TANA: తానా ఫౌండేషన్ కొత్త కార్యవర్గం ఎన్నిక... ఛైర్మన్గా శశికాంత్
TANA ఫౌండేషన్కు కొత్త కార్యవర్గం ఎన్నికైంది. చైర్మన్గా శశికాంత్ వల్లేపల్లి, సెక్రటరీగా విద్యాధర్ గారపాటి, ట్రెజరర్గా వినయ్ మద్దినేని, జాయింట్ ట్రెజరర్గా కిరణ్ గోగినేని ఎన్నికయ్యారు.
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA)లో ముఖ్య విభాగమైన ఫౌండేషన్కు కొత్త కార్యవర్గం ఎన్నికైంది. ఫౌండేషన్ చైర్మన్గా శశికాంత్ వల్లేపల్లి, సెక్రటరీగా విద్యాధర్ గారపాటి, ట్రెజరర్గా వినయ్ మద్దినేని, జాయింట్ ట్రెజరర్గా కిరణ్ గోగినేని ఎన్నికయ్యారు. శశికాంత్ వల్లేపల్లి తానాలో మొదటి నుంచి మంచి దాతగా పేరు తెచ్చుకున్నారు. తానా ద్వారా ఎంతోమందికి సహాయాన్ని అందించారు. ఎన్నో ప్రాజెక్టులకు ఫండింగ్ కూడా చేస్తున్నారు. సేవాభావం, అందరితో కలిసిపోయే స్వభావం ఉన్న శశికాంత్ వల్లేపల్లి... కాంత్ ఫౌండేషన్ ద్వారా కూడా ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తున్నారు. కొవిడ్ మహమ్మారి సమయంలో తెలుగు రాష్ట్రాల్లో ఆయన చేసిన సహాయం మరచిపోలేనిది. తానా ఫౌండేషన్ చేయూత కార్యక్రమానికి కోఆర్డినేటర్గా వేలాది మంది విద్యార్థుల చదువుకు శశికాంత్ సహాయాన్ని అందించారు. తానా ఫౌండేషన్ ట్రజరర్గా, కార్యదర్శిగా కూడా శశికాంత్ వల్లేపల్లి గతంలో పనిచేశారు.
విద్యా గారపాటి తానాలో కమ్యూనిటీకి సహాయం అందించేవారిలో మొదటివరుసలో ఉండే మనిషి. కమ్యూనిటీకి ఏదైనా సేవ చేయాలన్న సంకల్పంతో తానాలో చేరారు. తానాలో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ అటు అమెరికాలోనూ, ఇటు తెలుగు రాష్ట్రాల్లోనివారికి సేవలందిస్తున్నారు. సొంత నిధుల నుంచి దాదాపు 75,000,00 డాలర్లను ఆయన ఇంతవరకు సేవా కార్యక్రమాలకు ఖర్చు పెట్టారు. అమెరికాలో తానా, నాటా, నాట్స్, టిటిఎ లాంటి జాతీయ తెలుగు సంఘాలు నిర్వహించే మహా సభలకు వచ్చేవారి దాహాన్ని తీర్చేందుకు లక్షల రూపాయల విలువ చేసే మంచినీటి బాటిళ్లను అందజేస్తున్నారు. ఇటీవల ఫిలడెల్పియాలో జరిగిన తానా మహాసభల్లో 70,000 వాటర్ బాటిళ్ళను అందజేశారు. తెలుగు రాష్ట్రాల్లో గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్తో కలసి తానా ద్వారా క్యాన్సర్ నిర్దారణ శిబిరాలను నిర్వహించి ఎంతోమందికి చికిత్సకు సహాయాన్ని అందించారు. గతంలో తానా పబ్లిసిటీ కమిటీకి ఛైర్మన్గా మరియు న్యూజెర్సీ రీజియన్కు రీజనల్ కోఆర్డినేటర్గా పనిచేశారు.
తానా ఫౌండేషన్కి ట్రెజరర్గా వినయ్ మద్దినేని ఎన్నికయ్యారు. ఆయన తానా ఎగ్జిక్యూటివ్ కమిటీలోనూ, ఇతర కమిటీల్లోనూ పని చేసి ప్రశంసలు అందుకున్నారు. ప్రస్తుతం ఫౌండేషన్ ట్రస్టీగా ఉన్న ఆయన... మెట్రో అట్లాంటా ప్రాంతంలో చురుకైన కమ్యూనిటీ నాయకుడు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ మెట్రో అట్లాంటా (తామా)కి అధ్యక్షుడిగా, బోర్డు చైర్గానూ పనిచేశారు. కిరణ్ గోగినేని ఫౌండేషన్ జాయింట్ ట్రెజరర్గా ఎన్నికయ్యారు. ఇంతకుముందు తానాలో వివిధ పదవులను చేపట్టారు. అట్లాంటాకు చెందిన ఆయన 2019-2021 మధ్య తానా ప్రాంతీయ ప్రతినిధిగా సేవలందించారు. మెట్రో అట్లాంటా తెలుగు సంఘం (తామా), ఇండియన్ ఫ్రెండ్స్ ఆఫ్ అట్లాంటా తదితర సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఘనంగా COTA ఉగాది ఉత్సవాలు..
COTA ఆధ్వర్యంలో యూకేలో ఉగాది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. -
కారు పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి
అమెరికా(USA)లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ మహిళలు ప్రాణాలు కోల్పోయారు. -
తానాలో కీలక కమిటీలకు ఛైర్పర్సన్ల నియామకం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)లో కీలకమైన వివిధ విభాగాలకు కమిటీ ఛైర్ పర్సన్లను నియమిస్తూ తానా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. -
బోఇసీలో వైభవంగా ఉగాది వేడుకలు
అమెరికాలోని ఇడాహో రాష్ట్రం బోఇసీ నగరంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
అల్బనీలో ఉగాది వేడుకలు.. ఆర్పీ పట్నాయక్, అలీ, కౌశల్ సందడి
న్యూయార్క్ రాజధాని అల్బనీ పరిధిలో నివసిస్తున్న తెలుగు ప్రజల కోసం ఏర్పాటైన అల్బనీ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. -
వెస్ట్ లండన్ బాలాజీ ఆలయంలో ఘనంగా రాములోరి కల్యాణోత్సవం
లండన్లోని శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) స్వామి టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్(SVBTCC)లో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. -
కాలిఫోర్నియాలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు కాలిఫోర్నియాలో ఘనంగా జరిగాయి. ట్రై వ్యాలీ ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
American Citizenship: అమెరికాలో నేచురలైజేషన్ కింద పెద్ద ఎత్తున అక్కడి పౌరులుగా మారారు. 2022లో దాదాపు 66 వేల మందికి ఆ హోదా లభించింది. మెక్సికన్లు అత్యధిక మంది సహజీకృత పౌరసత్వం పొందారు. తర్వాత స్థానంలో భారత్ నిలిచింది. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని శ్రీశృంగేరి విద్యాపీఠం దేవస్థానం ఆడిటోరియంలో శ్రీరామ నవమి వేడుకలను శనివారం (ఏప్రిల్ 20న) ఘనంగా నిర్వహించారు. -
బర్మింగ్హామ్లో కన్నుల పండువగా శ్రీరామనవమి వేడుకలు
ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ నగరం శ్రీరామనవమి వేళ భద్రాద్రి వాతావరణాన్ని తలపించింది. అక్కడి తెలుగువారు ఈ వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. -
కాన్సాస్లో ఆట పాటలతో సందడిగా ఉగాది వేడుకలు
అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
అమెరికాలో వైభవంగా ‘మాటా’ తొలి కన్వెన్షన్
అమెరికాలో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) తొలి కన్వెన్షన్ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి . -
వైభవంగా ‘టాగో’ ఉగాది వేడుకలు
ఫ్లోరిడాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా ‘క్రోధి’ ఉగాది వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని పెవిలియన్ ఆడిటోరియంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
టొరంటోలో వైభవంగా ‘టీసీఏ’ ఉగాది వేడుకలు
తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
11 దేశాల కవులతో అంతర్జాతీయ వేదికపై ఉగాది కవి సమ్మేళనం
వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘ఉగాది కవి సమ్మేళనం’ ఘనంగా జరిగింది. -
‘షికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది, శ్రీరామనవమి వేడుకలు
అమెరికా ఇల్లినాయిస్లోని షికాగోలో ‘చికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ఘనంగా ‘సింగపూర్ తెలుగు సమాజం’ ఉగాది వేడుకలు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
‘‘ఏపీ హితం కోసం ఎన్డీయేకే మా మద్దతు’’
దుబాయిలో వందలమంది తెలుగు వారు కలసి ఉగాది వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. -
అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగువాడు.. గోపీచంద్ తోటకూర
Gopichand Thotakura: అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. విజయవాడలో జన్మించిన ఆయనను బ్లూ ఆరిజిన్ సంస్థ ఎన్ఎస్-25 మిషన్లో టూరిస్ట్గా రోదసీలోకి తీసుకెళ్లనుంది.
తాజా వార్తలు (Latest News)
-
వివాదాస్పదంగా మారిన చేరిక.. నల్గొండ నేతల అభ్యంతరంతో నిలిపివేత..
-
పెళ్లి శుభలేఖపై పెంపుడు శునకాల పేర్లు
-
ఏపీలో స్టాంపు పేపర్లుండవు.. ఇక జిరాక్స్ కాపీలే!
-
సమాధాన పత్రాల్లో ‘జై శ్రీరాం’, క్రికెటర్ల పేర్లు.. ఉత్తీర్ణులు చేసిన ఆచార్యుల తొలగింపు
-
అప్పలరాజును చిత్తుగా ఓడించాలి: ఎంపీ రామ్మోహన్నాయుడు
-
ఆకలేస్తోంది.. దోశ తినేసి వస్తా.. శస్త్రచికిత్స మధ్యలో ఆపేసిన వైద్యుడు