Kuppam: వైకాపాలో వర్గవిభేదాలు.. మంత్రి పెద్దిరెడ్డి కాన్వాయ్ను అడ్డుకున్న కార్యకర్తలు
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలో వైకాపా వర్గవిభేదాలు బయటపడ్డాయి. మండలానికి చెందిన ముఖ్యనేత దండపాణికి వ్యతిరేకంగా మరో వర్గం ఆందోళనకు దిగింది.
శాంతిపురం: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలో వైకాపా వర్గవిభేదాలు బయటపడ్డాయి. మండలానికి చెందిన ముఖ్యనేత దండపాణికి వ్యతిరేకంగా మరో వర్గం ఆందోళనకు దిగింది. మోరసనపల్లిలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటన నేపథ్యంలో ఐదు గ్రామాలకు చెందిన వైకాపా కార్యకర్తలు అక్కడికి చేరుకుని మంత్రి కాన్వాయ్ను అడ్డుకున్నారు. దండపాణికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ప్రభుత్వ స్థలంలో అధికార పార్టీ నేత ఆక్రమణలను అరికట్టాలంటూ ఆయా గ్రామాలకు చెందిన ప్రజలు, వైకాపా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో కుప్పం- పలమనేరు జాతీయ రహదారిపై అసమ్మతి నేతలు బైఠాయించారు. వైకాపా నేతలకు మంత్రి పెద్దిరెడ్డి సర్దిచెప్పి గుడుపల్లి వెళ్లారు. ఇంతకుముందే తమ సమస్యను నియోజకవర్గ నాయకుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో పెద్దిరెడ్డి ఎదుట ఆయా గ్రామాల వైకాపా కార్యకర్తలు నిరసనకు దిగారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్టాంపు, సంతకాల్లేని పోస్టల్ ఓట్లు చెల్లుబాటయ్యేలా చూడాలి: తెదేపా
అధికారుల తప్పిదాలతో వేసిన పోస్టల్ బ్యాలట్ ఓట్లు చెల్లేలా చూడాలని తెదేపా నేతలు అశోక్బాబు, ఏఎస్ రామకృష్ణ కోరారు. ఈ మేరకు అదనపు ఎన్నికల అధికారి కోటేశ్వరరావుకు శనివారం వినతిపత్రం ఇచ్చారు. -
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పహారా ఉండాలి
ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు ఈవీఎంలు భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ల వద్ద పహారా ఉండాలని ఎన్డీయే కూటమి కార్యకర్తలకు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సూచించారు. వైకాపా శ్రేణులను ఏ దశలోనూ తేలికగా తీసుకోవద్దని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. -
చిల్లర కుట్రలు చేసేవారికి సుప్రీం స్టే చెంపపెట్టు
వివేకా హత్య కేసులో దుర్మార్గుల నీచబుద్ధికి దిమ్మతిరిగేలా సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల వ్యాఖ్యానించారు. భావప్రకటన స్వేచ్ఛపై రాక్షస మూక చేయబోయిన దాడిని తిప్పి కొట్టి ధర్మపోరాటంలో న్యాయమే గెలుస్తుందని శుక్రవారం సుప్రీం స్టే ద్వారా నిరూపణ అయిందని ఎక్స్ వేదికగా ఆమె పేర్కొన్నారు. -
‘డబ్బు తిన్న వారిపై కుక్కల్ని వదలండి’.. కొడాలి నాని అనుచరుడి వీడియో వైరల్
పోలింగ్ గడువు సమీపించిన సమయంలో గుడివాడ ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి కొడాలి నాని తరఫున ముఖ్య నేత రూ.కోట్ల డబ్బును అనుచరులకిచ్చి పంచాలని సూచించిన ఉదంతాలు బయటకొస్తున్నాయి. -
ఇసుక అక్రమాలపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలి
ఇసుక అక్రమాలపై ఉన్నతస్థాయిలో విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండు చేశారు. రాజమహేంద్రవరంలోని పార్టీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. -
కూటమే కొడుతుంది!
రాష్ట్రంలో ఈసారి తెదేపా-జనసేన-భాజపా కూటమిదే విజయం అన్న ధీమాతో పందేలు సాగుతున్నాయి. భీమవరం, కడప, నెల్లూరులాంటి ప్రాంతాల్లో కూటమి విజయంపై, ఎన్ని సీట్లు సాధిస్తుందనే అంశంలపైనే బెట్టింగ్ రాయుళ్లు ఆసక్తి చూపుతున్నారు. -
పిన్నెల్లి సోదరులను తప్పించిన పోలీసులపై కఠిన చర్యలు
మాచర్ల వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి గృహనిర్బంధం నుంచి తప్పించుకున్న సంఘటనలో పోలీసుల భాగస్వామ్యం ఉన్నట్టు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని సిట్ అధిపతి వినీత్ బ్రిజ్లాల్ చెప్పినట్టు తెదేపా నేతలు తెలిపారు. -
ఇంటి నుంచి ఓటేసిన మన్మోహన్, ఆడ్వాణీ, అన్సారీ, మనోహర్ జోషీ
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ఉప ప్రధాని ఎల్కే ఆడ్వాణీ, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, కేంద్ర మాజీ మంత్రి మురళీ మనోహర్ జోషీ దిల్లీలోని తమ నివాసాల నుంచే ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
ఎన్నికల తనిఖీల్లో రూ.8,889 కోట్ల సొత్తు జప్తు
సార్వత్రిక ఎన్నికల సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) మార్చి 1 నుంచి మే 18 వరకు రూ.8,889 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకొంది. -
మండపేట ఎమ్మెల్యేపై ఎట్రాసిటీ కేసు
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వపురం మండలం వల్లూరులో చోటుచేసుకున్న ఘర్షణలకు సంబంధించి మండపేట అసెంబ్లీ తెదేపా అభ్యర్థి, ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, జనసేన సమన్వయకర్త వేగుళ్ల లీలాకృష్ణ, తెదేపా నాయకుడు వల్లూరి వీరబాబుపై అంగర పోలీసులు శనివారం ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కేసు నమోదు చేశారు. -
నాతో చర్చకు మోదీ రారు: రాహుల్
ప్రధాని మోదీ తనతో బహిరంగ చర్చకు ఎన్నటికీ రారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ అన్నారు. అదానీ వంటి కొందరు పారిశ్రామికవేత్తలతో సంబంధాలు, ఎలక్టోరల్ బాండ్ల దుర్వినియోగం వంటి అంశాలపై తాను అడిగే ప్రశ్నలకు ఆయన వద్ద సమాధానాలు లేకపోవడమే అందుకు కారణమని పేర్కొన్నారు. -
రేపే ఐదో విడత.. 49 లోక్సభ స్థానాలకు పోలింగ్
సార్వత్రిక సమరంలో మరో కీలక దశకు రంగం సిద్ధమైంది. ఐదో విడతలో భాగంగా ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 49 లోక్సభ సీట్లకు సోమవారం పోలింగ్ జరగనుంది. -
ప్రజలను రెచ్చగొట్టడం మోదీకి అలవాటు
ఇండియా కూటమి అధికారంలోకి వస్తే బుల్డోజరు ద్వారా రామమందిరాన్ని కూల్చేస్తుందంటూ ప్రధాని మోదీ చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా ఇతర విపక్ష నేతలు తీవ్రంగా మండిపడ్డారు. -
మీ పార్టీ కార్యాలయానికి వస్తా
భాజపా ప్రధాన కార్యాలయానికి ఆదివారం తాను తమ పార్టీ నేతలతో కలిసి వెళ్తానని దిల్లీ సీఎం కేజ్రీవాల్ శనివారం ప్రకటించారు. ఆ సందర్భంగా ఎవరిని కోరుకుంటే వారిని ప్రధానమంత్రి జైలుకు పంపించుకోవచ్చని పేర్కొన్నారు. -
మేం వచ్చాకే సైన్యానికి జవసత్వాలు
కుంభకోణాలకు మారుపేరు కాంగ్రెస్ అనీ, సైనికుల కనీసావసరాలను కూడా ఆ పార్టీ ఏలుబడిలో తీర్చలేకపోయారని ప్రధాని మోదీ విమర్శించారు. ఆయన శనివారం హరియాణాలో మొట్టమొదటిసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
మహా యుద్ధం
మహారాష్ట్రలోని కీలకమైన ముంబయితోపాటు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లోని 13 నియోజకవర్గాల్లో ఈ నెల 20వ తేదీన పోలింగ్ జరగనుంది. -
ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి
రాష్ట్రంలో వడ్ల కొనుగోళ్లను వేగవంతం చేయాలని, తడిసిన ధాన్యంతో పాటు ప్రతి గింజను ప్రభుత్వం కొనాలని, హామీ మేరకు వరి క్వింటాలుకు రూ.500 బోనస్ ఇవ్వాలని రాష్ట్ర భాజపా నేతలు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కోరారు. -
లద్దాఖ్లో హోరాహోరీ
కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్లో సార్వత్రిక సమరం రసవత్తరంగా సాగుతోంది. ఇక్కడ భాజపా, కాంగ్రెస్ మధ్యే ముఖాముఖి పోటీ ఉంటుందని తొలుత భావించగా.. స్థానికంగా గట్టి పట్టున్న ఓ గ్రూపు స్వతంత్ర అభ్యర్థిని బరిలో దించడంతో పోరు త్రిముఖంగా మారింది. -
అవినీతి కేసు బూచితో మాలీవాల్ను కుట్రలో భాగం చేశారు
తమ పార్టీ ఎంపీ స్వాతి మాలీవాల్పై ఉన్న అక్రమ నియామకాల కేసును బూచిగా చూపి, బెదిరించి సీఎం కేజ్రీవాల్కు వ్యతిరేకంగా పన్నిన కుట్రలో భాజపా ఆమెను పావుగా మార్చిందని ఆప్ ఆరోపించింది. -
జూన్ తొలివారంలోనే ‘రైతు భరోసా’ ఇవ్వాలి
జూన్ తొలి వారంలోనే ‘రైతు భరోసా’ డబ్బులివ్వాలని... పంటసాగు కోసం రైతులు వడ్డీ వ్యాపారుల దగ్గరకు వెళ్లకుండా చూడాలని భారాస మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ డిమాండ్ చేశారు. -
రేవంత్రెడ్డికి గ్యారంటీలు అమలు చేసే శక్తి లేదు
‘ఆరు గ్యారంటీలను అమలు చేసే శక్తి సీఎం రేవంత్రెడ్డికి లేదు. కేసీఆర్ గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకునే పరిస్థితిలో లేరు.