ప్రవాసుల కష్టాలకో పరిష్కారం ‘రెడియో’
ఉపాధి కోసం విదేశాలకు వెళ్లే వారితోపాటు, చదువు, ఉద్యోగ రీత్యా పొరుగు దేశాల్లో ఆశ్రయం పొందుతున్న ప్రవాసులకు స్థానికంగా అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. ముఖ్యంగా కార్మికులుగా వెళ్లిన వారు, ప్రత్యేకించి గల్ఫ్ ప్రాంతాలకు వెళ్లిన వారు
విదేశాల్లోని బాధితులకు అండగా ఓ సంస్థ
దౌత్యవేత్త ధ్యానేశ్వర్ మూలే నేతృత్యం
పలు దేశాల్లో వాలంటీర్ల ద్వారా 24 గంటలూ సేవలు
ఈనాడు హైదరాబాద్: ఉపాధి కోసం విదేశాలకు వెళ్లే వారితోపాటు, చదువు, ఉద్యోగ రీత్యా పొరుగు దేశాల్లో ఆశ్రయం పొందుతున్న ప్రవాసులకు స్థానికంగా అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. ముఖ్యంగా కార్మికులుగా వెళ్లిన వారు, ప్రత్యేకించి గల్ఫ్ ప్రాంతాలకు వెళ్లిన వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏజెంట్ల చేతిలో మోసపోవడం, పరాయి దేశంలో ఉద్యోగం ఇచ్చిన వ్యక్తుల నుంచే శారీరక, మానసిక వేధింపులు, అకస్మాత్తుగా ఉద్యోగాలు కోల్పోయి తిండి, నివాసం లేక వీధినపడటం, ప్రమాదాలకు గురై వైద్యం అందకపోవడం, చిన్నచిన్న నేరాలకే జైలుపాలై బయటకొచ్చే మార్గంలేక అక్కడే మగ్గిపోవడం వంటి వాటితో సతమతమవుతుంటారు. ఇలాంటి వారికి అండగా నిలిచేందుకు రెడియో(రెస్క్యూయింగ్ ఎవ్రీ డిస్ట్రెస్డ్ ఇండియన్ ఓవర్సీస్) అనే సంస్థ ముందుకు వచ్చింది. దౌత్యవేత్త, జాతీయ మానవ హక్కుల సంఘం సభ్యుడిగా ఉన్న ధ్యానేశ్వర్ మూలే దీనికి నేతృత్వం వహిస్తున్నారు. ‘ఇప్పటికే 18 దేశాల్లో కార్యకలాపాలను ప్రారంభించిన ఈ సంస్థకు అంతర్జాతీయంగా 20 మంది సలహాదారులున్నారని, ఏర్పాటైన ఏడాదిన్నర కాలంలోనే యూఏఈ, సౌదీ అరేబియా, అమెరికా తదితర దేశాల్లో చాలామంది బాధితులకు అండగా నిలిచామని’ ఆయన చెబుతున్నారు.
అత్యవసర సాయమే లక్ష్యం
విదేశాల్లో ఉపాధికోసం వెళ్లి ఇబ్బందుల్లో పడే వారిని ఆదుకోవడానికి 2009లో విదేశీ మంత్రిత్వశాఖ ఇండియన్ కమ్యూనిటీ వెల్ఫేర్ ఫండ్(ఐసీడబ్ల్యూఎఫ్)ను ఏర్పాటుచేసింది. దాని ద్వారా బాధితులకు తాత్కాలిక వసతి కల్పించడం, న్యాయ సహాయం, అత్యవసర వైద్యం తదితర కార్యక్రమాలు చేపడుతోంది. అయితే బాధితులు ఎక్కువ మంది ఈ సాయం పొందలేకపోతున్నారు. ‘‘అత్యవసర సమయాల్లో ఐసీడబ్ల్యూఎఫ్ రంగంలోకి దిగేవరకు బాధితులు ఎదురుచూడాల్సి వస్తుంది. వీరి వద్ద ఉన్న సిబ్బందీ పరిమితం. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకునే ‘రెడియో’ ఏర్పాటైంది’’ అని నిర్వాహకులు తెలిపారు. సంస్థ తరఫున విదేశాల్లో ప్రత్యేకంగా సలహాదారులను, వాలంటీర్లను నియమించుకోవడం ద్వారా భారత విదేశీ మంత్రిత్వశాఖతో సమన్వయం చేసుకుంటూ బాధితులను ఆదుకునేందుకు అనేక కార్యక్రమాలను చేపడుతున్నట్టు వెల్లడించారు. ‘‘సౌదీలోని జెడ్డా నగరంలో నిర్బంధానికి గురైన భారత పౌరులను విడుదల చేయించడంతోపాటు వారు స్వదేశానికి చేరడానికి అవసరమైన ఏర్పాట్లుచేసినట్టు’’ రెడియో గ్లోబల్ అడ్మినిస్ట్రేటర్ ధనశ్రీ పాటిల్ తెలిపారు. పలువురు కార్మికులు తిరిగి స్వదేశానికి వెళ్లడానికి వీలుగా పాస్పోర్టులు ఇప్పించడం, ఇండియన్ మిషన్ నుంచి అత్యవసర సర్టిఫికెట్లు వచ్చేలా చూడటం వంటివీ చేసినట్లు వివరించారు. ‘‘ఇటీవల దుబాయ్కు సర్వెంట్గా వెళ్లి అనధీకృత ఏజెంట్ మోసానికి గురైన మహిళను రక్షించాం. ఇలా అనేక మందికి అండగా నిలుస్తోన్న సంస్థ సిబ్బంది 24 గంటలూ అందుబాటులో ఉంటారని’’ ధనశ్రీ పాటిల్ వెల్లడించారు. ఉక్రెయిన్ సంక్షోభంలో 4,820 మంది భారతీయ విద్యార్థులకు సాయపడినట్టు వివరించారు.
అన్ని వేళలా అండగా నిలిచేందుకే
- ధ్యానేశ్వర్ మూలే
ఉపాధి కోసం వివిధ వృత్తుల వారు లక్షల్లోనే విదేశాలకు వెళ్తున్నారు. అక్కడ మోసాలకు గురై కొందరు, తెలిసో తెలియకో పొరపాట్లు చేసి మరికొందరు ఇబ్బందుల్లో పడుతున్నారు. అలాంటి వారికి భరోసా ఇవ్వడమే సంస్థ లక్ష్యం.గతంలో ఇబ్బందుల్లో ఉన్న వారికి అందించిన సాయం ఆధారంగా అన్ని దేశాల్లో సలహాదారులను ఎంపిక చేస్తున్నాం. వీరంతా ఆయా దేశాల్లోని పరిస్థితులకు అనుగుణంగా పనిచేయడంతోపాటు భారత ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటారు.
