బోస్టన్‌లో తెలుగు తమ్ముళ్ల సంబరాలు

అమెరికాలోని బోస్టన్‌ నగరంలో మహానాడును ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ విగ్రహంపై హెలికాప్టర్‌తో పూలు చల్లారు. జై ఎన్టీఆర్‌, జై చంద్రబాబు, జై తెలుగుదేశం అని నినాదాలతో కార్ల ప్రదర్శన నిర్వహించారు.

Updated : 23 May 2022 05:30 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: అమెరికాలోని బోస్టన్‌ నగరంలో మహానాడును ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ విగ్రహంపై హెలికాప్టర్‌తో పూలు చల్లారు. జై ఎన్టీఆర్‌, జై చంద్రబాబు, జై తెలుగుదేశం అని నినాదాలతో కార్ల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున తెదేపా అభిమానులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి, గౌతు శిరీష, మన్నవ సుబ్బారావు, తెలంగాణ తెదేపా నాయకుడు నన్నూరి నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మహానాడుకు ముస్లింలు భారీగా రావాలి

ప్రకాశంజిల్లాలో ఈ నెల 28న నిర్వహించనున్న మహానాడులో ముస్లింలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని తెదేపా మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మౌలానా ముస్తాక్‌ అహ్మద్‌ కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని