BRS: 21న భారాస జాబితా?
రానున్న అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తిచేసిన భారాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 21వ తేదీన మొదటి జాబితాను ప్రకటించనున్నట్లు తెలిసింది.
తొలి విడతలో 87 మంది పేర్లు వెల్లడి!
కొందరు సిట్టింగ్ల మార్పు తప్పదు..
మొత్తంగా 10 స్థానాల్లో కొత్తముఖాలు
గజ్వేల్ నుంచే కేసీఆర్ పోటీ!
ఈనాడు, హైదరాబాద్: రానున్న అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తిచేసిన భారాస అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 21వ తేదీన మొదటి జాబితాను ప్రకటించనున్నట్లు తెలిసింది. ముందుగా ఈ నెల 18న అభ్యర్థుల జాబితాను విడుదల చేయాలని భావించినా.. 21న వెల్లడించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కానీ దీనిపై అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 20న సూర్యాపేట జిల్లాలో కలెక్టరేట్ భవనం, ఎస్పీ కార్యాలయం, భారాస పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవాలతో పాటు బహిరంగసభలో పాల్గొననున్నారు. అందువల్ల 21వ తేదీనే అభ్యర్థుల మొదటి జాబితాను ప్రకటిస్తారని భావిస్తున్నారు. కేసీఆర్ 2018లో 105 శాసనసభ స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించి సంచలనం సృష్టించారు. ఈసారి మాత్రం మొదటి విడతలో అంతమంది పేర్లు ప్రకటించకపోయినా.. సుమారు 87 స్థానాలకు అభ్యర్థులను వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. అన్ని స్థానాలకూ ప్రకటించేస్తే పూర్తిస్థాయిలో ఎన్నికలబరిలోకి దిగవచ్చని, ఎవరైనా వెనకబడితే మార్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుందనే అభిప్రాయాలు పార్టీలో వ్యక్తమవుతున్నట్లు సమాచారం. ముఖ్యమంత్రి కేసీఆర్ రెండోస్థానంగా కామారెడ్డి నుంచి కూడా పోటీ చేస్తారనే ప్రచారం జరిగినా ఆయన గజ్వేల్ నుంచి మాత్రమే పోటీలో ఉంటారని సమాచారం. మొత్తంమీద సుమారు పది మంది మాత్రమే కొత్త అభ్యర్థులుండే అవకాశం ఉండొచ్చని భావిస్తున్నారు.
ఏయే జిల్లాల్లో ఎలాంటి మార్పులు?
ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో అభ్యర్థులెవరినీ మార్చకపోవచ్చని తెలుస్తోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో గత ఎన్నికల్లో పోటీ చేసిన వారిలో ఒకరికి మాత్రమే అవకాశం ఉండదని, అక్కడ ఇతర పార్టీ నుంచి వచ్చి చేరే ఓ నాయకుడికి టికెట్ ఇస్తారని సమాచారం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ముగ్గురు ఎమ్మెల్యేలను మార్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. పలు సర్వేల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా ఒకటి రెండు మార్పులకే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డోర్నకల్ నుంచి రెడ్యానాయక్ లేదా ఆయన కుమార్తె, మహబూబాబాద్ ఎంపీ కవిత.. ఇద్దరిలో ఎవరో ఒకరు అనే ప్రచారం జరిగినా చివరకు రెడ్యానాయక్నే పోటీ చేయించాలనే అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం. మహబూబాబాద్లో మాత్రం సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్నాయక్ లేదా మంత్రి సత్యవతి రాథోడ్లలో ఒకరికి అవకాశం కల్పించనున్నట్లు సమాచారం. సత్యవతి రాథోడ్కే ఎక్కువ అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. జనగామలో సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చితే ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, పోచంపల్లి శ్రీనివాసరెడ్డిలలో ఒకరికి ఇచ్చే అవకాశం ఉంది. పల్లాకే ఎక్కువ అవకాశాలున్నట్లు తెలుస్తున్నా.. స్పష్టత రావడానికి మరో రెండు రోజులు పట్టవచ్చు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఒక స్థానంలో మాత్రమే మార్పు చేయవచ్చని సమాచారం.
ఇల్లెందులో గుమ్మడి నరసయ్య కుమార్తె!
