Andhra News: ఎంపీ రఘురామను ఎందుకు సస్పెండ్ చేయలేదు?: కొత్తపల్లి సుబ్బారాయుడు
తాను వైకాపాను చిన్న మాట కూడా అనలేదని.. తప్పు చేయకుండా వేటు వేయడం ఎంతవరకు సమంజసమని వైకాపా నేత, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ప్రశ్నించారు.
నరసాపురం: తాను వైకాపాను చిన్న మాట కూడా అనలేదని.. తప్పు చేయకుండా వేటు వేయడం ఎంతవరకు సమంజసమని వైకాపా నేత, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ప్రశ్నించారు. సుబ్బారాయుడిపై సస్పెన్షన్ వేటు పడిన విషయం తెలిసిందే. పార్టీ క్రమశిక్షణా కమిటీ, సీఎం జగన్ ఆదేశాల మేరకు సుబ్బారాయుడును సస్పెండ్ చేసినట్టు బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. నరసాపురంలో సుబ్బారాయుడు మీడియాతో మాట్లాడుతూ.. తన సస్పెన్షన్పై స్పందించారు. తనపై వేటు వేసిన పార్టీ.. ఎంపీ రఘురామను పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇలా సస్పెండ్ చేయడం దారుణమన్నారు. సస్పెన్షన్ కారణాలను సాయంత్రంలోగా చెప్పాలని డిమాండ్ చేశారు. సరైన కారణం లేకుండా సస్పెండ్ చేస్తే చట్టపరంగా పోరాడతానని సుబ్బారాయుడు స్పష్టం చేశారు.
స్థానిక ఎమ్మెల్యేతో విభేదాలే కారణమా?
2024 అసెంబ్లీ ఎన్నికల్లో తాను నరసాపురం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తానని కొత్తపల్లి సుబ్బారాయుడు ప్రకటించారు. నరసాపురంలోని తన నివాసంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ... పార్టీ గుర్తు ఉన్నా, లేకపోయినా విజయం సాధిస్తానన్నారు. రాజకీయ ప్రస్థానం ప్రారంభం నుంచి 2019లో తప్ప.. అన్ని సార్లు పోటీలో ఉన్నట్లు చెప్పారు. నియోజకవర్గంలోని అన్ని వర్గాలు, పార్టీల్లో తనకంటూ ప్రత్యేక ఓటు బ్యాంకు ఉందన్నారు. కాంగ్రెస్ తరఫున పోటీ చేసినప్పుడు కూడా సొంత బలం ఆధారంగానే గెలిచానన్నారు. సుదీర్ఘకాలం ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రిగా పనిచేసిన అనుభవం ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా, ఇతర పార్టీలకు మద్దతుగా ఉంటారనే సందేహం ప్రజల్లో నెలకొందని, దీనిపై స్పష్టత ఇచ్చేందుకు సమావేశం ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. నరసాపురాన్ని జిల్లా కేంద్రం చేయాలని శాంతియుతంగా ఉద్యమం చేసిన తనపై ఏ1గా కేసు పెట్టడం దురదృష్టకరమన్నారు. కేసులు గురించి పట్టించుకోనని, ప్రజల మధ్య ఉంటూ వారి సమస్యలపై పోరాడతానని వెల్లడించారు.
నరసాపురం జిల్లా కేంద్రం సాధనలో వైకాపా ఎమ్మెల్యే ప్రసాదరాజు విఫలమయ్యారని మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. ప్రసాదరాజును ఎమ్మెల్యేగా గెలిపించేందుకు ముఖ్యభూమిక పోషించి ఇప్పుడు బాధపడుతున్నానంటూ జిల్లా సాధనకోసం ఇటీవల జరిగిన ఉద్యమంలో తనను తాను చెప్పుతో కొట్టుకుని వినూత్నంగా నిరసన తెలిపారు. సుబ్బారాయుడు తీరుపై అప్పటి నుంచి వైకాపా అగ్రనాయకత్వం గుర్రుగా ఉంది. ఈ ఘటనపై వైకాపా సీనియర్ నేత పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలు మారినప్పుడల్లా సుబ్బారాయుడు చెప్పులతో కొట్టుకుంటున్నారని విమర్శించారు. పార్టీలో క్రమశిక్షణారాహిత్యాన్ని ఉపేక్షించబోమని హెచ్చరించారు. ప్రసాదరాజును రాజకీయంగా పతనం చేసేందుకే కొత్తపల్లి సుబ్బారాయుడు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. మీడియా సమావేశంలో సబ్బారాయుడు చేసిన ప్రకటనతో వైకాపా అధిష్ఠానం సస్పెండ్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మల్లారెడ్డి ఆస్తులపై విచారణ కోరతాం: ప్రభుత్వ విప్ లక్ష్మణ్కుమార్
మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డికి సంబంధించి మేడ్చల్ పరిసరాలలోని ఆస్తులపై విశ్రాంత న్యాయమూర్తితో విచారణ చేయించాలని ప్రభుత్వాన్ని కోరతామని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ అన్నారు. -
సార్వత్రిక సమరం.. ఐదో విడత పోలింగ్ ప్రారంభం.. ఆ 2 స్థానాలపై అందరి దృష్టి
Lok Sabha Elections: ఐదో విడతలో మొత్తం 695 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో రాజ్నాథ్ సింగ్, పీయూష్ గోయల్, స్మృతి ఇరానీ, రాహుల్గాంధీ వంటి ప్రముఖులు ఉన్నారు. -
ఏపీలో చంద్రబాబు అధికారం చేపట్టబోతున్నారు
ఎన్నికల ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలుపొందుతుందని.. చంద్రబాబు అధికారం చేపట్టబోతున్నారని తిరుపతి మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చింతా మోహన్ పేర్కొన్నారు. -
వైకాపాకు ఘోర పరాజయం.. మరోసారి స్పష్టం చేసిన పీకే
ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో వైకాపాకు ఘోర పరాజయం ఎదురు కాబోతోందని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మరోసారి స్పష్టం చేశారు. -
గెలిస్తే బాలీవుడ్కు వీడ్కోలు!.. మండీ భాజపా అభ్యర్థి కంగనా రనౌత్
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధిస్తే బాలీవుడ్కు వీడ్కోలు పలుకుతానని హిమాచల్ప్రదేశ్లోని మండీ భాజపా అభ్యర్థి, సినీనటి కంగనా రనౌత్ పేర్కొన్నారు. -
బెంగాల్లో కాంగ్రెస్ కార్యాలయం ఎదుట పార్టీ అధ్యక్షుడు ఖర్గే పోస్టర్ల చెరిపివేత
పశ్చిమ బెంగాల్ రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఎదుట ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పోస్టర్లను, హోర్డింగ్లను దుండగులు చెరిపి వేశారు. -
రుణమాఫీ అమలుకు అడ్డుపడుతున్న భాజపా, భారాస
రైతులకు వెంటనే రుణమాఫీ అమలు కాకుండా భాజపా, భారాస నేతలే అడ్డుపడుతున్నారని కాంగ్రెస్ రాష్ట్ర మీడియా కమిటీ ఛైర్మన్ సామ రామ్మోహన్రెడ్డి ఆరోపించారు. -
విపక్ష నేతలంతా రావణుడి అనుచరులే..
విపక్ష ‘ఇండియా’ కూటమి నేతలంతా రావణుడి అనుచరులని.. సనాతన ధర్మాన్ని, ప్రధాని మోదీని, భాజపాను, ప్రజాస్వామ్యాన్ని తక్కువ చేసి మాట్లాడటమే వారి పని అని మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మండిపడ్డారు. -
ఆమ్ఆద్మీ పార్టీ అంతానికి ‘ఆపరేషన్ ఝాడూ’
ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని ముప్పుగా భావిస్తున్న భాజపా తమ పార్టీని అణచేసేందుకు ‘ఆపరేషన్ ఝాడూ’ పేరిట కార్యక్రమాన్ని ప్రారంభించిందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం ఆరోపించారు. -
వైకాపా సోషల్మీడియా విభాగంపై కేసు
వైకాపా సోషల్ మీడియా విభాగంపై కేసు నమోదైంది. పోలింగ్కు 48 గంటల ముందు ప్రచారాలు నిషిద్ధమైనా.. వైకాపా సోషల్ మీడియా విభాగం నిబంధనలు ఉల్లంఘించి ప్రచారం కొనసాగించిందని విశాఖపట్నానికి చెందిన న్యాయ విద్యార్థి కొండేటి సోమశేఖర్ తగిన ఆధారాలతో ఈ నెల 12న కేంద్ర ఎన్నికల సంఘాని(ఈసీ)కి ఫిర్యాదు చేశారు. -
పోలీసులే.. నేరస్థులు: అంబటి రాంబాబు
ఎన్నికల సందర్భంగా పల్నాడు జిల్లాలో తలలు పగులుతుంటే పోలీసులు స్పందించకుండా అలసత్వం వహించారని, అసలు నేరస్థులు పోలీసులేనని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. -
సూత్రధారులపై చర్యలు తీసుకోండి
తనపై జరిగిన హత్యాయత్నం ఘటనలో సూత్రధారులను గుర్తించి అరెస్టు చేయాలని చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి పులివర్తి నాని సిట్ అధికారులను కోరారు. -
అప్పుడు లేని లేఖ.. ఇప్పుడెలా వచ్చింది?: తెదేపా
విజయనగరం తహసీల్దారు కార్యాలయం నుంచి పోస్టల్ బ్యాలట్ తరలింపుపై ఇంకా ఆందోళన సాగుతోంది. తాజాగా ఏఆర్వో, తహసీల్దారు రత్నం విడుదల చేసిన లేఖ చర్చనీయాంశంగా మారింది. -
పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారు
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లె, కూచివారిపల్లెల్లో పోలింగ్ ముగిసిన తర్వాత జరిగిన ఘర్షణలో.. అక్కడ లేనివారిపై పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని బాధితుడు మురళీధర్ వాపోయారు. -
ప్రొద్దుటూరు వైకాపా ఎమ్మెల్యే రాచమల్లుపై కేసు నమోదు
సీఐని బెదిరించి, ఆయన విధులకు ఆటంకం కలిగించినందుకు వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి, ఆయన బావమరిది పురపాలిక వైస్ఛైర్మన్ బంగారు మునిరెడ్డి, తెదేపా నేత నందం సుబ్బయ్య హత్యకేసు నిందితుడు కుండా రవితో పాటు మరొకరిపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. -
మమత గురించి ఖర్గే చెప్పినా వినను: అధీర్
మమతా బెనర్జీ విషయంలో సంయమనం పాటించాలని కాంగ్రెస్ అగ్ర నాయకత్వం చెబుతున్నా అంగీకరించేది లేదని బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌధరి తేల్చిచెప్పారు. -
పెద్దలను మోదీ అలా అనొచ్చా!
లోక్సభ ఎన్నికల తరవాత విపక్ష ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తుందని, అందులోని మిత్రపక్షమైన ఆప్ దిల్లీకి పూర్తిస్థాయి రాష్ట్ర హోదాకు యత్నిస్తుందని భాజపా ఆందోళనలో ఉందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
సుస్థిర విధానాలతో సుసంపన్న భారత్
ఇండియా కూటమి ప్రభుత్వం వస్తే దేశ ఆర్థిక రంగం ఒడుదొడుకులకు గురవుతుందని, స్టాక్ మార్కెట్లు పతనమవుతాయంటూ భాజపా నేతలు మదుపరుల్లో భయాందోళనలు రేకెత్తించడానికి ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ ధ్వజమెత్తారు. -
రాహుల్, అఖిలేశ్ సభలో తొక్కిసలాట
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ పాల్గొన్న సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. -
రాహుల్ నోట మావోయిస్టుల భాష.. వాళ్లొస్తే పెట్టుబడులు రావు
బలవంతపు ధన సమీకరణ వంటి కొత్త పద్ధతుల గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ యువరాజు (రాహుల్గాంధీని ఉద్దేశించి) మావోయిస్టుల భాష వింటే ఆ పార్టీ పాలిస్తున్న రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ఒకటికి యాభైసార్లు ఆలోచిస్తారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విరుచుకుపడ్డారు. -
‘కళింగ’ కదన కుతూహలం!
నువ్వా నేనా అన్నట్లు సాగుతున్న కళింగ గడ్డ ఒడిశాలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల పోరు కీలక దశకు చేరుకుంది. నేడు 5 లోక్సభ సీట్లు, 35 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ జరగనుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించే చిత్రాలివే!
-
రసకందాయంలో పీర్జాదిగూడ రాజకీయం
-
ప్రారంభమైన ‘టెట్’ ఎగ్జామ్.. పరీక్షా కేంద్రాల వద్ద రద్దీ
-
ఇదీ స్ట్రాంగ్రూమే.. టార్పాలిన్ కప్పి ఉంచిన గదిలో పోస్టల్ బ్యాలట్ పెట్టెలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
అందనంత దూరంలో కోడి ధర.. రూ. 300లకు చేరువలో స్కిన్ లెస్