్‌ ప్రత్యేకంగా ఇంటరాక్టివ్‌ సెషన్‌ నిర్వహించింది.

కాన్సుల్‌ జనరల్  డాక్టర్‌ నాగేంద్ర ప్రసాద్‌, ఐపీఎస్‌ అధికారి అకున్‌ సబర్వాల్‌తో సహా దాదాపు 50 మంది ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. తెలుగు రాష్ట్రాలు వివిధ రంగాల్లో అభివృద్ధి చెందుతున్నాయని వక్తలు అభిప్రాయపడ్డారు. మరింత ముందుకు తీసుకెళ్లేందుకు వ్యాపార, పర్యాటక, సాంకేతిక రంగాల్లో అవసరమైన తోడ్పాటు అందించాలని నిర్ణయించారు. ఆయా రంగాల్లో ఉన్న అవకాశాలను గుర్తించి ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ సమావేశం నిర్వహించారు. డాక్టర్‌ నాగేంద్ర వరప్రసాద్‌తో పాటు కాకతీయ సౌండ్‌ బాక్స్‌ సహ వ్యవస్థాపకుడు రాజురెడ్డి, ఏపీ ప్రభుత్వ నార్త్‌ అమెరికా ప్రత్యేక ప్రతినిధి జయరామ్‌ కోమటి, యాంకర్‌ వాలీ పార్ట్‌నర్స్‌ ప్రిన్సిపల్‌ సిద్దార్థ లక్కిరెడ్డి, సిలికాన్‌ ఆంధ్ర యూనివర్సిటీ ప్రెసిడెంట్‌ ఆనంద్‌ కూచిభోట్ల, పసిఫిక్‌ ఏఏఐ ప్రాంతీయ డైరెక్టర్‌ సుజీత్‌ పున్నం, గ్లోబల్‌ అనలిస్ట్‌ వ్యవస్థాపకుడు రామ్‌రెడ్డి, హైఫై యూత్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు రాకృష్ణన్‌ సుందర్‌, ఫాల్కన్‌ఎక్స్‌ సహ వ్యవస్థాపకుడు బీవీ జగదీశ్‌, బే ఏరియా తెలుగుసంఘం సలహాబోర్డు ప్రతినిధి డాక్టర్‌ రమేష్‌ కొండా, తెలంగాణ కల్చరల్‌ అసోసియేషన్‌ వ్యవస్థాపకుడు విజయ్‌ చావా, ఏపీఎన్‌ఆర్‌టీ సొసైటీ బే ఏరియా ప్రతినిధి వెంకటరెడ్డి, విజయ అసూరి తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని