IND vs ENG: అనుభవం లేని కుర్రాళ్లు అన్నారు.. వారి పట్టుదల ముందు అంతా దిగదుడుపే: రోహిత్ శర్మ
సెంచరీలు చేయడమే కాదు.. ప్రత్యర్థికి చెందిన 20 వికెట్లు పడగొట్టమూ ముఖ్యమని భారత కెప్టెన్ రోహిత్ శర్మ వ్యాఖ్యానించాడు. ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్ను భారత్ 4-1 తేడాతో సొంతం చేసుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లాండ్తో (IND vs ENG) ఐదు టెస్టుల సిరీస్ను యువ భారత్ కైవసం చేసుకుంది. దాదాపు 112 ఏళ్ల తర్వాత ఐదు టెస్టుల సిరీస్లో 0-1తో వెనుకబడి.. 4-1తో సిరీస్ను గెలిచిన జట్టుగా భారత్ నిలిచింది. ఎక్కువగా కుర్రాళ్లే ఉన్న ఈ జట్టు బలమైన పర్యటక టీమ్పై ఆధిపత్యం సాధించడం విశేషం. బ్యాటింగ్లో యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్, ధ్రువ్, గిల్ అదరగొట్టేశారు. ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్లోనూ ఇంగ్లాండ్ బ్యాటర్లు తడబడిన వేళ టీమ్ఇండియా ఆటగాళ్లు మాత్రం భారీగా పరుగులు రాబట్టారు. ఇదే విషయాన్ని భారత కెప్టెన్ రోహిత్ శర్మ మ్యాచ్ అనంతరం వెల్లడించాడు.
‘‘సిరీస్ను ఇంతటి స్థాయిలో సాధించడం సాధారణ విషయం కాదు. ఒక దశలో కొంతమంది మన జట్టుపై చేసిన వ్యాఖ్యలూ మాలో పట్టుదల పెంచాయి. అనుభవం పెద్దగా లేని కుర్రాళ్లతో బరిలోకి దిగాం. అయితే, వారు చూపించిన తెగువ అద్భుతం. ఒత్తిడిలోనూ కీలక ఇన్నింగ్స్లు ఆడారు. జట్టు మొత్తం కలిసికట్టుగా ఇంగ్లాండ్ను ఓడించింది. అందరూ శతకాలు గురించి మాట్లాడుతుంటారు. కానీ, ప్రత్యర్థికి చెందిన 20 వికెట్లు తీయడమూ కీలకమే. మా బౌలర్లు తమ బాధ్యతలను చక్కగా నిర్వర్తించారు. కుల్దీప్ యాదవ్ తొలి ఇన్నింగ్స్లో బౌలింగ్ ప్రదర్శన సూపర్. గాయ పడిన తర్వాత జట్టులోకి వచ్చి బౌలింగ్ చేస్తున్న తీరు అభినందనీయం. యువ బ్యాటర్ జైస్వాల్ సత్తా అందరికీ తెలిసిందే. ప్రత్యర్థి బౌలర్లను ఒత్తిడికి గురి చేసే టాలెంట్ అతడి సొంతం. సవాళ్లను ఎదుర్కోవడం అతడికి చాలా ఇష్టం. తప్పకుండా ఇది జీవితంలో చిరస్మరణీయంగా నిలిచిపోయే సిరీస్ అవుతుంది’’ అని రోహిత్ తెలిపాడు.
గట్టి జట్టుతోనే తలపడ్డామని భావిస్తున్నా: బెన్ స్టోక్స్
‘‘నాణ్యమైన ప్రత్యర్థితో మేం తలపడ్డాం. మేం ఇంకా ఆడాల్సిన క్రికెట్ చాలా ఉంది. ఈ సిరీస్ ఓటమిని వదిలిపెట్టి ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఇంత పెద్ద సిరీస్లో కొన్ని సంఘటనలు జరుగుతుంటాయి. వ్యక్తిగతంగా మా ఆటతీరు ఎలా ఉంటుందో తెలుసు. అయితే, తప్పు ఎక్కడ జరిగిందనే దానిపై విశ్లేషించుకుంటాం. బౌలింగ్ పరంగా భారత్ ఆధిపత్యం ప్రదర్శించింది. బ్యాటింగ్లోనూ కొత్త కుర్రాళ్లు బాగా ఆడారు. రిస్క్ తీసుకున్నప్పుడు కొన్నిసార్లు వెనకడుగు వేయాల్సి ఉంటుంది. జాక్ క్రాలే, బెన్ డకెట్ మంచి భాగస్వామ్యాలను నిర్మించారు. యువ బౌలర్లు బషీర్, హార్ట్లీ ఉత్తమ ప్రదర్శన చేశారు. మా స్టార్ పేసర్ జేమ్స్ అండర్సన్ 700 వికెట్ల క్లబ్లోకి చేరాడు. రూట్ మళ్లీ ఫామ్లోకి రావడం ఆనందంగా ఉంది’’ అని ఇంగ్లాండ్ కెప్టెన్ స్టోక్స్ వ్యాఖ్యానించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్
తన జట్టు వరుసగా విజయాలు సాధిస్తున్నా.. బౌలింగ్లో నాణ్యమైన ప్రదర్శన చేయడంలో మాత్రం రవిచంద్రన్ అశ్విన్ విఫలం కావడం అభిమానులను కలవరానికి గురి చేస్తోంది. -
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
హైదరాబాద్లో తొమ్మిది మ్యాచుల్లో ఐదు విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ప్రత్యర్థులు 200+ స్కోరు లక్ష్యాన్ని నిర్దేశిస్తే మాత్రం తేలిపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. -
చిన్నారులతో ప్రపంచ కప్ జట్టు ప్రకటన.. వీడియో వైరల్
ప్రపంచ కప్ కోసం టీమ్లను ప్రకటించాల్సిన గడువు సమీపిస్తోంది. తాజాగా న్యూజిలాండ్ తమ స్క్వాడ్ను వెల్లడించింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. -
గెలవడం కష్టమే అనుకున్నా.. మ్యాచ్ టర్నింగ్ స్పెల్ జడ్డూదే: రుతురాజ్
తాను సెంచరీ చేజార్చుకున్నప్పటికీ.. జట్టు విజయం సాధించడం ఆనందంగా ఉందని చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ వ్యాఖ్యానించాడు. -
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
ఐపీఎల్ (IPL) వస్తోంది అంటే టన్నులకు టన్నులు మజా వస్తుంది అని క్రికెట్ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. కానీ ఈసారి అలా లేదు. సమస్య ఏంటా? అని చూస్తే కొన్ని పాయింట్లు కనిపిస్తున్నాయి. -
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
భారీగా పరుగులు చేస్తున్నా.. నిదానంగా ఆడుతున్నాడనే అపవాదు మోస్తున్న క్రికెటర్ విరాట్ కోహ్లీ. అలాంటి కామెంట్లకు సరైన కౌంటర్ ఇచ్చాడు. -
‘బేబీ ఈజ్ ఆన్ ది వే’... సాక్షి ధోనీ ఇన్స్టా స్టోరీ వైరల్
ధోనీ సోషల్ మీడియాలో చురుగ్గా ఉండడు. కానీ, అతడి సతీమణి సాక్షి మాత్రం చాలా యాక్టివ్. తాజాగా ఆమె పెట్టిన ఇన్స్టా స్టోరీ వైరల్గా మారింది. -
పది బంతుల్లోనే 50 TO 100.. వారి వల్లే ఇది సాధ్యం: విల్ జాక్స్
అద్భుత శతకంతో బెంగళూరు విజయంలో విల్ జాక్స్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (70*) చూడచక్కని ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. -
సన్రైజర్స్ మళ్లీ..
సన్రైజర్స్ మళ్లీ తడబడింది. సంచలన బ్యాటింగ్తో టోర్నీలో కలకలం రేపి ఓ దశలో తిరుగులేనట్లు కనిపించిన ఆ జట్టు వరుసగా రెండో పరాజయం చవిచూసింది. సన్రైజర్స్ బ్యాటర్లకు కళ్లెం వేసిన చెన్నై సూపర్కింగ్స్ అయిదో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. -
నిన్న జేక్.. నేడు జాక్స్
ఐపీఎల్లో ఇప్పటికే ఆస్ట్రేలియా యువ సంచలనం జేక్ ఫ్రేజర్ సంచలన ఇన్నింగ్స్లతో చెలరేగిపోతుంటే.. ఇప్పుడు మరో విదేశీ కుర్రాడు తన సత్తా చూపించాడు. బెంగళూరుకు ఆడుతున్న ఇంగ్లాండ్ ఆల్రౌండర్ విల్ జాక్స్.. -
ధీరజ్ బృందానికి స్వర్ణం
ఆర్చరీ ప్రపంచకప్ను భారత క్రీడాకారులు మరో అద్భుత ప్రదర్శనతో ముగించారు. తెలుగబ్బాయి ధీరజ్ బొమ్మదేవర, తరుణ్దీప్రాయ్, ప్రవీణ్ జాదవ్తో కూడిన భారత జట్టు పురుషుల రికర్వ్ టీమ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకుంది. -
క్వార్టర్స్లో భారత్
ప్రతిష్టాత్మక ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత్ క్వార్టర్ఫైనల్కు దూసుకెళ్లింది. ఆదివారం గ్రూప్-ఏ పోరులో 4-1తో సింగపూర్ను ఓడించింది. -
హిమతేజకు కాంస్యం
‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ వల్లిపి హిమతేజ సత్తా చాటాడు. దుబాయ్లో జరిగిన ఆసియా జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో అతడు కాంస్యంతో మెరిశాడు. -
మహేశ్వరికి పారిస్ కోటా స్థానం
షూటింగ్లో భారత్కు మరో ఒలింపిక్ కోటా స్థానం ఖాయమైంది. దోహాలో జరిగిన అర్హత టోర్నీలో రజతం గెలిచిన మహేశ్వరి చౌహాన్ పారిస్ బెర్తు సాధించింది. -
బంగ్లాతో తొలి టీ20లో భారత్ ఘనవిజయం
బంగ్లాదేశ్తో అయిదు టీ20ల సిరీస్లో భారత మహిళల జట్టు శుభారంభం చేసింది. ఆదివారం తొలి టీ20లో హర్మన్ప్రీత్ సేన 44 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. -
పాక్ వన్డే, టీ20 కోచ్గా కిర్స్టెన్
2011 ప్రపంచకప్ గెలిచిన భారత జట్టుకు కోచ్గా వ్యవహరించిన గారీ కిర్స్టెన్... పాకిస్థాన్ వన్డే, టీ20 ప్రధాన శిక్షకుడిగా నియమితుడయ్యాడు. టెస్టు జట్టు ప్రధాన కోచ్గా ఆస్ట్రేలియా మాజీ స్పీడ్స్టర్ జేసన్ గిలెస్పీ బాధ్యతలు స్వీకరించనున్నాడు. -
జాదుమణి, ఆకాశ్ ముందంజ
ఏఎస్బీసీ ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో జాదుమణి సింగ్ (51 కేజీ), ఆకాశ్ గోర్కా (60 కేజీ) క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
కల్కి ఆ ఇంగ్లీష్ మూవీకి కాపీనా? నాగ్ అశ్విన్ రిప్లై ఇదే!
-
లైంగిక వేధింపుల కేసు.. ప్రజ్వల్ను సస్పెండ్ చేస్తాం - జేడీఎస్
-
30 వారాల గర్భవిచ్ఛిత్తి కేసు.. తీర్పును వెనక్కి తీసుకున్న ‘సుప్రీం’
-
మహీంద్రా నుంచి ఎక్స్యూవీ 3XO.. ధర ₹7.49 లక్షలు
-
ప్రేమలో విఫలమైతే అలా చేయొద్దు: పూరి జగన్నాథ్