ఆండ్రాయిడ్ యూజర్లూ.. సిద్ధం కండి: ట్విటర్‌

ఆండ్రాయిడ్‌ యూజర్లకు ట్విటర్‌ మరొక ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఇంతకుముందు...

Published : 03 Mar 2021 23:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆండ్రాయిడ్‌ యూజర్లకు ట్విటర్‌ మరో ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఇంతకుముందు ఆడియో చాట్ కోసం ఐవోఎస్‌ యూజర్లకు అందించిన ‘స్పేసెస్’ ఫీచర్‌ను ఆండ్రాయిడ్‌ యూజర్లకూ అందించనుంది. ఇప్పటికే బీటా వెర్షన్‌లో టెస్టింగ్‌ చేస్తున్నట్లు ట్విటర్ ప్రకటించింది. ఆండ్రాయిడ్ డివైజ్‌లు ఎక్కువగా వినియోగించే భారత్‌ లాంటి దేశాల్లో యూజర్ల కోసం ఆడియో చాట్‌ ఫీచర్‌ను తెచ్చేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశామని పేర్కొంది. ‘‘ఆండ్రాయిడ్‌ యూజర్లూ..! స్పేసెస్‌ ఫీచర్‌కు సంబంధించి బీటా వెర్షన్‌ను ప్రారంభించాం. త్వరలో స్పేస్‌లో జాయిన్‌  అయ్యి మాట్లాడుకోండి. మీరు సొంతంగా క్రియేట్‌ చేయడానికి సిద్ధంగా ఉండండి.. కొన్ని అంశాలపై టెస్టింగ్‌ చేస్తున్నాం. లైవ్‌ స్పేస్‌ కోసం వేచి చూస్తూ ఉండండి. త్వరలోనే కలుద్దాం..’’ అని ట్వీట్‌ చేసింది. 

ఎలా చేయాలంటే..?
వాట్సాప్‌లో ఆడియో సందేశాన్ని పంపించేందుకు ఎలాంటి అవకాశం ఉందో.. అలాగే ట్విటర్‌లోనూ అలాంటి ఫీచర్‌ను త్వరలోనే ఆండ్రాయిడ్‌ యూజర్లకు రాబోతోంది. ట్విటర్ యాప్‌ను ఓపెన్‌ చేసిన తర్వాత ట్వీట్‌ ఐకాన్‌ను క్లిక్‌ చేయాలి. మెసేజ్ బాక్స్‌ కుడివైపున వాయిస్‌ సింబల్‌ కనిపిస్తుంది. దాన్ని ఓపెన్‌ చేస్తే మైక్‌ వస్తుంది. మైక్‌ను అలానే ప్రెస్‌ చేసి పట్టుకుని మనం చెప్పాలనుకున్నది మాట్లాడాలి. వాయిస్‌ లిమిట్‌ కేవలం 140 సెకన్లు మాత్రమే ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా మైక్రోబ్లాగ్‌గా పేరొందిన ట్విటర్‌కు భారత్‌లో 1.75 కోట్లకుపైగా యూజర్లు ఉన్నారు. అందులోనూ ఎక్కువగా ఆండ్రాయిడ్‌ యూజర్లే ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని