Ravi Shastri: భారత్, ఇంగ్లాండ్ జట్లకు మధ్య ఉన్న తేడా అదే..! రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు
ప్రపంచకప్లో ఘోర ప్రదర్శన చేస్తున్న ఇంగ్లాండ్ జట్టుపై భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి (Ravi Shastri) కీలక వ్యాఖ్యలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఈ వన్డే ప్రపంచకప్లో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన ఇంగ్లాండ్ (England).. అంచనాలను తలకిందులు చేస్తూ ఘోర ప్రదర్శన కనబరుస్తోంది. ఇప్పటివరకు ఆరు మ్యాచ్లు ఆడి ఒకే మ్యాచ్లో అదీనూ బంగ్లాదేశ్పై గెలిచింది. ప్రస్తుతం ఆ జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ జట్టుపై భారత మాజీ క్రికెటర్ రవిశాస్త్రి (Ravi Shastri) కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లాండ్ టీమ్ ప్రదర్శన ప్రేక్షకులు, అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసిందన్నాడు. భారత్, ఇంగ్లాండ్ జట్లకు మధ్య ఉన్న తేడాను వివరించాడు.
‘‘ప్రేక్షకులు, అభిమానులను ఇంగ్లాండ్ జట్టు తీవ్రంగా నిరాశపరిచింది. ఎందుకంటే వారు న్యూజిలాండ్తో జరిగిన మొదటి మ్యాచ్లో 17 ఓవర్లు మిగిలుండగానే ఓడిపోయారు. దక్షిణాఫ్రికాపై వారు కనీసం పోరాడకుండా 22 ఓవర్లకే ఆలౌటయ్యారు. అనంతరం శ్రీలంకపై 33 ఓవర్లకు చేతులెత్తేశారు. ఇంగ్లాండ్ నిర్దేశించిన లక్ష్యాన్ని శ్రీలంక 25 ఓవర్లలో ఛేదించింది. తాజాగా భారత్పై 32 ఓవర్లలోపే ఎనిమిది వికెట్లు కోల్పోయారు. మీరా ప్రపంచ ఛాంపియన్స్.. ఈ ప్రదర్శనను చూసి వాళ్లే బాధపడకపోతే మరెవరు బాధపడతారు?’’ అని రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు.
భారత్, ఇంగ్లాండ్ జట్లకు మధ్య ఉన్న తేడా ఏంటని అడిగితే.. నేను ఎనిమిది జట్లు అని చెబుతాను అని పాయింట్ల పట్టికలో రెండు జట్ల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తు చేశాడు. 2025లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఆతిథ్య పాక్తోపాటు ప్రపంచకప్లో టాప్-7లో నిలిచిన జట్లు ఈ టోర్నీకి నేరుగా అర్హత సాధిస్తాయి.
‘‘ఇక నుంచి ఇంగ్లాండ్ పరువు కాపాడుకునేందుకు ఆడాలి. ఎందుకంటే ఆ జట్టు పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉంది. 2025లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి ప్రపంచకప్లో టాప్-8 జట్లు అర్హత సాధిస్తాయి.ఒకవేళ ఇంగ్లాండ్ ఇలాగే కింది రెండు స్థానాల్లో ఉంటే.. అలాంటి టీమ్ లేకుండా ఛాంపియన్స్ ట్రోఫీ ఎలా ఉంటుందో ఊహించుకోండి. ఇది వారికి పెద్ద దెబ్బే అవుతుంది’’ అని రవిశాస్త్రి వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
మైదానంలో సునీల్ నరైన్ చాలా కామ్గా సీరియస్గా ఉండటాన్ని ఫ్యాన్స్ గమనించే ఉంటారు. వికెట్లు తీసినా పెద్దగా ఆవేశపడకుండా.. ప్రశాంతంగా కనిపిస్తాడు. దీనిపై అతడి సహచరులు చెప్పిన ఆసక్తికర విషయాలు.. -
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
టీ20 వరల్డ్కప్నకు సంబంధించి టీమిండియా జెర్సీని అడిడాస్ ఆవిష్కరించింది. మే 7 నుంచి స్టోర్లలో లభిస్తాయని వెల్లడించింది. -
‘నో డౌట్.. ఈ సీజన్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అతడే: గ్రేమ్ స్మిత్
దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్స్మిత్.. కోల్కతా ఆటగాడు సునీల్ నరైన్ (Sunil Narine)పై ప్రశంసల వర్షం కురిపించాడు. అతడు క్రీజులో కుదురుకుంటే ప్రమాదకరంగా మారతాడని పేర్కొన్నాడు. -
Mumbai Vs Hyderabad: ‘‘పొలార్డ్.. నువ్వేం మారలేదు.. నీ ఫీల్డింగ్ ఇప్పటికీ సూపర్’’
ఐపీఎల్ 17 సీజన్లో భాగంగా మే 6న ముంబయి, హైదరాబాద్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్లో విజయం కోసం ఇరు జట్లు వ్యూహాలు రచిస్తున్నాయి. ముంబయి బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్ మంచి ఫీల్డర్ అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆరెంజ్ ఆర్మీతో మ్యాచ్ సందర్భంగా తమ జట్టు ఆటగాళ్లకు పొలార్డ్ బౌండరీ లైన్ వద్ద క్యాచ్లు ఎలా అందుకోవాలో శిక్షణ ఇచ్చాడు.
-
Mumbai Vs Hyderabad: ముంబయి, హైదరాబాద్ మ్యాచ్.. ఆటగాళ్ల సరదా సంభాషణ
ఐపీఎల్ 17 సీజన్లో భాగంగా మే 6న వాంఖడే స్టేడియం వేదికగా ముంబయి, హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. మైదానంలో ప్రాక్టీస్ సెషన్లో ఇరుజట్ల ఆటగాళ్లు సరదాగా ముచ్చటించుకున్నారు.
-
హైదరాబాద్ ‘ప్లేఆఫ్స్’ ఛాన్స్కు ముంబయి ఎసరు పెడుతుందా ?
ఐపీఎల్లో వాంఖడే వేదికగా మరో మ్యాచ్ జరగనుంది. హైదరాబాద్తో ముంబయి తలపడేందుకు సిద్ధమవుతోంది. -
Lucknow vs Kolkata: కృష్ణప్ప గౌతమ్ సూపర్ రన్నింగ్ క్యాచ్.. ఫీల్డింగ్ కోచ్ రియాక్షన్ చూశారా?
ఐపీఎల్ 17 సీజన్లో భాగంగా ఆదివారం కోల్కతాతో జరిగిన మ్యాచ్లో లఖ్నవూ 98 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. కానీ, ఈ మ్యాచ్లో లఖ్నవూ ఫీల్డర్ కృష్ణప్ప గౌతమ్ ఓ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు.
-
టీ20 ప్రపంచకప్నకు ఉగ్ర ముప్పు..! స్పందించిన ట్రినిడాడ్ పీఎం, ఐసీసీ
ఐపీఎల్ ముగిసిన వారం రోజులకే మరో క్రికెట్ సంగ్రామం ప్రారంభం కానుంది. కానీ, దానిపై ఉగ్రమూకలు కన్నేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలపై ఐసీసీ స్పందించింది. -
కుర్రాళ్లు ఇంకా నేర్చుకోవాలి.. ఒత్తిడిని తట్టుకోవాలి: కేఎల్ రాహుల్
కోల్కతా చేతిలో భారీ ఓటమితో లఖ్నవూ పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి పడిపోయింది. మిగిలిన మూడు మ్యాచుల్లోనూ గెలిస్తేనే ఆ జట్టుకు ప్లేఆఫ్స్ బెర్తు ఖాయమవుతుంది. -
ధోనీకి ఎవరైనా చెప్పండి.. కనీసం 4 ఓవర్లు బ్యాటింగ్ చేయమని!: భారత మాజీ క్రికెటర్లు
తన టీ20 కెరీర్లో తొలిసారి ధోనీ 9వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు. ఐపీఎల్ 17వ సీజన్లో పంజాబ్తో జరిగిన మ్యాచ్లో క్రీజ్లోకి వచ్చిన ధోనీ మొదటి బంతికే ఔటయ్యాడు. -
టాస్ ఓడితేనేం.. మ్యాచ్లు గెలుస్తున్నాం కదా: శ్రేయస్ అయ్యర్
హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసిన కోల్కతా ప్లేఆఫ్స్ బెర్తుకు దగ్గరైంది. తన చివరి మూడు మ్యాచుల్లో ఒక్కటి గెలిస్తే నాకౌట్ దశకు చేరుకోవడం ఖాయం. ఇప్పటికే అందరికంటే ముందున్న ఆ జట్టు ఓడినా ఇబ్బంది ఉండకపోవచ్చు. -
పంజాబ్తో మ్యాచ్.. ధోనీ రికార్డును అధిగమించిన రవీంద్ర జడేజా
పంజాబ్ను చిత్తు చేయడంలో చెన్నై ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. -
జ్వరం బారిన ప్లేయర్లు.. ఎవరు ఆడతారో తెలియలేదు: రుతురాజ్
పంజాబ్పై చెన్నై ప్రతీకార విజయం సాధించింది. చెపాక్లో జరిగిన పరాభావానికి ధర్మశాలలో బదులు తీర్చుకుంది. ప్లేఆఫ్స్ రేసులో ముందుకు దూసుకొచ్చింది. -
కోల్కతా నం.1
కోల్కతాది అదే జోరు. ఈ సీజన్లో అదిరే ప్రదర్శనతో దూసుకుపోతున్న నైట్రైడర్స్.. వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అంతే కాక ఎనిమిదో విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుని ప్లేఆఫ్స్ స్థానాన్ని దాదాపుగా ఖాయం చేసుకుంది. -
చెన్నై చుట్టేసింది
చివరి నాలుగు మ్యాచ్ల్లో ఒక్కటే గెలుపు! పంజాబ్తో మ్యాచ్లో చేసింది 167 పరుగులే! ఆడుతోంది తటస్థ వేదిక ధర్మశాలలో! అయినా చెన్నై గట్టెక్కింది. కట్టుదిట్టమైన బౌలింగ్తో ప్రత్యర్థిని చుట్టేసి కీలక విజయం సాధించింది. -
బజ్రంగ్పై వేటు
స్టార్ రెజ్లర్ బజ్రంగ్ పునియాను జాతీయ డోపింగ్ నిరోధ సంస్థ (నాడా) సస్పెండ్ చేసింది. ఇటీవల ట్రయల్స్ సందర్భంగా డోప్ టెస్టు కోసం నమూనా ఇవ్వడానికి అతడు తిరస్కరించడంతో నాడా ఈ నిర్ణయం తీసుకుంది. -
జ్యోతికశ్రీ బృందానికి నిరాశ
పారిస్ ఒలింపిక్స్కు అర్హత టోర్నీగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్ రిలే తొలి అంచె టోర్నీలో తెలుగమ్మాయి దండి జ్యోతికశ్రీ బృందానికి నిరాశ ఎదురైంది. -
అక్టోబరు 6న పాక్తో భారత్ ఢీ
బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వనున్న మహిళల టీ20 ప్రపంచకప్లో భారత్ గ్రూప్ ‘ఎ’లో పోటీ పడనుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, పాకిస్థాన్, ఓ క్వాలిఫయర్ ఈ గ్రూప్లోని ఇతర జట్లు. -
బంగ్లాకు మరో విజయం
జింబాబ్వేతో అయిదు టీ20ల సిరీస్లో బంగ్లాదేశ్ వరుసగా రెండో విజయం సాధించింది. ఆదివారం రెండో టీ20లో ఆ జట్టు 6 వికెట్ల తేడాతో నెగ్గింది. మొదట జింబాబ్వే 20 ఓవర్లలో 7 వికెట్లకు 138 పరుగులే చేసింది. -
అవే సిరాజ్ బలాలు
తనపై తనకి నమ్మకం, వెనుదీయని తత్వం పేసర్ మహ్మద్ సిరాజ్ నిజమైన బలాలని సునీల్ గావస్కర్ అన్నాడు. ‘‘మైదానంలో సిరాజ్ సర్వశక్తులూ ఒడ్డుతాడు. -
పుజారా శతకం
భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేయాలని ఆశిస్తున్న సీనియర్ బ్యాటర్ చెతేశ్వర్ పుజారా ఈ కౌంటీ సీజన్లో తొలి శతకం సాధించాడు. ససెక్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్న పుజారా..
తాజా వార్తలు (Latest News)
-
ఆ రికార్డు సాధించిన తొలి భారతీయ పాట ‘కేసరియా’
-
ప్రైవేట్ పార్ట్కు బాల్ తగలడంతో బాలుడి మృతి
-
దక్ష నగర్కర్కు ఏమైంది..?ఆందోళనలో అభిమానులు
-
‘అమ్ముడుపోయే’ ఎమ్మెల్యేలు ప్రజా ద్రోహులు : హిమాచల్ సీఎం
-
గుడ్న్యూస్ చెప్పిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ టీమ్.. అది ఏంటంటే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM