కొందరికి మోదం.. మరికొందరికి ఖేదం
తెలుగుదేశం పార్టీ శుక్రవారం మరో 11 శాసనసభ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది. ఇది మూడో జాబితా. దీంతో ఇప్పటివరకు తెదేపా ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థుల సంఖ్య 138కి చేరింది.
11 అసెంబ్లీ స్థానాలకు తెదేపా అభ్యర్థుల ప్రకటన
కొందరు సీనియర్లకు దక్కిన అవకాశం
మరికొందరి విషయంలో వీడని ఉత్కంఠ
ఈనాడు, అమరావతి: తెలుగుదేశం పార్టీ శుక్రవారం మరో 11 శాసనసభ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది. ఇది మూడో జాబితా. దీంతో ఇప్పటివరకు తెదేపా ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థుల సంఖ్య 138కి చేరింది. పొత్తులో భాగంగా జనసేనకు 21, భాజపాకు 10 సీట్లు కేటాయించగా... తెదేపా 144 స్థానాల్లో పోటీచేస్తోంది. వాటిలో 6 సీట్లకు ఇంకా అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. మాజీ మంత్రులు కళా వెంకటరావు, గంటా శ్రీనివాసరావు, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, దేవినేని ఉమామహేశ్వరరావుల పేర్లు మూడో జాబితాలోనూ లేవు. కళా, గంటా సీట్లపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతుండగా... దేవినేని ఉమామహేశ్వరరావు, ఆలపాటి రాజాలకు ఈ ఎన్నికట్లో టికెట్లు లేవని స్పష్టమైంది. వారిద్దరూ ఆశలు పెట్టుకున్న పెనమలూరు టికెట్ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఇన్ఛార్జి బోడే ప్రసాద్కే పార్టీ ఖరారు చేసింది. గతంలో ఉమా ప్రాతినిధ్యం వహించిన, ప్రస్తుతం ఆయన ఇన్ఛార్జిగా ఉన్న మైలవరం టికెట్ని వసంత కృష్ణప్రసాద్కి పార్టీ కేటాయించింది. గత ఎన్నికల్లో వైకాపా అభ్యర్థిగా ఉమాపై గెలిచిన ఆయన ఇటీవలే తెదేపాలో చేరారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి టికెట్ని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డికే కేటాయించడంతో ఆయన అభ్యర్థిత్వంపై కొన్నాళ్లుగా ఉన్న ఉత్కంఠకు తెరపడింది. శుక్రవారం ప్రకటించిన 11 మందిలో ఏడుగురు బీసీలు, ఒకరు ఎస్సీ, ముగ్గురు ఇతరులు ఉన్నారు. తెదేపా ఇప్పటివరకు ప్రకటించిన 138 అసెంబ్లీ స్థానాల్లో బీసీలకు 31, ఎస్సీలకు 26, క్షత్రియులకు 5, ముస్లింలకు 3, వైశ్యులకు 2, వెలమలకు 1 స్థానం కేటాయించింది.
కొనసాగుతున్న ఉత్కంఠ
టికెట్ వస్తుందా.. రాదా? అన్న సందిగ్ధంలో ఉన్న కొందరు నాయకులకు తాజా జాబితా సంతోషం కలిగించగా, మరికొందరికి ఖేదం మిగిల్చింది. మరికొందరికి ఇంకా అనిశ్చితి కొనసాగుతోంది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు భీమిలి టికెట్ ఆశిస్తుండగా... ఆయనను విజయనగరం జిల్లా చీపురుపల్లికి వెళ్లాలని చంద్రబాబు సూచించారు. ఆయన టికెట్పై ఉత్కంఠకు తెరపడలేదు. మరో సీనియర్ నేత కళా వెంకటరావు ఎచ్చెర్ల టికెట్ ఆశిస్తుండగా... ఆయనను చీపురుపల్లికి గానీ, విజయనగరం ఎంపీగా గానీ పంపుతారన్న ప్రచారం జరుగుతోంది. తాజా జాబితాలోనూ దానిపై స్పష్టత ఇవ్వలేదు.
- పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్కి ఈసారి టికెట్ ఇవ్వలేమని పార్టీ అధినాయకత్వం మొదట చెప్పేసింది. పెనమలూరు నుంచి దేవినేని ఉమా, ఆలపాటి రాజాల పేర్లు పరిశీలిస్తున్నట్టు ప్రచారమూ జరిగింది. చివరకు స్థానిక పరిస్థితుల్ని పరిగణనలోకి తీసుకుని బోడే ప్రసాద్కే టికెట్ ఖరారు చేసింది.
- పొత్తులో భాగంగా మొదట అమలాపురం టికెట్ జనసేనకు కేటాయించాలనుకున్నారు. పి.గన్నవరం స్థానానికి మహాసేన రాజేశ్ను తెదేపా అభ్యర్థిగా ప్రకటించింది. అమలాపురం టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు నిరాశ చెందారు. తర్వాత పరిణామాల్లో... వైకాపా తనపై దుష్ప్రచారం చేయడంతో ఆవేదన చెందిన రాజేశ్ పోటీనుంచి వైదొలిగారు. దాంతో ఆ సీటు ఆనందరావుకు ఇస్తారన్న ప్రచారం జరిగింది. తాజాగా తెదేపా పి.గన్నవరం సీటును మిత్రపక్షాల కోసం వదులుకోవడంతో... మళ్లీ అమలాపురం నుంచి పోటీచేసే అవకాశం ఆనందరావుకు దక్కింది.
పాతవారికే పట్టం
ప్రస్తుతం నియోజకవర్గ ఇన్ఛార్జులుగా ఉన్న గౌతు శిరీష (పలాస), కోళ్ల లలితకుమారి (ఎస్.కోట), వనమాడి వెంకటేశ్వరరావు (కాకినాడ సిటీ), చదలవాడ అరవింద్బాబు (నరసరావుపేట)లకు ఊరట లభించింది. ఆయా నియోజకవర్గాల్లో వేరే అభ్యర్థుల్ని రంగంలోకి దించుతారని ప్రచారం జరగడం, తొలి రెండు జాబితాల్లో తమ పేర్లు లేకపోవడంతో వీరు కొంత టెన్షన్గా ఉన్నారు. కొత్తవారిని బరిలోకి దించాలని పార్టీ అధినాయకత్వం మొదట భావించింది. కాకినాడలో సిటీ టికెట్ వనమాడి కొండబాబుకు బదులు ఆయన సతీమణికి ఇస్తారన్న ప్రచారమూ జరిగింది. సర్వేపల్లి టికెట్ సోమిరెడ్డి కోడలికి ఇస్తారన్న ప్రచారమూ సాగింది. చివరకు పాతవారిపైనే నమ్మకం ఉంచిన అధిష్ఠానం వారికే అవకాశమిచ్చింది.
ఎచ్చెర్ల సీటు భాజపాకు?
పొత్తులో భాగంగా శ్రీకాకుళం సీటు భాజపాకు కేటాయించాలని మొదట నిర్ణయించారు. తాజాగా అక్కడి పరిణామాల్ని బేరీజు వేసుకున్నాక శ్రీకాకుళం సీటు తెదేపా తీసుకుని, దానికి బదులుగా అదే జిల్లాలోని ఎచ్చెర్ల సీటు భాజపాకు ఇవ్వాలన్న నిర్ణయం జరిగింది. దానిలో భాగంగానే శ్రీకాకుళం అసెంబ్లీ స్థానానికి గొండు శంకర్ అభ్యర్థిత్వాన్ని తెదేపా ఖరారు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రధాని మోదీ ఉల్లంఘనలపై చర్యలకు ఆదేశించే డీఎన్ఏ ఈసీలో లేదు: సీతారాం ఏచూరి
ఎన్నికల ప్రవర్తన నియమావళిని ప్రధాని మోదీ పదే పదే ఉల్లంఘిస్తున్నారని, వాటిపై తాము పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఎన్నికల సంఘం (ఈసీ) చర్యలు తీసుకోవడంలేదంటూ సీపీఎం తీవ్ర స్థాయిలో ఆక్షేపించింది. -
ఇసుక అక్రమాలపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలి
ఇసుక అక్రమాలపై ఉన్నతస్థాయిలో విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండు చేశారు. రాజమహేంద్రవరంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. -
కూటమే కొడుతుంది!
రాష్ట్రంలో ఈసారి తెదేపా-జనసేన-భాజపా కూటమిదే విజయం అన్న ధీమాతో పందేలు సాగుతున్నాయి. భీమవరం, కడప, నెల్లూరులాంటి ప్రాంతాల్లో కూటమి విజయంపై, ఎన్ని సీట్లు సాధిస్తుందనే అంశంలపైనే బెట్టింగ్ రాయుళ్లు ఆసక్తి చూపుతున్నారు. -
మేం వచ్చాకే సైన్యానికి జవసత్వాలు
కుంభకోణాలకు మారుపేరు కాంగ్రెస్ అనీ, సైనికుల కనీసావసరాలను కూడా ఆ పార్టీ ఏలుబడిలో తీర్చలేకపోయారని ప్రధాని మోదీ విమర్శించారు. ఆయన శనివారం హరియాణాలో మొట్టమొదటిసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
ప్రజలను రెచ్చగొట్టడం మోదీకి అలవాటు
ఇండియా కూటమి అధికారంలోకి వస్తే బుల్డోజరు ద్వారా రామమందిరాన్ని కూల్చేస్తుందంటూ ప్రధాని మోదీ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా ఇతర విపక్ష నేతలు తీవ్రంగా మండిపడ్డారు. -
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక.. కాంగ్రెస్కు సీపీఎం మద్దతు
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు సీపీఎం ప్రకటించింది. ఈ ఎన్నికల్లో పట్టభద్రులైన ఓటర్లు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని శనివారం పిలుపునిచ్చింది. -
మహాలక్ష్మి పథకంపై మోదీ వ్యాఖ్యలు సరికాదు
మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంతో మెట్రోరైలుకు నష్టం జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించడం సరికాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. -
ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్న మోదీ
ఎన్నికల నియమావళిని గౌరవించాల్సిన ప్రధాని మోదీ.. దాన్ని ఉల్లంఘిస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ఆరోపించారు. -
అప్పుడు నాటుతుపాకులు.. ఇప్పుడు ఫిరంగి గుళ్లు
ఒకనాడు నాటుతుపాకుల తయారీ కేంద్రంగా ఉన్న ఉత్తర్ప్రదేశ్ నేడు ఫిరంగి గుళ్లు తయారుచేసేదిగా మారింది. మోదీ పాలనలో బుందేల్ఖండ్లో రక్షణరంగ పరిశ్రమల నడవా వచ్చాక ఈ మార్పును చూస్తున్నాం. -
ఒడిశా శాసనసభ ఎన్నికల మూడో దశలో 126 మంది కోటీశ్వరులు
ఒడిశా శాసనసభ ఎన్నికల్లో మూడో దశలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న అభ్యర్థుల్లో 126 మంది కోటీశ్వరులు ఉన్నారు. -
దిల్లీలో గద్దెనెక్కేది ఇండియా కూటమే: మమత
ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం ద్వారా ఇండియా కూటమి అధికారాన్ని హస్తగతం చేసుకుంటుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధ్యక్షురాలు మమతా బెనర్జీ పేర్కొన్నారు. -
దేశాభివృద్ధికి మళ్లీ మార్గం చూపాలి
దేశాభివృద్ధికి, ఉత్తర్ప్రదేశ్ ప్రగతికి మరోసారి మార్గం చూపాలంటూ రాయ్బరేలీ ప్రజలకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పిలుపునిచ్చారు. -
స్టాంపు, సంతకాల్లేని పోస్టల్ ఓట్లు చెల్లుబాటయ్యేలా చూడాలి: తెదేపా
అధికారుల తప్పిదాలతో వేసిన పోస్టల్ బ్యాలట్ ఓట్లు చెల్లేలా చూడాలని తెదేపా నేతలు అశోక్బాబు, ఏఎస్ రామకృష్ణ కోరారు. ఈ మేరకు అదనపు ఎన్నికల అధికారి కోటేశ్వరరావుకు శనివారం వినతిపత్రం ఇచ్చారు. -
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పహారా ఉండాలి
ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ల వద్ద పహారా ఉండాలని ఎన్డీయే కూటమి కార్యకర్తలకు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సూచించారు. వైకాపా శ్రేణులను ఏ దశలోనూ తేలికగా తీసుకోవద్దని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
చిల్లర కుట్రలు చేసేవారికి సుప్రీం స్టే చెంపపెట్టు
వివేకా హత్య కేసులో దుర్మార్గుల నీచబుద్ధికి దిమ్మతిరిగేలా సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల వ్యాఖ్యానించారు. భావప్రకటన స్వేచ్ఛపై రాక్షస మూక చేయబోయిన దాడిని తిప్పి కొట్టి ధర్మపోరాటంలో న్యాయమే గెలుస్తుందని శుక్రవారం సుప్రీం స్టే ద్వారా నిరూపణ అయిందని ఎక్స్ వేదికగా ఆమె పేర్కొన్నారు. -
వారిపై కుక్కల్ని వదలండి.. కొడాలి నాని అనుచరుడు
పోలింగ్ గడువు సమీపించిన సమయంలో గుడివాడ ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి కొడాలి నాని తరఫున ముఖ్య నేత రూ.కోట్ల డబ్బును అనుచరులకిచ్చి పంచాలని సూచించిన ఉదంతాలు బయటకొస్తున్నాయి. -
పిన్నెల్లి సోదరులను తప్పించిన పోలీసులపై కఠిన చర్యలు
మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి గృహనిర్బంధం నుంచి తప్పించుకున్న సంఘటనలో పోలీసుల భాగస్వామ్యం ఉన్నట్టు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని సిట్ అధిపతి వినీత్ బ్రిజ్లాల్ చెప్పినట్టు తెదేపా నేతలు తెలిపారు. -
ఇంటి నుంచి ఓటేసిన మన్మోహన్, ఆడ్వాణీ, అన్సారీ, మనోహర్ జోషీ
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ఉప ప్రధాని ఎల్కే ఆడ్వాణీ, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్ జోషీ దిల్లీలోని తమ నివాసాల నుంచే ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
ఎన్నికల తనిఖీల్లో రూ.8,889 కోట్ల సొత్తు జప్తు
సార్వత్రిక ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) మార్చి 1 నుంచి మే 18 వరకు రూ.8,889 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకొంది. -
మండపేట ఎమ్మెల్యేపై ఎట్రాసిటీ కేసు
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వపురం మండలం వల్లూరులో చోటుచేసుకున్న ఘర్షణలకు సంబంధించి మండపేట అసెంబ్లీ తెదేపా అభ్యర్థి, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, జనసేన సమన్వయకర్త వేగుళ్ల లీలాకృష్ణ, తెదేపా నాయకుడు వల్లూరి వీరబాబుపై అంగర పోలీసులు శనివారం ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు నమోదు చేశారు. -
నాతో చర్చకు మోదీ రారు: రాహుల్
ప్రధాని మోదీ తనతో బహిరంగ చర్చకు ఎన్నటికీ రారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ అన్నారు. అదానీ వంటి కొందరు పారిశ్రామికవేత్తలతో సంబంధాలు, ఎలక్టోరల్ బాండ్ల దుర్వినియోగం వంటి అంశాలపై తాను అడిగే ప్రశ్నలకు ఆయన వద్ద సమాధానాలు లేకపోవడమే అందుకు కారణమని పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐదేళ్లు.. రూపాయి విదిల్చితే ఒట్టు!
-
సైబర్ మాయగాళ్ల ఉచ్చులో విశాఖ యువత.. కాంబోడియాలో నరకయాతన
-
విరాట్ కోహ్లీ.. తొలి భారత క్రికెటర్గా ఐపీఎల్లో సరికొత్త రికార్డు
-
హెచ్చు పందేల జోరు.. రౌండ్ల వారీ మెజార్టీపైనా దృష్టి..
-
పుట్టెడు దుఃఖంలోనూ అవయవదానం!
-
ప్రధాని మోదీ ఉల్లంఘనలపై చర్యలకు ఆదేశించే డీఎన్ఏ ఈసీలో లేదు: సీతారాం ఏచూరి