ముగ్గురు కేంద్రమంత్రులకు హుళక్కి
లోక్సభ ఎన్నికల కోసం 17 రాష్ట్రాల నుంచి 111 మంది అభ్యర్థులతో భాజపా ఆదివారం అయిదో జాబితా విడుదల చేసింది.
హిమాచల్ బరిలో కంగనా రనౌత్
రాజ్యాంగం మారుస్తామన్న ఎంపీ హెగ్డేపై వేటు
పార్టీలో చేరిన గంటల్లోనే నవీన్ జిందాల్కు టికెట్
111 మందితో భాజపా అయిదో జాబితా
ఈనాడు, దిల్లీ: లోక్సభ ఎన్నికల కోసం 17 రాష్ట్రాల నుంచి 111 మంది అభ్యర్థులతో భాజపా ఆదివారం అయిదో జాబితా విడుదల చేసింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి పోటీచేసే ఆరు స్థానాలకు, తెలంగాణలో మిగిలిన రెండు స్థానాలకు అభ్యర్థులను కూడా ప్రకటించింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది. కేంద్ర మంత్రులు నిత్యానందరాయ్, గిరిరాజ్సింగ్, ఆర్కే సింగ్, ధర్మేంద్ర ప్రధాన్లకు తాజా జాబితాలో చోటు దక్కింది. సహాయ మంత్రులు అశ్వినీకుమార్ చౌబే, బిశ్వేశ్వర్ టుడూ, వి.కె.సింగ్లకు స్థానం లభించలేదు. ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ను హిమాచల్ప్రదేశ్లోని మండీ స్థానం నుంచి బరిలోకి దింపింది. పశ్చిమబెంగాల్ హైకోర్టు న్యాయమూర్తి పదవికి రాజీనామా చేసి భాజపాలో చేరిన జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ్ను ఆ రాష్ట్రంలోని తమ్లుక్ స్థానం నుంచి పోటీ చేయిస్తోంది. ఉత్తర్ప్రదేశ్లోని పీలీభీత్ స్థానం నుంచి వరుణ్గాంధీని తప్పించి జితిన్ ప్రసాదకు అవకాశం కల్పించింది. మేనకాగాంధీని సుల్తాన్పుర్ నుంచి పోటీకి నిలిపింది. తాజా జాబితాతో కలిపి మొత్తం 402 మంది అభ్యర్థులను భాజపా ప్రకటించినట్లయింది.
మేరఠ్లో అరుణ్ గోవిల్
రామాయణ్ టీవీ ధారావాహికలో రాముడి పాత్రధారి అరుణ్ గోవిల్ను ఉత్తర్ప్రదేశ్లోని మేరఠ్ స్థానం నుంచి భాజపా రంగంలోకి దింపింది. ఆదివారమే పార్టీలో చేరిన ప్రముఖ పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్ను హరియాణాలోని కురుక్షేత్ర స్థానం నుంచి పోటీకి నిలిపింది. గుజరాత్లోని సాబర్కాంఠా, వదోదర స్థానాలకు ఇదివరకు ప్రకటించిన అభ్యర్థులు వ్యక్తిగత కారణాలతో తప్పుకోవడంతో ఆ స్థానాల నుంచి కొత్తవారికి అవకాశం కల్పించింది. ఇటీవల జేఎంఎం నుంచి భాజపాలో చేరిన ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్సోరెన్ వదిన సీతా సోరెన్ను ఆ రాష్ట్రంలోని డుంకా స్థానం నుంచి రంగంలోకి దింపింది. గుజరాత్ నుంచి ప్రకటించిన 6 స్థానాల్లో ఒక్క జునాగఢ్ సిట్టింగ్ ఎంపీని మినహాయిస్తే మిగిలిన మెహ్సాణా, సురేంద్రనగర్, అమ్రేలి, సాబర్కాంఠా, వడోదర ఎంపీలను మార్చారు. హరియాణా నుంచి ప్రకటించిన నాలుగు స్థానాల్లో ముగ్గురు సిట్టింగ్ ఎంపీలను తప్పించారు.
ఆ వ్యాఖ్యలకు తగిన మూల్యం
హిమాచల్లో మండీ స్థానం నుంచి సినీనటి కంగనా రనౌత్ను పోటీకి నిలిపారు. కర్ణాటకలోని బెలగావి నుంచి దివంగత కేంద్రమంత్రి సురేష్ అంగడి కుటుంబ సభ్యులను తప్పించి ఇటీవల పార్టీలోకి తిరిగి వచ్చిన మాజీ ముఖ్యమంత్రి జగదీశ్ శెట్టర్ను నిలబెట్టారు. ఈసారి భాజపా 400కుపైగా సీట్లు సాధిస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు అనంతకుమార్ హెగ్డే మూల్యం చెల్లించుకున్నారు. ఉత్తర కన్నడ స్థానంలో ఆయన్ని తప్పించి విశ్వేశ్వర్ హెగ్డేను రంగంలోకి దింపారు. ఆ రాష్ట్రం నుంచి ప్రకటించిన 4 స్థానాల్లో మూడుచోట్ల కొత్తవారికే అవకాశమిచ్చారు.
రాహుల్పై పోటీకి సురేంద్రన్
కేరళలోని వయనాడ్లో రాహుల్గాంధీపై భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కె.సురేంద్రన్ను రంగంలోకి దింపారు. మహారాష్ట్ర నుంచి ప్రకటించిన మూడు స్థానాల్లో ఒకచోట సిట్టింగ్ను మార్చారు. ఒడిశాలో ప్రకటించిన 18 స్థానాల్లో ముగ్గురు సిట్టింగ్లను తప్పించారు. వీరిలో కేంద్ర సహాయమంత్రి బిశ్వేశ్వర్ టుడూ ఒకరు. నలుగురు సిట్టింగ్లను కొనసాగించారు. ఇందులో కేంద్ర మాజీ మంత్రి జుయల్ ఓరం ఉన్నారు. కేంద్రమంత్రి ధర్మేంద ప్రధాన్ (సంబల్పుర్), పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ పండా, అధికార ప్రతినిధి సంబిత్పాత్ర (పూరీ)లను ఈసారి లోక్సభ బరిలోకి దింపారు. రాజస్థాన్ నుంచి ఏడుగురిని ప్రకటించగా వారిలో సిట్టింగు అభ్యర్థులు ఇద్దరే. ఉత్తర్ప్రదేశ్ నుంచి ప్రకటించిన 13 స్థానాల్లో మేరఠ్, గాజియాబాద్, హాథ్రస్, బదాయూ, బరేలీ, పీలీభీత్, కాన్పుర్ తదితర చోట్ల సిట్టింగ్లను మార్చారు. పశ్చిమబెంగాల్ నుంచి ప్రకటించిన 19 స్థానాల్లో.. బర్దమాన్ దుర్గాపుర్ ఎంపీ ఎస్ఎస్ అహ్లువాలియాకు మినహాయించి మిగిలిన 17 మంది సిట్టింగ్ ఎంపీలకు స్థానం కల్పించారు.
ఏ రాష్ట్రం నుంచి ఎంతమంది?
తాజా జాబితాలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఆరుగురు, బిహార్ 17, ఒడిశా 18, ఉత్తర్ప్రదేశ్ 13, పశ్చిమబెంగాల్ నుంచి 19 మంది అభ్యర్థులు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మీ రాష్ట్రాల సంగతి చూసుకోండి’: ఆ సీఎంలకు నవీన్ పట్నాయక్ కౌంటర్
భాజపా పాలిత రాష్ట్రాల సీఎంలకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ గట్టికౌంటర్ ఇచ్చారు. -
‘50-60 ఏళ్ల క్రితం నేను ఇల్లు వదిలి వెళ్లినప్పుడు.. ఇలా అనుకోలేదు’: మోదీ కీలక వ్యాఖ్యలు
ప్రధాని నరేంద్ర మోదీ ఈశాన్య దిల్లీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
రాహుల్ వద్ద ఉన్నది చైనా రాజ్యాంగం : బిశ్వశర్మ పోస్ట్
రాహుల్ గాంధీ ర్యాలీల్లో చైనా రాజ్యాంగాన్ని ప్రదర్శిస్తున్నారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఆరోపించారు. -
మోదీ వ్యాఖ్యలపై ఈసీ చర్యలు తీసుకోవాలి: మల్లికార్జున్ ఖర్గే
ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే డిమాండ్ చేశారు. -
భారత బలగాలకు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ది: ప్రధాని మోదీ
దిల్లీ, హరియాణాల్లో చీపురు (ఆప్ ఎన్నికల గుర్తు)కు మద్దతు పలుకుతున్న కాంగ్రెస్ పార్టీ.. పంజాబ్కు వచ్చేసరికి మాత్రం మిత్రపక్షంపైనే విమర్శలు గుప్పిస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
దీదీతో పొత్తుపై హైకమాండ్ నిర్ణయం తీసుకోవాలి.. అధీర్ కాదు: ఖర్గే
మమతా బెనర్జీని ఉద్దేశించి తమ పార్టీ నేత అధీర్ రంజన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. -
ఇంటినుంచి ఓటేసిన మన్మోహన్ సింగ్, ఆడ్వాణీ
రాజకీయ కురువృద్ధులు మన్మోహన్ సింగ్, ఆడ్వాణీ ఇంటి నుంచి తమ ఓటు హక్కు (Home voting)ను వినియోగించుకున్నారు. -
హామీలను అమలు చేసే శక్తి సీఎం రేవంత్రెడ్డికి లేదు: కిషన్రెడ్డి
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసే శక్తి సీఎం రేవంత్రెడ్డికి లేదని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు. -
అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం: జీవన్రెడ్డి
ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి విమర్శించారు. హైదరాబాద్లోని గాంధీభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. -
రైతుబంధు పథకంపై కేబినెట్ సమావేశంలో చర్చించాలి: వినోద్కుమార్
ఈ కేబినెట్ సమావేశంలోనైనా మంచి నిర్ణయాలు తీసుకోవాలని భారాస నేత వినోద్కుమార్ కోరారు. -
సినిమాల కంటే ఎన్నికల ప్రచారమే చాలా కష్టం: కంగనా రనౌత్ ఆసక్తికర పోస్ట్
Kangana Ranaut: సినిమాల కంటే ఎన్నికల ప్రచారమే చాలా కష్టంతో కూడుకున్న పని అని అంటున్నారు బాలీవుడ్ ‘క్వీన్’ కంగనా రనౌత్. దీనిపై ఆమె చేసిన పోస్ట్ వైరల్గా మారింది. -
మళ్లీ గెలుస్తున్నామంటూ జగన్ ప్రగల్భాలు పలకడం విడ్డూరం
వైకాపా నేతలకు ఓటమి భయం పట్టుకుందని.. అందుకే జగన్ ఐ-ప్యాక్ కార్యాలయానికి వెళ్లి, చిన్నపాటి ఓదార్పు యాత్ర చేశారని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. -
అభ్యర్థులకు చెప్పకుండా బ్యాలట్ బాక్సుల తరలింపు!
ఓటమి భయం పట్టుకున్న వైకాపా నేతలు గెలుపు కోసం ఎన్ని అడ్డదారులు తొక్కాలో అన్నీ చేస్తున్నారని, తొత్తులుగా ఉన్న కొందరు అధికారులు వారికి సహకరిస్తున్నారని విపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. -
విదేశాలకు తరలిపోతున్నారా..?
ఓటమి భయంతో సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఇతర వైకాపా నేతలు వారి కంపెనీలతో సహా ఇతర దేశాలు, పక్క రాష్ట్రాలకు పారిపోవడానికి సిద్ధమయ్యారని తెదేపా సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. -
అరెస్టు భయంతో పిన్నెల్లి సోదరుల పరారీ?
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో దాడులు, అల్లర్లకు కారకులైన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకట్రెండు రోజుల్లో వారిద్దరినీ అరెస్టు చేస్తారనే మాట వినిపిస్తున్న తరుణంలో మాచర్ల నుంచి హైదరాబాద్కు వెళ్లినట్లు సమాచారం. -
తెదేపా కార్యకర్తలపై పోలీసుల లాఠిన్యం
పల్నాడు జిల్లా మాచవరంలో ఎంపీపీ కుమారుడిపై జరిగిన దాడి కేసులో తెదేపాకు చెందిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకొని తీవ్రంగా హింసించారు. -
ఇసుక దోపిడీలో తాడేపల్లి ప్యాలెస్కు రూ.40 వేల కోట్లు
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గనుల శాఖ డీఎంజీ వెంకటరెడ్డి కనుసన్నల్లోనే రాష్ట్రంలో పెద్దఎత్తున ఇసుక దోపిడీకి గురైందని మాజీ మంత్రి నక్కా ఆనంద్బాబు ధ్వజమెత్తారు. -
కన్హయ్య కుమార్పై దాడికి యత్నం
కాంగ్రెస్ పార్టీ నుంచి ఈశాన్య దిల్లీ లోక్సభ స్థానానికి పోటీచేస్తున్న కన్హయ్య కుమార్పై కొందరు దుండగులు సిరా చల్లి, దాడికి యత్నించారు. -
మోదీ పదే పదే మమ్మల్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు
ప్రధాని మోదీ పదే పదే తనను, ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్ను లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నారని శివసేన(యూబీటీ) అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఆరోపించారు. -
మాలీవాల్పై దాడి కేసు భాజపా కుట్రే: ఆప్
తమ పార్టీ ఎంపీ స్వాతి మాలీవాల్పై దాడి కేసు దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను ఇరికించేందుకు భాజపా పన్నిన కుట్ర అని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) శుక్రవారం ఆరోపించింది. -
రాయ్బరేలీ మీ కుటుంబ స్థానమా?
ఉత్తర్ప్రదేశ్లోని రాయ్బరేలీని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ తమ కుటుంబ నియోజకవర్గంగా చెప్పడాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్షా తప్పుబట్టారు. శుక్రవారం యూపీలోని దౌలత్పుర్లో సభలో ఆయన ప్రసంగించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
-
‘మీ రాష్ట్రాల సంగతి చూసుకోండి’: ఆ సీఎంలకు నవీన్ పట్నాయక్ కౌంటర్
-
అఫ్గాన్లో వరదల బీభత్సం.. 68 మంది మృతి..!
-
‘50-60 ఏళ్ల క్రితం నేను ఇల్లు వదిలి వెళ్లినప్పుడు.. ఇలా అనుకోలేదు’: మోదీ కీలక వ్యాఖ్యలు
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
-
పల్నాడులో హింసాత్మక ఘటనలపై భారీగా కేసులు నమోదు