ఖతార్లో వైభవంగా మినీ మహానాడు వేడుకలు
ఎన్నారై తెదేపా-ఖతార్ శాఖ ఆధ్వర్యంలో మినీ మహానాడు వేడుకలు వైభవంగా జరిగాయి. ....
ఖతార్: ఎన్నారై తెదేపా-ఖతార్ శాఖ ఆధ్వర్యంలో మినీ మహానాడు వేడుకలు వైభవంగా జరిగాయి. ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించడంతో పాటు ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ గీతాలాపనతో మహానాడు వేడుకను ప్రారంభించారు. నేతల అద్భుత ప్రసంగాలు శ్రోతలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎన్నారై తెదేపా ఇంఛార్జి చప్పిడి రాజశేఖర్, ఐటీడీపీ రాష్ట్ర మహిళా కోఆర్డినేటర్ జేడీ మౌనిక వీడియోకాల్ ద్వారా ప్రసంగించారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ.. సభాప్రాంగణ అలంకరణ ఎంతగానో ఆకట్టుకొందని, పార్టీ తోరణాలు, జెండాలతో పాటు, పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్, పార్టీ అధినేత చంద్రబాబు నిలువెత్తు ఫ్లెక్సీలు, భారీ కటౌట్లతో సభా ప్రాంగణం పసుపుమయంగా పండుగ వాతావరణాన్ని తలపించిందని ప్రశంసించారు. ఎన్నారై తెదేపా సభ్యత్వ నమోదును పెద్ద ఎత్తున చేపట్టాలని సూచించారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రవాస తెలుగువారు, ముఖ్యంగా తెదేపా అభిమానులు తమ సభ్యత్వ నమోదు తప్పనిసరిగా తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. అనంతరం జేడీ మౌనిక మాట్లాడుతూ.. దేశవిదేశాల్లో మహానాడు వేడుకలను నిర్వహించి తెలుగువారు ఎక్కడ ఉన్నా తెదేపా అంటే తమకు ఎంత అభిమానమో చాటుకొంటున్నారన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నైరాల పాత్ర ఎంతో కీలకమని, అందరూ పార్టీకి అన్నివేళలా అండగా నిలవాలని కోరారు.
ఈ మినీ మహానాడు నరేష్ మద్దిపోటి ప్రారంభోపన్యాసంతో ఉదయం 10 గంటలకు మొదలై సాయంత్రం 4 గంటలవరకు కొనసాగింది. రవి పొనుగుమాటి, గొట్టిపాటి రమణయ్య, శాంతయ్య యలమంచిలి, నరేష్ నూతలపాటి, రమేష్ దాసరి, దామచర్ల వెంకటరావు, మలిరెడ్డి సత్యనారాయణ, జేవీ సత్యనారాయణ, కొడాలి సుధాకర్, మలసాని అనిల్, జీఎంఎంఎస్ నాయుడు, కళ్యాణ్ నార్నె, గిరిబాబు నాయుడు అడుసుమిల్లి, గౌతమ్లు ఆసక్తికర ప్రసంగాలతో శ్రోతలను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించిన నరేష్ మద్దిపోటి, పొనుగుమాటి రవి, రమేష్ దాసరి, సంతోష్ సింగరాజు, రామారావు బొడ్డు, అనిల్ మలసాని, రవీంద్ర మాగులూరి, తదితర నేతలు, ఖతార్ తెదేపా కుటుంబ సభ్యులకు మహానాడు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది. మహానాడులో రెండు తీర్మానాలు ప్రవేశపెట్టారు. ఎన్నారై తెదేపా సభ్యత్వ నమోదును భారీగా చేపట్టడం ఒకటి కాగా.. ఎన్నారై తెదేపా ఖతార్ పేజీని పటిష్టపరచి పార్టీ చేసిన మంచి పనులను ప్రజలకు మరింతగా వివరించడం, పార్టీ అధికారంలోకి రావాల్సిన చారిత్ర అవసరాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా తీసుకెళ్లడం రెండోది. ఈ రెండు తీర్మానాలను మహానాడు ఆమోదించింది. ఈ కార్యక్రమానికి పొనుగుమాటి రవి వ్యాఖ్యాతగా వ్యవహరించి ధన్యవాద తీర్మానంతో సభను ముగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బోఇసీలో వైభవంగా ఉగాది వేడుకలు
అమెరికాలోని ఇడాహో రాష్ట్రం బోఇసీ నగరంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
అల్బనీలో ఉగాది వేడుకలు.. ఆర్పీ పట్నాయక్, అలీ, కౌశల్ సందడి
న్యూయార్క్ రాజధాని అల్బనీ పరిధిలో నివసిస్తున్న తెలుగు ప్రజల కోసం ఏర్పాటైన అల్బనీ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. -
వెస్ట్ లండన్ బాలాజీ ఆలయంలో ఘనంగా రాములోరి కల్యాణోత్సవం
లండన్లోని శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) స్వామి టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్(SVBTCC)లో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. -
కాలిఫోర్నియాలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు కాలిఫోర్నియాలో ఘనంగా జరిగాయి. ట్రై వ్యాలీ ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
American Citizenship: అమెరికాలో నేచురలైజేషన్ కింద పెద్ద ఎత్తున అక్కడి పౌరులుగా మారారు. 2022లో దాదాపు 66 వేల మందికి ఆ హోదా లభించింది. మెక్సికన్లు అత్యధిక మంది సహజీకృత పౌరసత్వం పొందారు. తర్వాత స్థానంలో భారత్ నిలిచింది. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని శ్రీశృంగేరి విద్యాపీఠం దేవస్థానం ఆడిటోరియంలో శ్రీరామ నవమి వేడుకలను శనివారం (ఏప్రిల్ 20న) ఘనంగా నిర్వహించారు. -
బర్మింగ్హామ్లో కన్నుల పండువగా శ్రీరామనవమి వేడుకలు
ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ నగరం శ్రీరామనవమి వేళ భద్రాద్రి వాతావరణాన్ని తలపించింది. అక్కడి తెలుగువారు ఈ వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. -
కాన్సాస్లో ఆట పాటలతో సందడిగా ఉగాది వేడుకలు
అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
అమెరికాలో వైభవంగా ‘మాటా’ తొలి కన్వెన్షన్
అమెరికాలో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) తొలి కన్వెన్షన్ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి . -
వైభవంగా ‘టాగో’ ఉగాది వేడుకలు
ఫ్లోరిడాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా ‘క్రోధి’ ఉగాది వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని పెవిలియన్ ఆడిటోరియంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
టొరంటోలో వైభవంగా ‘టీసీఏ’ ఉగాది వేడుకలు
తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
11 దేశాల కవులతో అంతర్జాతీయ వేదికపై ఉగాది కవి సమ్మేళనం
వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘ఉగాది కవి సమ్మేళనం’ ఘనంగా జరిగింది. -
‘షికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది, శ్రీరామనవమి వేడుకలు
అమెరికా ఇల్లినాయిస్లోని షికాగోలో ‘చికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ఘనంగా ‘సింగపూర్ తెలుగు సమాజం’ ఉగాది వేడుకలు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
‘‘ఏపీ హితం కోసం ఎన్డీయేకే మా మద్దతు’’
దుబాయిలో వందలమంది తెలుగు వారు కలసి ఉగాది వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. -
అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగువాడు.. గోపీచంద్ తోటకూర
Gopichand Thotakura: అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. విజయవాడలో జన్మించిన ఆయనను బ్లూ ఆరిజిన్ సంస్థ ఎన్ఎస్-25 మిషన్లో టూరిస్ట్గా రోదసీలోకి తీసుకెళ్లనుంది. -
యూకే కుటుంబ వీసా కఠినతరం.. వేతన పరిమితి 55% పెంపు
UK Family Visa: యూకే కుటుంబ వీసా నిబంధనలను కఠినతరం చేశారు. దీని కోసం వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55శాతం పెంచారు. -
అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి అనుమానాస్పద మృతి
మరో భారత విద్యార్థి అమెరికాలో మృతిచెందాడు. హైదరాబాద్కు చెందిన అబ్దుల్ చనిపోయినట్లు దౌత్యకార్యాలయం ప్రకటించింది. ఈ ఏడాది 11 మంది భారత విద్యార్థులు అమెరికాలో చనిపోయారు. -
ఈ ఎన్నికలు ఏపీకి ఎంతో కీలకం.. మీ సహకారం కావాలి.. ఎన్నారైలతో నారా లోకేష్
తాజా వార్తలు (Latest News)
-
వైకాపాకు మరో షాక్.. మాజీ మంత్రి డొక్కా రాజీనామా
-
ఐపీఓకు స్విగ్గీ రెడీ.. సెబీ రహస్య మార్గంలో దరఖాస్తు
-
ఆ సమయంలో అతడు ఒక్క బౌండరీ కొట్టలేదు : విరాట్ స్ట్రైక్రేట్పై గావస్కర్
-
అమెరికాలో గాజా అలజడి.. భారత సంతతి విద్యార్థిని అరెస్ట్
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM