Actor Prudhvi: వైకాపా ఓటమి ఖాయం.. మళ్లీ అక్కడే టపాసులు కాల్చుతా: సినీనటుడు పృథ్వీ

జగనన్న వదిలిన బాణం వైకాపానే పొడుస్తోందని సినీనటుడు, జనసేన నేత పృథ్వీ అన్నారు.

Updated : 05 Apr 2024 19:52 IST

అమరావతి: జగనన్న వదిలిన బాణం వైకాపానే పొడుస్తోందని సినీనటుడు, జనసేన నేత పృథ్వీ అన్నారు. జగన్‌ వదిలిన బాణం పోటు దెబ్బ 12శాతం ఓట్లపై ప్రభావం చూపుతుందన్నారు. ఉండవల్లిలో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో ఆయన సమావేశమయ్యారు. తెదేపా, జనసేన, భాజపా ఉమ్మడి ప్రచార కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా పృథ్వీ మాట్లాడుతూ.. ఈ నెల 18నుంచి ప్రచార కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ ఎన్నికల్లో వైకాపా ఓటమి ఖాయమన్నారు. 2019లో వైకాపా విజయానికి తాడేపల్లిలో టపాసులు కాల్చానని గుర్తు చేసుకున్న ఆయన.. ఈసారి వైకాపా ఓటమికి మళ్లీ అక్కడే టపాసులు కాల్చుతానని చెప్పారు. సీఎం జగన్‌కు ప్రజలతో పాటు ప్రకృతి కూడా జవాబిస్తుందన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని