MS Dhoni: ధోనీ ‘డీజిల్ ఇంజిన్’లాంటోడు.. ఆగేదే లేదు: ఏబీ డివిలియర్స్
ధోనీ క్రేజ్ ముందు అంతా దిగదుడుపే. ఐపీఎల్లో (IPL) ఇప్పటికే అత్యంత ఆదరణ కలిగిన కెప్టెన్లలో ఎంఎస్డీ ముందుంటాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఎంఎస్ ధోనీ అత్యధిక మ్యాచ్లు ఆడిన క్రికెటర్గా ఇప్పటికే రికార్డు సృష్టించాడు. నాలుగేళ్ల కిందట అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ‘కెప్టెన్ కూల్’’ ఫిట్నెస్పరంగా కుర్రాళ్లతో పోటీ పడతాడు. గతేడాది చెన్నై సూపర్ కింగ్స్ (CSK)ను ఐదోసారి విజేతగా నిలిపాడు. ప్రతీ సీజన్ సమయంలోనూ ధోనీకిదే చివరిదనే మాటలు వినిపిస్తుంటాయి. కానీ, దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ మాత్రం వాటిని కొట్టిపడేస్తూ ధోనీ ‘డీజిల్ ఇంజిన్లాంటోడు.. ముగింపు ఉండదు’ అని కామెంట్ చేశాడు.
‘‘ధోనీ గురించి ప్రతిసారీ రూమర్లు పుట్టుకొస్తుంటాయి. గతేడాది కూడా ఇదే మాట అన్నారు. కానీ, అతడు మాత్రం రెట్టించిన ఉత్సాహంతో దూసుకొచ్చాడు. మరి ఇదే చివరి సీజన్ అవుతుందా? అనే అనుమానాలు చాలామందిలో ఉన్నాయి. ఎవరికీ తెలియదు. కానీ, ఒక మాట చెబుతా. ధోనీ డీజిల్ ఇంజిన్ లాంటోడు. ఎప్పటికీ ముగింపు ఉండదు. అతడు మాత్రమే తన వీడ్కోలుపై నిర్ణయం తీసుకోగలడు. అద్భుతమైన కెప్టెన్సీ. సూపర్ ప్లేయర్. ధోనీ నాయకత్వం, నిశ్శబ్దంగా ఉండే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఆధ్వర్యంలో పని చేయడం ఆటగాళ్లకు వరం లాంటిది. ఇలాంటి జట్టును ఓడించడం ప్రత్యర్థులకు తేలికేం కాదు. అందుకే, అత్యంత విజయవంతమైన జట్టు, ఫ్రాంచైజీ సీఎస్కే’’ అని ఏబీ డివిలియర్స్ వ్యాఖ్యానించాడు.
రోహిత్నే కెప్టెన్గా ఉంచాలి: యువరాజ్ సింగ్
ముంబయి కెప్టెన్సీ మార్చడంపై భారత స్టార్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ స్పందించాడు. ‘‘ముంబయిని రోహిత్ ఐదుసార్లు ఛాంపియన్గా నిలిపిన కెప్టెన్. అతడిని పక్కన పెట్టడం భారీ నిర్ణయమే. రోహిత్ను మరో సీజన్కు సారథిగా కొనసాగించి.. ఆ తర్వాత హార్దిక్కు జట్టు పగ్గాలు అప్పగిస్తే బాగుండేది. నేనైతే హార్దిక్ను హిట్మ్యాన్కు డిప్యూటీగా ఉంచేవాడిని. అయితే, ఫ్రాంచైజీ కోణంలో చూస్తే.. భవిష్యత్తు కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అనిపిస్తోంది. ప్రస్తుతం రోహిత్ భారత జట్టు కెప్టెన్. అద్భుతమైన ఆటగాడు. ప్రతి ఒక్కరికీ వ్యక్తిగతమైన అభిప్రాయం ఉంటుంది. కానీ, ఫ్రాంచైజీ తీసుకున్న నిర్ణయమే ఫైనల్. ఇక హార్దిక్ పాండ్య టాలెంట్పరంగా అద్భుతమే. కానీ, గుజరాత్ కెప్టెన్సీతో పోలిస్తే ముంబయి సారథ్య బాధ్యతలు కాస్త విభిన్నం. ఎందుకంటే అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి’’ అని యూవీ వెల్లడించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్
తన జట్టు వరుసగా విజయాలు సాధిస్తున్నా.. బౌలింగ్లో నాణ్యమైన ప్రదర్శన చేయడంలో మాత్రం రవిచంద్రన్ అశ్విన్ విఫలం కావడం అభిమానులను కలవరానికి గురి చేస్తోంది. -
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
హైదరాబాద్లో తొమ్మిది మ్యాచుల్లో ఐదు విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ప్రత్యర్థులు 200+ స్కోరు లక్ష్యాన్ని నిర్దేశిస్తే మాత్రం తేలిపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. -
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
ప్రపంచ కప్ కోసం టీమ్లను ప్రకటించాల్సిన గడువు సమీపిస్తోంది. తాజాగా న్యూజిలాండ్ తమ స్క్వాడ్ను వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. -
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
తాను సెంచరీ చేజార్చుకున్నప్పటికీ.. జట్టు విజయం సాధించడం ఆనందంగా ఉందని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వ్యాఖ్యానించాడు. -
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
ఐపీఎల్ (IPL) వస్తోంది అంటే టన్నులకు టన్నులు మజా వస్తుంది అని క్రికెట్ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. కానీ ఈసారి అలా లేదు. సమస్య ఏంటా? అని చూస్తే కొన్ని పాయింట్లు కనిపిస్తున్నాయి. -
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
భారీగా పరుగులు చేస్తున్నా.. నిదానంగా ఆడుతున్నాడనే అపవాదు మోస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అలాంటి కామెంట్లకు సరైన కౌంటర్ ఇచ్చాడు. -
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్