ఉత్సాహంగా తానా ‘నెల నెలా తెలుగు వెలుగు’ సాహిత్య సభ
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సాహిత్య విభాగం తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ‘నెల నెలా తెలుగు వెలుగు’ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది.
అమెరికా: ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సాహిత్య విభాగం తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ‘నెల నెలా తెలుగు వెలుగు’ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. ప్రతి నెలా ఆఖరి ఆదివారం అంతర్జాతీయస్థాయిలో అంతర్జాలం వేదికగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమ పరంపరలో భాగంగా నవంబర్ 26న ‘నేటి బాల రచయితలే - రేపటి మేటి రచయితలు’ పేరిట నిర్వహించిన 62వ సాహిత్యసభ విజయవంతమైంది. తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు ఈ కార్యక్రమంలో బాల రచయితలకు, విశిష్ట అతిథులకు స్వాగతం పలికారు. బాల రచయితల్ని ప్రోత్సహించడంలో తానా ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. ఈ సందర్భంగా తానా ప్రపంచ సాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ బాల, యువ రచయితలు ఇంత చిన్న వయస్సులో కథలు, కవితలు, పద్యాలు, శతకాలు, నవలలు స్వతహగా రాయడం, తెలుగు సాహిత్యంపై ఎంతో పట్టు కలిగి ఉండటం, ఎంతో పరిణితితో కూడిన ప్రసంగాలు చేయడం అద్భుతమన్నారు. వారందరికీ శుభాకాంక్షలు చెప్పారు. వీరిని ప్రోత్సహిస్తున్న తల్లి దండ్రులకు, శిక్షణ ఇస్తున్న ఉపాధ్యాయులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహిత్య పురస్కార గ్రహీత డా. పత్తిపాక మోహన్, విశిష్ట అతిథిగా బాల వికాసవేత్త గరిపెల్ల అశోక్, ప్రత్యేక అతిథులుగా పుల్లా రామాంజనేయులు (ఉపాధ్యాయుడు, లక్ష్మీపురం, కర్నూలు జిల్లా); పసుపులేటి నీలిమ (ఉపాధ్యాయురాలు, కర్నూలు); డా. నెమిలేటి కిట్టన్న (ఉపాధ్యాయుడు, తిరుపతి); భైతి దుర్గయ్య (ఉపాధ్యాయుడు, రామునిపట్ల, సిద్ధిపేట జిల్లా); చింతకుంట కిరణ్ కుమార్ (ఉపాధ్యాయుడు, పానుగల్, వనపర్తి జిల్లా); ప్రవీణ్ కుమార్ శర్మ (ఉపాధ్యాయుడు, తడపాకల్, నిజామాబాద్) పాల్గొని యువతరంలో తెలుగుభాష పట్ల అనురక్తి, రచనాసక్తి కల్గించడానికి ఏయే మార్గాలు అనుసరించాలనే సూచనలు, సలహాలు ఇచ్చి చక్కని మార్గనిర్దేశం చేశారు.
ఈ క్రింద పేర్కొన్న బాల / యువ రచయితలు ఈ సమావేశంలో పాల్గొని తాము సృష్టించిన సాహిత్య వివరాలను, తమకు శిక్షణ ఇచ్చిన గురువులకు కృతజ్ఞతలు తెలియజేశారు. తామింకా అనేక సాహిత్య ప్రక్రియల్లో రచనలు చేసే ప్రయత్నంలో ఉన్నామని తెలిపారు. షేక్ రిజ్వాన (ఇంటర్ ద్వితియ, ఖమ్మం); లక్ష్మీ అహాల అయ్యలసోమయాజుల (7వ తరగతి, హైదరాబాద్); బండోజు శ్రావ్య (బీటెక్ ఫస్ట్ ఇయర్, సిద్ధిపేట); శీర్పి చంద్రశేఖర్ (బీబీఏ ప్రథమ సంవత్సరం, అనంతపురం); విఘ్నేశ్ అర్జున్ (ఇంటర్ ప్రథమ సంవత్సరం, హన్మకొండ); కల్పన (బీటెక్ ఫస్ట్ ఇయర్, అనంతపురం); అనుముల కృష్ణవేణి (బి.కామ్ తృతీయ సంవత్సరం, హైదరాబాద్); గీస శ్రీజ (పాలిటెక్నిక్ ప్రథమ సంవత్సరం, ఆదిలాబాద్); డేగల వైష్ణవి (ఇంటర్ ప్రథమ సంవత్సరం, నిజామాబాద్); వేల్పుల శ్రీలత (9వ తరగతి, పెద్దపల్లి); వలిపే రాంచేతన్ (9వ తరగతి, మేడ్చల్); పుల్లా మురళీ ఆకాష్ (బీఎస్సీ తృతీయ సంవత్సరం, కర్నూలు); కొండపల్లి ఉదయ్ కిరణ్ (ఇంజనీరింగ్ డిప్లమా, సంగారెడ్డి); శ్రీరాములు కుమారి (ఇంటర్ ప్రథమ సంవత్సరం, బొల్లారం); కొంపల్లి విశిష్ట (9వ తరగతి, సిద్ధిపేట). ఈ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన అందరికీ తానా ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఘనంగా COTA ఉగాది ఉత్సవాలు..
COTA ఆధ్వర్యంలో యూకేలో ఉగాది ఉత్సవాలు ఘనంగా జరిగాయి. -
కారు పల్టీలు కొట్టి, చెట్టుపై ఇరుక్కుపోయి: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయులు మృతి
అమెరికా(USA)లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ మహిళలు ప్రాణాలు కోల్పోయారు. -
తానాలో కీలక కమిటీలకు ఛైర్పర్సన్ల నియామకం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా)లో కీలకమైన వివిధ విభాగాలకు కమిటీ ఛైర్ పర్సన్లను నియమిస్తూ తానా ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంది. -
బోఇసీలో వైభవంగా ఉగాది వేడుకలు
అమెరికాలోని ఇడాహో రాష్ట్రం బోఇసీ నగరంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. -
అల్బనీలో ఉగాది వేడుకలు.. ఆర్పీ పట్నాయక్, అలీ, కౌశల్ సందడి
న్యూయార్క్ రాజధాని అల్బనీ పరిధిలో నివసిస్తున్న తెలుగు ప్రజల కోసం ఏర్పాటైన అల్బనీ తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. -
వెస్ట్ లండన్ బాలాజీ ఆలయంలో ఘనంగా రాములోరి కల్యాణోత్సవం
లండన్లోని శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) స్వామి టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్(SVBTCC)లో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. -
కాలిఫోర్నియాలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
తెదేపా అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు కాలిఫోర్నియాలో ఘనంగా జరిగాయి. ట్రై వ్యాలీ ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. -
66,000 మంది భారతీయులకు అమెరికా పౌరసత్వం
American Citizenship: అమెరికాలో నేచురలైజేషన్ కింద పెద్ద ఎత్తున అక్కడి పౌరులుగా మారారు. 2022లో దాదాపు 66 వేల మందికి ఆ హోదా లభించింది. మెక్సికన్లు అత్యధిక మంది సహజీకృత పౌరసత్వం పొందారు. తర్వాత స్థానంలో భారత్ నిలిచింది. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా శ్రీరామ నవమి వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని శ్రీశృంగేరి విద్యాపీఠం దేవస్థానం ఆడిటోరియంలో శ్రీరామ నవమి వేడుకలను శనివారం (ఏప్రిల్ 20న) ఘనంగా నిర్వహించారు. -
బర్మింగ్హామ్లో కన్నుల పండువగా శ్రీరామనవమి వేడుకలు
ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ నగరం శ్రీరామనవమి వేళ భద్రాద్రి వాతావరణాన్ని తలపించింది. అక్కడి తెలుగువారు ఈ వేడుకల్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. -
కాన్సాస్లో ఆట పాటలతో సందడిగా ఉగాది వేడుకలు
అమెరికాలోని కాన్సాస్ నగరంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. -
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
స్కాట్లాండ్లోని ఓ పర్యటక ప్రాంతంలో ట్రెక్కింగ్కు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు నీటిలోపడి మృతిచెందారు. -
అమెరికాలో వైభవంగా ‘మాటా’ తొలి కన్వెన్షన్
అమెరికాలో ‘మన అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (MATA) తొలి కన్వెన్షన్ వేడుకలు అట్టహాసంగా ముగిశాయి . -
వైభవంగా ‘టాగో’ ఉగాది వేడుకలు
ఫ్లోరిడాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ ఓర్లాండో (టాగో) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
‘తాకా’ ఆధ్వర్యంలో ఘనంగా ‘క్రోధి’ ఉగాది వేడుకలు
‘తెలుగు అలయన్స్ ఆఫ్ కెనడా’ (తాకా) ఆధ్వర్యంలో టొరంటోలోని పెవిలియన్ ఆడిటోరియంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
టొరంటోలో వైభవంగా ‘టీసీఏ’ ఉగాది వేడుకలు
తెలంగాణ కెనడా సంఘం (TCA) ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు వైభవంగా జరిగాయి. -
11 దేశాల కవులతో అంతర్జాతీయ వేదికపై ఉగాది కవి సమ్మేళనం
వంశీ అంతర్జాతీయ సాహితీ పీఠం, శ్రీ సాంస్కృతిక కళాసారథి- సింగపూర్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ‘ఉగాది కవి సమ్మేళనం’ ఘనంగా జరిగింది. -
‘షికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది, శ్రీరామనవమి వేడుకలు
అమెరికా ఇల్లినాయిస్లోని షికాగోలో ‘చికాగో తెలుగు అసోసియేషన్’ ఆధ్వర్యంలో ఉగాది, శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. -
ఘనంగా ‘సింగపూర్ తెలుగు సమాజం’ ఉగాది వేడుకలు
సింగపూర్ తెలుగు సమాజం ఆధ్వర్యంలో క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు వైభవంగా నిర్వహించారు. -
‘‘ఏపీ హితం కోసం ఎన్డీయేకే మా మద్దతు’’
దుబాయిలో వందలమంది తెలుగు వారు కలసి ఉగాది వేడుకలను ఉత్సాహంగా నిర్వహించారు. -
అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగువాడు.. గోపీచంద్ తోటకూర
Gopichand Thotakura: అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు వ్యక్తిగా గోపీచంద్ తోటకూర రికార్డు సృష్టించనున్నారు. విజయవాడలో జన్మించిన ఆయనను బ్లూ ఆరిజిన్ సంస్థ ఎన్ఎస్-25 మిషన్లో టూరిస్ట్గా రోదసీలోకి తీసుకెళ్లనుంది.
తాజా వార్తలు (Latest News)
-
అందుకే ముద్దు సన్నివేశాలకు నో చెబుతాను: మృణాల్ ఠాకూర్
-
అతడి హత్యకు పుతిన్ ఆదేశించి ఉండకపోవచ్చు: అమెరికా
-
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పాలస్తీనా జెండా కలకలం
-
జైల్లో కేజ్రీవాల్ను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ..!
-
రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా నకిలీ వీడియో.. దిల్లీలో కేసు నమోదు
-
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్