ఎలా సంప్రదించాలి
రెడియో హెల్ప్లైన్ నంబరు-9503107419,
మెయిల్-redio.help@gmail.com
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తానాలో కీలక కమిటీలకు ఛైర్పర్సన్ల నియామకం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)లో కీలకమైన వివిధ విభాగాలకు కమిటీ ఛైర్ పర్సన్లను నియమిస్తూ తానా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. -
బోఇసీలో వైభవంగా ఉగాది వేడుకలు
అమెరికాలోని ఇడాహో రాష్ట్రం బోఇసీ నగరంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
అల్బనీలో ఉగాది వేడుకలు.. ఆర్పీ పట్నాయక్, అలీ, కౌశల్ సందడి
న్యూయార్క్ రాజధాని అల్బనీ పరిధిలో నివసిస్తున్న తెలుగు ప్రజల కోసం ఏర్పాటైన అల్బనీ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. -
వెస్ట్ లండన్ బాలాజీ ఆలయంలో ఘనంగా రాములోరి కల్యాణోత్సవం
లండన్లోని శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) స్వామి టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్(SVBTCC)లో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. -
కాలిఫోర్నియాలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు కాలిఫోర్నియాలో ఘనంగా జరిగాయి. ట్రై వ్యాలీ ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
American Citizenship: అమెరికాలో నేచురలైజేషన్ కింద పెద్ద ఎత్తున అక్కడి పౌరులుగా మారారు. 2022లో దాదాపు 66 వేల మందికి ఆ హోదా లభించింది. మెక్సికన్లు అత్యధిక మంది సహజీకృత పౌరసత్వం పొందారు. తర్వాత స్థానంలో భారత్ నిలిచింది. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని శ్రీశృంగేరి విద్యాపీఠం దేవస్థానం ఆడిటోరియంలో శ్రీరామ నవమి వేడుకలను శనివారం (ఏప్రిల్ 20న) ఘనంగా నిర్వహించారు. -
బర్మింగ్హామ్లో కన్నుల పండువగా శ్రీరామనవమి వేడుకలు
ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ నగరం శ్రీరామనవమి వేళ భద్రాద్రి వాతావరణాన్ని తలపించింది. అక్కడి తెలుగువారు ఈ వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. -
కాన్సాస్లో ఆట పాటలతో సందడిగా ఉగాది వేడుకలు
అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
అమెరికాలో వైభవంగా ‘మాటా’ తొలి కన్వెన్షన్
అమెరికాలో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) తొలి కన్వెన్షన్ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి . -
వైభవంగా ‘టాగో’ ఉగాది వేడుకలు
ఫ్లోరిడాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా ‘క్రోధి’ ఉగాది వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని పెవిలియన్ ఆడిటోరియంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
టొరంటోలో వైభవంగా ‘టీసీఏ’ ఉగాది వేడుకలు
తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
11 దేశాల కవులతో అంతర్జాతీయ వేదికపై ఉగాది కవి సమ్మేళనం
వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘ఉగాది కవి సమ్మేళనం’ ఘనంగా జరిగింది. -
‘షికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది, శ్రీరామనవమి వేడుకలు
అమెరికా ఇల్లినాయిస్లోని షికాగోలో ‘చికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ఘనంగా ‘సింగపూర్ తెలుగు సమాజం’ ఉగాది వేడుకలు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
‘‘ఏపీ హితం కోసం ఎన్డీయేకే మా మద్దతు’’
దుబాయిలో వందలమంది తెలుగు వారు కలసి ఉగాది వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. -
అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగువాడు.. గోపీచంద్ తోటకూర
Gopichand Thotakura: అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. విజయవాడలో జన్మించిన ఆయనను బ్లూ ఆరిజిన్ సంస్థ ఎన్ఎస్-25 మిషన్లో టూరిస్ట్గా రోదసీలోకి తీసుకెళ్లనుంది. -
యూకే కుటుంబ వీసా కఠినతరం.. వేతన పరిమితి 55% పెంపు
UK Family Visa: యూకే కుటుంబ వీసా నిబంధనలను కఠినతరం చేశారు. దీని కోసం వార్షిక వేతన పరిమితిని ఏకంగా 55శాతం పెంచారు. -
అమెరికాలో అదృశ్యమైన హైదరాబాద్ విద్యార్థి అనుమానాస్పద మృతి
మరో భారత విద్యార్థి అమెరికాలో మృతిచెందాడు. హైదరాబాద్కు చెందిన అబ్దుల్ చనిపోయినట్లు దౌత్యకార్యాలయం ప్రకటించింది. ఈ ఏడాది 11 మంది భారత విద్యార్థులు అమెరికాలో చనిపోయారు.
తాజా వార్తలు (Latest News)
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య
-
సల్మాన్ఖాన్ ఇల్లు మారుతున్నారా?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM