హమ్మయ్య! కోహ్లీసేనకు తప్పిన క్లీన్స్వీప్
కోహ్లీసేన పరువు నిలుపుకుంది. ఆసీస్తో ఆఖరి వన్డేలో 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. సిరీస్ను 1-2 తేడాతో ముగించి క్లీన్స్వీప్ తప్పించుకుంది...
ఆఖరి వన్డేలో 13 పరుగుల తేడాతో విజయం
సమష్టిగా రాణించిన బౌలర్లు
కాన్బెర్రా: హమ్మయ్య..! ఎట్టకేలకు టీమ్ఇండియాకు ఊరట లభించింది. ఆస్ట్రేలియాపై మూడో వన్డేలో విజయం లభించింది. క్లీన్స్వీప్ అవ్వకుండా పరువు నిలుపుకుంది. కంగారూల ఆధిక్యాన్ని 1-2కు తగ్గించింది. ఆఖరి పోరులోనూ కోహ్లీసేన బ్యాటింగ్, బౌలింగ్లో తడబడ్డా వెంటనే తేరుకొని గెలుపుబాట పట్టడం గమనార్హం. నిజానికి 303 పరుగుల లక్ష్య ఛేదనలో ఆరోన్ ఫించ్ (75; 82 బంతుల్లో 7×4, 3×6), గ్లెన్ మాక్స్వెల్ (59; 38 బంతుల్లో 3×4, 4×6) భారత్ను భయపెట్టారు. అంతకుముందు టీమ్ఇండియాలో హార్దిక్ పాండ్య (92*; 76 బంతుల్లో 7×4, 1×6), రవీంద్ర జడేజా (66; 50 బంతుల్లో 5×4, 3×6), విరాట్ కోహ్లీ (63; 78 బంతుల్లో 5×4) మెరుపులు మెరిపించారు.
మాక్సీ భయపెట్టినా..
తొలి రెండు వన్డేల్లో 370+ స్కోరు చేసిన జోరుమీదున్న ఆసీస్కు 303 లక్ష్యఛేదన పెద్ద కష్టమేమీ కాదనిపించింది. అయితే జస్ప్రీత్ బుమ్రా (2/43)కు తోడుగా యువపేసర్లు శార్దూల్ ఠాకూర్ (3/51), నటరాజన్ (2/70) సమయోచితంగా వికెట్లు తీసి విజయం అందించారు. జట్టు స్కోరు 25 వద్దే లబుషేన్ (7)ను నట్టూ క్లీన్బౌల్డ్ చేశాడు. వరుస శతకాలతో బెంబేలెత్తించిన స్టీవ్ స్మిత్ (7)ను శార్దూల్ మరికాసేపటికే ఔట్ చేశాడు. అప్పుడు స్కోరు 56. ఈ క్రమంలో మోజెస్ హెన్రిక్స్ (22)తో కలిసి మూడో వికెట్కు ఆరోన్ ఫించ్ 61 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశాడు. ప్రమాదకరంగా మారిన ఈ జోడీని హెన్రిక్స్ను
ఔట్చేయడం ద్వారా శార్దూల్ విడదీశాడు. అర్ధశతకం చేసి గేరుమార్చిన ఫించ్ను జట్టు స్కోరు 123 వద్ద జడ్డూ బోల్తా కొట్టించాడు. కామెరాన్ గ్రీన్ (21) ఫర్వాలేదనిపించాడు. కానీ మాక్స్వెల్ క్రీజులో కదురుకున్నాక టీమ్ఇండియాను భారీ సిక్సర్లతో భయపెట్టాడు. అర్ధశతకం అందుకున్నాడు. ఏస్టన్ ఆగర్ (28)తో కలిసి 44 ఓవర్లకు ఆసీస్ను 264/6తో నిలిపి సమీకరణం మార్చేశాడు. కానీ ఆ తర్వాతి ఓవర్లోనే మాక్సీని బుమ్రా క్లీన్బౌల్డ్ చేశాడు. 278 వద్ద ఆగర్ను నట్టూ, అబాట్ (4)ను శార్దూల్ పెవిలియన్ పంపించడంతో భారత్కు విజయం లభించింది. నటరాజన్కు కాస్త ఎక్కువ పరుగులే ఇచ్చినా బాగానే బౌలింగ్ చేశాడు.
పాండ్య+జడ్డూ లేకుంటే..
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన టీమ్ఇండియాకు శుభారంభం దక్కలేదు. నాలుగో ఓవర్లో లైఫ్ లభించినా ధావన్ (16; 27 బంతుల్లో, 2×4) అవకాశాన్ని ఉపయోగించుకోలేదు. అబాట్ బౌలింగ్లో పేలవ షాట్తో పెవిలియన్కు చేరాడు. ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన కోహ్లీ.. శుభ్మన్ గిల్ (33; 39 బంతుల్లో, 3×4, 1×6) తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. అయితే గిల్ను ఆగర్ వికెట్ల ముందు దొరకబుచ్చుకుని స్కోరు బోర్డుకు బ్రేక్లు వేశాడు. శ్రేయస్ అయ్యర్ (19), కేఎల్ రాహుల్ (5) త్వరగానే పెవిలియన్ చేరారు. ఆ వెంటనే 64 బంతుల్లో అర్ధశతకం సాధించిన కోహ్లీని హేజిల్వుడ్ మరోసారి బోల్తా కొట్టించడంతో 152/5తో భారత్ కష్టాల్లో పడింది. ఈ దశలో హార్దిక్ పాండ్య, జడేజా జట్టును ఆదుకున్నారు. మరోవికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ ఆఖర్లో బౌండరీలతో హోరెత్తించారు. ఆసీస్ బౌలర్లకు అవకాశమివ్వకుండా ఆకాశమే హద్దుగా చెలరేగారు. ఆరో వికెట్కు రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు. ఆసీస్పై ఆరో వికెట్కు హార్దిక్-జడేజా (150 పరుగులు) భాగస్వామ్యమే అత్యధికం. ఆస్ట్రేలియా బౌలర్లలో ఆగర్ రెండు, జంపా, అబాట్, హేజిల్వుడ్ తలో వికెట్ తీశారు.
ఇవీ చదవండి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్
తన జట్టు వరుసగా విజయాలు సాధిస్తున్నా.. బౌలింగ్లో నాణ్యమైన ప్రదర్శన చేయడంలో మాత్రం రవిచంద్రన్ అశ్విన్ విఫలం కావడం అభిమానులను కలవరానికి గురి చేస్తోంది. -
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
హైదరాబాద్లో తొమ్మిది మ్యాచుల్లో ఐదు విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ప్రత్యర్థులు 200+ స్కోరు లక్ష్యాన్ని నిర్దేశిస్తే మాత్రం తేలిపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. -
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
ప్రపంచ కప్ కోసం టీమ్లను ప్రకటించాల్సిన గడువు సమీపిస్తోంది. తాజాగా న్యూజిలాండ్ తమ స్క్వాడ్ను వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. -
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
తాను సెంచరీ చేజార్చుకున్నప్పటికీ.. జట్టు విజయం సాధించడం ఆనందంగా ఉందని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వ్యాఖ్యానించాడు. -
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
ఐపీఎల్ (IPL) వస్తోంది అంటే టన్నులకు టన్నులు మజా వస్తుంది అని క్రికెట్ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. కానీ ఈసారి అలా లేదు. సమస్య ఏంటా? అని చూస్తే కొన్ని పాయింట్లు కనిపిస్తున్నాయి. -
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
భారీగా పరుగులు చేస్తున్నా.. నిదానంగా ఆడుతున్నాడనే అపవాదు మోస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అలాంటి కామెంట్లకు సరైన కౌంటర్ ఇచ్చాడు. -
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్