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పుపై చర్చ జరిగినట్లు సమాచారం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లెందు నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య కుమార్తె, ఉస్మానియా విశ్వవిద్యాలయం న్యాయకళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న అనూరాధ పేరు తెరపైకి వచ్చినట్లు తెలిసింది. అక్కడ గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలుపొందిన హరిప్రియ తర్వాత భారాసలో చేరారు. ఈసారి ఇల్లెందు అభ్యర్థిని మార్చాలని కొన్నాళ్ల క్రితమే భారాస నాయకత్వం నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈమెకు ప్రత్యామ్నాయం గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆ జిల్లా నాయకులు గుమ్మడి అనూరాధ పేరు సూచించినట్లు తెలిసింది. బుధవారం రాత్రి ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకులు ముఖ్యమంత్రితో సమావేశమైనప్పుడు కూడా ఈ అంశంపై చర్చించినట్లు సమాచారం. ఈ నియోజకవర్గానికే చెందిన జిల్లా పరిషత్ ఛైర్మన్ కనకయ్య కాంగ్రెస్లో చేరి.. అసెంబ్లీ బరిలోకి దిగనున్నందున కొత్త అభ్యర్థి కంటే సిట్టింగ్ ఎమ్మెల్యేకే టికెట్ ఇవ్వడం మంచిదన్న అభిప్రాయం కూడా వ్యక్తమైనట్లు తెలిసింది. వైరా నుంచి గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొంది తర్వాత భారాసలో చేరిన రాములునాయక్ను కూడా ఈ ఎన్నికల్లో మార్చాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇక్కడి నుంచి మదన్లాల్కు అవకాశం కల్పించనున్నట్లు తెలిసింది. మొత్తంమీద ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకరిని మార్చడం ఖాయమని తెలుస్తోంది. రెండో స్థానంలో మార్పు గురించి అభ్యర్థుల ప్రకటన నాటికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత బలగాలకు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ది: ప్రధాని మోదీ
దిల్లీ, హరియాణాల్లో చీపురు (ఆప్ ఎన్నికల గుర్తు)కు మద్దతు పలుకుతున్న కాంగ్రెస్ పార్టీ.. పంజాబ్కు వచ్చేసరికి మాత్రం మిత్రపక్షంపైనే విమర్శలు గుప్పిస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
దీదీతో పొత్తుపై హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి.. అధీర్ కాదు: ఖర్గే
మమతా బెనర్జీని ఉద్దేశించి తమ పార్టీ నేత అధీర్ రంజన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. -
ఇంటినుంచి ఓటేసిన మన్మోహన్ సింగ్, ఆడ్వాణీ
రాజకీయ కురువృద్ధులు మన్మోహన్ సింగ్, ఆడ్వాణీ ఇంటి నుంచి తమ ఓటు హక్కు (Home voting)ను వినియోగించుకున్నారు. -
హామీలను అమలు చేసే శక్తి సీఎం రేవంత్రెడ్డికి లేదు: కిషన్రెడ్డి
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసే శక్తి సీఎం రేవంత్రెడ్డికి లేదని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు. -
అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం: జీవన్రెడ్డి
ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి విమర్శించారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. -
రైతుబంధు పథకంపై కేబినెట్ సమావేశంలో చర్చించాలి: వినోద్కుమార్
ఈ కేబినెట్ సమావేశంలోనైనా మంచి నిర్ణయాలు తీసుకోవాలని భారాస నేత వినోద్కుమార్ కోరారు. -
సినిమాల కంటే ఎన్నికల ప్రచారమే చాలా కష్టం: కంగనా రనౌత్ ఆసక్తికర పోస్ట్
Kangana Ranaut: సినిమాల కంటే ఎన్నికల ప్రచారమే చాలా కష్టంతో కూడుకున్న పని అని అంటున్నారు బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్. దీనిపై ఆమె చేసిన పోస్ట్ వైరల్గా మారింది. -
మళ్లీ గెలుస్తున్నామంటూ జగన్ ప్రగల్భాలు పలకడం విడ్డూరం
వైకాపా నేతలకు ఓటమి భయం పట్టుకుందని.. అందుకే జగన్ ఐ-ప్యాక్ కార్యాలయానికి వెళ్లి, చిన్నపాటి ఓదార్పు యాత్ర చేశారని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. -
అభ్యర్థులకు చెప్పకుండా బ్యాలట్ బాక్సుల తరలింపు!
ఓటమి భయం పట్టుకున్న వైకాపా నేతలు గెలుపు కోసం ఎన్ని అడ్డదారులు తొక్కాలో అన్నీ చేస్తున్నారని, తొత్తులుగా ఉన్న కొందరు అధికారులు వారికి సహకరిస్తున్నారని విపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. -
విదేశాలకు తరలిపోతున్నారా..?
ఓటమి భయంతో సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇతర వైకాపా నేతలు వారి కంపెనీలతో సహా ఇతర దేశాలు, పక్క రాష్ట్రాలకు పారిపోవడానికి సిద్ధమయ్యారని తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. -
అరెస్టు భయంతో పిన్నెల్లి సోదరుల పరారీ?
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో దాడులు, అల్లర్లకు కారకులైన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లో వారిద్దరినీ అరెస్టు చేస్తారనే మాట వినిపిస్తున్న తరుణంలో మాచర్ల నుంచి హైదరాబాద్కు వెళ్లినట్లు సమాచారం. -
తెదేపా కార్యకర్తలపై పోలీసుల లాఠిన్యం
పల్నాడు జిల్లా మాచవరంలో ఎంపీపీ కుమారుడిపై జరిగిన దాడి కేసులో తెదేపాకు చెందిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకొని తీవ్రంగా హింసించారు. -
ఇసుక దోపిడీలో తాడేపల్లి ప్యాలెస్కు రూ.40 వేల కోట్లు
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గనుల శాఖ డీఎంజీ వెంకటరెడ్డి కనుసన్నల్లోనే రాష్ట్రంలో పెద్దఎత్తున ఇసుక దోపిడీకి గురైందని మాజీ మంత్రి నక్కా ఆనంద్బాబు ధ్వజమెత్తారు. -
కన్హయ్య కుమార్పై దాడికి యత్నం
కాంగ్రెస్ పార్టీ నుంచి ఈశాన్య దిల్లీ లోక్సభ స్థానానికి పోటీచేస్తున్న కన్హయ్య కుమార్పై కొందరు దుండగులు సిరా చల్లి, దాడికి యత్నించారు. -
మోదీ పదే పదే మమ్మల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు
ప్రధాని మోదీ పదే పదే తనను, ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నారని శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఆరోపించారు. -
మాలీవాల్పై దాడి కేసు భాజపా కుట్రే: ఆప్
తమ పార్టీ ఎంపీ స్వాతి మాలీవాల్పై దాడి కేసు దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను ఇరికించేందుకు భాజపా పన్నిన కుట్ర అని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శుక్రవారం ఆరోపించింది. -
రాయ్బరేలీ మీ కుటుంబ స్థానమా?
ఉత్తర్ప్రదేశ్లోని రాయ్బరేలీని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ తమ కుటుంబ నియోజకవర్గంగా చెప్పడాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్షా తప్పుబట్టారు. శుక్రవారం యూపీలోని దౌలత్పుర్లో సభలో ఆయన ప్రసంగించారు. -
నా తనయుడు మిమ్మల్ని నిరాశపరచడు
రెండు దశాబ్దాల పాటు రాయ్బరేలీ లోక్సభ స్థానానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం కల్పించిన ప్రజలు ఇప్పుడు తన తనయుడు రాహుల్గాంధీని సొంత మనిషిగా స్వీకరించాలని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కోరారు. -
మళ్లీ భాజపా గెలిస్తే.. శరద్ పవార్, ఉద్ధవ్ జైలుకే
మహారాష్ట్రలోని భివండీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో దిల్లీ సీఎం, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. -
కాంగ్రెస్, ఎస్పీ అధికారంలోకి వస్తే.. రామమందిరాన్ని కూల్చేస్తాయ్
కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ)లపై ప్రధాని మోదీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అవి అధికారంలోకి వస్తే..రామమందిరాన్ని కూల్చివేస్తాయని అన్నారు. దేశంలో అస్థిరతను సృష్టించేందుకే విపక్ష ఇండియా కూటమి ఎన్నికల బరిలో నిలిచిందంటూ విమర్శించారు. -
ఔరంగజేబు స్ఫూర్తి కాంగ్రెస్ నేతల్లో ప్రవేశించింది
మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు స్ఫూర్తి మన కాంగ్రెస్ నేతల్లో ప్రవేశించింది. అందుకే అప్పట్లో హిందువులపై జిజియా పన్ను విధించిన తరహాలో ఇప్పుడు వీరు అధికారంలోకి వస్తే వారసత్వ పన్ను వేద్దామని అనుకుంటున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
భారత బలగాలకు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ది: ప్రధాని మోదీ
-
మీ కార్యాలయానికే వస్తాం.. ధైర్యముంటే అరెస్టు చేసుకోండి: కేజ్రీవాల్ సవాల్
-
కాకతీయ వర్సిటీ వీసీ రమేశ్పై విజిలెన్స్ విచారణకు ఆదేశం
-
ఎన్నికల తనిఖీల్లో.. రూ.8,889 కోట్ల సొత్తు స్వాధీనం: ఈసీ
-
పెట్స్పై ప్రేమ.. సమంత ఇలా.. జాన్వీ కపూర్ అలా!
-
దీదీతో పొత్తుపై హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి.. అధీర్ కాదు: ఖర్గే