YS Sharmila: వైఎస్‌ షర్మిలపై బంజారాహిల్స్‌లో కేసు నమోదు

వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలపై బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌, సోషల్‌ మీడియాలో సీఎం కేసీఆర్‌, భారాసను ఆమె దూషించారంటూ..

Updated : 18 May 2023 10:12 IST

హైదరాబాద్: వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలపై బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌తో పాటు సోషల్‌ మీడియాలో సీఎం కేసీఆర్‌, భారాసను ఆమె దూషించారంటూ ఆ పార్టీ నేత నరేందర్‌ యాదవ్‌ ఈనెల 16న పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన బంజారాహిల్స్‌ పోలీసులు.. షర్మిలపై 505(2), 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు