Forest Land: ఆ 22 లక్షల ఎకరాల అటవీ భూములు ఎక్కడ?
రాష్ట్రంలో అటవీ ప్రాంతాల విస్తీర్ణం ఎంతన్న విషయంపై సందిగ్ధం నెలకొంది. అటవీశాఖ రికార్డుల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం అటవీ భూముల విస్తీర్ణం 66.33 లక్షల ఎకరాలు.
అటవీశాఖ రికార్డుల్లో 66.33 లక్షల ఎకరాలు
అందులో నోటిఫై చేసిన భూములు 65.12 లక్షలు
కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో 43.05 లక్షలే
రెవెన్యూ, అటవీ శాఖల రికార్డుల మధ్య భారీగా అంతరం!
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో అటవీ ప్రాంతాల విస్తీర్ణం ఎంతన్న విషయంపై సందిగ్ధం నెలకొంది. అటవీశాఖ రికార్డుల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం అటవీ భూముల విస్తీర్ణం 66.33 లక్షల ఎకరాలు. ఇందులో నోటిఫైడ్ అటవీ బ్లాక్లనే పరిగణనలోకి తీసుకుంటే ఆ విస్తీర్ణం 65.12 లక్షల ఎకరాలు. అయితే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర అటవీశాఖ పంపిన నివేదికలో మాత్రం ఆ విస్తీర్ణం 43.05 లక్షల ఎకరాలుగా ఉంది. మిగిలిన 22 లక్షల ఎకరాల అటవీ భూములు ఏమైపోయాయన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
భౌగోళిక విస్తీర్ణంలో 24 శాతం
రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం 2,77,10,412 ఎకరాలు. అటవీ చట్టం ప్రకారం అందులో అటవీ ప్రాంతం 66,33,312 ఎకరాలు. అంటే రాష్ట్రం మొత్తం విస్తీర్ణంలో దాదాపు 24 శాతం అటవీ ప్రాంతమే. కేంద్ర అటవీశాఖ ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ (ఐజీ)కి రాష్ట్ర అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్, హెడ్ ఆఫ్ ద ఫారెస్ట్) ఆర్.ఎం.డోబ్రియాల్ ఇటీవల పంపిన నివేదికలో జిల్లాలవారీగా అటవీ భూముల వివరాల్ని పొందుపరిచారు. అందులో మొత్తం అటవీ భూములు 43.05 లక్షల ఎకరాలుగా పేర్కొన్నారు. ఇవి రెవెన్యూశాఖ గుర్తించిన అటవీ భూములని, తెలంగాణ సీసీఎల్ఏ (చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్) నుంచి తీసుకున్న వివరాలని తెలిపారు. టీఎన్ గోదావర్మన్ కేసుకు సంబంధించిన అంశంలో దేశంలో అటవీ భూములకు సంబంధించిన వివరాలను 2024 మార్చి 31కల్లా పంపించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీలు అడవులుగా గుర్తించిన భూముల వివరాల్ని పంపాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పీసీసీఎఫ్ అటవీ భూముల వివరాల్ని కేంద్ర అటవీశాఖకు పంపించారు. నోటిఫైడ్ ఫారెస్టు బ్లాక్లతో పాటు వివిధ కేటగిరీల కింద రెవెన్యూ రికార్డుల్లో నమోదైన అటవీ ప్రాంతాలని అందులో వివరించారు.
అటవీ చట్టం ప్రకారం మరో జాబితా..
తెలంగాణలో అటవీ భూములకు సంబంధించి మరో జాబితాను కూడా పీసీసీఎఫ్ పంపించారు. అటవీ చట్టం ప్రకారం గుర్తించిన భూములంటూ జిల్లాల వారీగా వివరాల్ని పొందుపరిచారు. అందులో వివిధ సెక్షన్ల కింద మూడు రకాల నోటిఫైడ్ అటవీ బ్లాకుల కింద భూములు ఉన్నాయి. వీటి విస్తీర్ణం 65.12 లక్షల ఎకరాలు. అదేవిధంగా నోటిఫై చేయని అటవీ బ్లాక్లంటూ సుమారు 1.20 లక్షల ఎకరాల భూముల్ని పేర్కొన్నారు.
రెండు శాఖల రికార్డులు వేర్వేరు!
అటవీ భూములకు సంబంధించి అటు రెవెన్యూ, ఇటు అటవీ శాఖల రికార్డులు వేర్వేరుగా ఉన్నాయి. రెండింటి మధ్య నోటిఫైడ్ అటవీ బ్లాక్ల విస్తీర్ణం అంతరం 22 లక్షల ఎకరాలకు పైచిలుకు. నోటిఫై చేయనివి కూడా కలిపితే తేడా 23.28 లక్షల ఎకరాలు. రికార్డులు వేర్వేరుగా ఉండటం సమస్యగా మారింది. ఈ 23.28 లక్షల ఎకరాల భూమి ఎక్కడ ఉంది.. ఏ స్థితిలో ఉంది అన్నది తేలాల్సి ఉంది. నోటిఫైడ్ అటవీ బ్లాక్ల గణాంకాలను పరిశీలిస్తే..
- ఆదిలాబాద్లో జిల్లాలో అటవీశాఖ రికార్డుల ప్రకారం అటవీ భూమి విస్తీర్ణం 4,43,729.42 ఎకరాలు కాగా, రెవెన్యూశాఖ శాఖ రికార్డుల్లో 1,28,525 ఎకరాలే ఉంది.
- కొత్తగూడెం జిల్లాలో అటవీశాఖ రికార్డుల ప్రకారం 10,08,720.81 ఎకరాలు ఉండగా.. రెవెన్యూశాఖ గుర్తించిన అటవీభూమి 9,52,943 ఎకరాలు మాత్రమే.
- కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అటవీశాఖ రికార్డుల ప్రకారం అటవీ భూమి 4,92,674.50 ఎకరాలు కాగా.. రెవెన్యూ రికార్డుల్లో 4,09,587 ఎకరాలే ఉంది.
- ములుగు జిల్లాలో అటవీశాఖ రికార్డుల ప్రకారం అటవీ భూమి 7,18,940 ఎకరాలు కాగా.. రెవెన్యూ రికార్డుల్లో 4,42,094 ఎకరాలే ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాన్న గుండె ఉప్పొంగిన రోజు
పిల్లలు తమ కన్నా గొప్పగా ఎదగాలని.. ఉన్నత స్థానాల్లో ఉండాలని తల్లిదండ్రులందరూ కోరుకుంటారు. అలాంటి ఒక తండ్రి ఆశయం నెరవేరి దేశంలో అత్యున్నత సర్వీసు అయిన ఐఏఎస్ సాధించిన కుమార్తె తాను పని చేస్తున్న చోటుకే శిక్షణ కోసం అడుగుపెడితే ఎలా ఉంటుంది.. -
విచారణ నుంచి తప్పుకోండి
‘మీ విచారణలో నిష్పాక్షికత కనిపించడం లేదు, ఇప్పుడు నేను మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని స్పష్టమవుతోంది. విచారణ కమిషన్ ఛైర్మన్ బాధ్యతల నుంచి మీరే స్వచ్ఛందంగా వైదొలగాల్సిందిగా విన్నవిస్తున్నాను’ అని జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్కు మాజీ సీఎం కేసీఆర్ ఘాటుగా లేఖ రాశారు. -
ఆగస్టు 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు
రాష్ట్రంలో ఆగస్టు ఒకటో తేదీ నుంచి వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, స్థిరాస్తుల కొత్త రిజిస్ట్రేషన్ల ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువలను సవరించేందుకు ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే. -
ఓఆర్ఆర్ యూనిట్గా విపత్తు నిర్వహణ
ఔటర్ రింగ్ రోడ్డుకు లోపల ఉన్న నగరాన్ని ఓ యూనిట్గా తీసుకొని విపత్తు నిర్వహణ వ్యవస్థను పటిష్ఠంగా రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో స్పందించేలా కార్యాచరణ రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. -
మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్ణయం గత ప్రభుత్వ ముఖ్యులదే
మేడిగడ్డ వద్ద బ్యారేజీ నిర్మించాలన్న నిర్ణయం గత ప్రభుత్వంలోని ముఖ్యులదేనని నిపుణుల కమిటీలోని కొందరు సభ్యులు న్యాయ విచారణ కమిషన్ ఎదుట చెప్పినట్లు తెలిసింది. -
భారాస హయాంలో అనర్హులకూ పోడు భూములు
భారాస ప్రభుత్వ హయాంలో పోడు భూముల పంపిణీలో అక్రమాలు జరిగినట్లు తన దృష్టికి వచ్చిందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. అనర్హులకు పోడు భూముల పంపిణీపై నివేదిక ఇవ్వాలని అటవీశాఖ ఉన్నతాధికారుల్ని ఆమె ఆదేశించారు. -
ఖాళీల్లోనే ఆ పాఠశాలలు ఆదర్శం!
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో నాణ్యమైన విద్య అందించాలన్న సంకల్పంతో ప్రారంభమైన ఆదర్శ పాఠశాలలు సమస్యల వలయంలో చిక్కుకున్నాయి. -
అంతిమ లబ్ధిదారులే కీలకం
గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) రంగప్రవేశం సూత్రధారుల్లో గుబులు రేపుతోంది. సుమారు రూ.700 కోట్లు దారి మళ్లినట్లు అవినీతి నిరోధక శాఖ(అనిశా) గుర్తించిన నేపథ్యంలో ఈడీ రంగంలోకి దిగి ఆ సొమ్ము అంతిమ లబ్ధిదారులను గుర్తించేందుకు వేట మొదలుపెట్టింది. -
గ్యాస్ సిలిండర్ పేలుడుకు పరిహారం చెల్లించాల్సిందే
గ్యాస్ సిలిండర్ పంపిణీలో రక్షణ చర్యలు చేపట్టకపోవడం పంపిణీదారు, కంపెనీల సేవా లోపమేనని రాష్ట్ర వినియోగదారుల కమిషన్ పేర్కొంది. -
నేడు సివిల్స్ ప్రాథమిక పరీక్ష
ప్రతిష్ఠాత్మక సివిల్ సర్వీసెస్-2024 ప్రాథమిక పరీక్ష దేశవ్యాప్తంగా ఆదివారం జరగనుంది. మొత్తం 1,056 ఉద్యోగాలు ఉండగా... ప్రిలిమ్స్కు దేశవ్యాప్తంగా 13 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. -
తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు ఇన్ఛార్జి వీసీలే
రాష్ట్రంలోని 10 విశ్వవిద్యాలయాలకు మరికొంత కాలం ఐఏఎస్ అధికారులే ఇన్ఛార్జి ఉపకులపతులుగా వ్యవహరించనున్నారు. ఇన్ఛార్జి వీసీల పదవీకాలాన్ని పొడిగిస్తూ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం శనివారం జీవోలు జారీ చేశారు. -
నిన్నటి మనస్తత్వంతో రేపటి పోరాటం చేయలేం
-
ఒకటో తేదీన వేతనాలు చెల్లించాలని ఆశా కార్యకర్తల ధర్నా
రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో సేవలందిస్తున్న ఆశా కార్యకర్తలకు ప్రతి నెల ఒకటో తేదీనే వేతనాలు అందించాలని, ఎన్నికల మ్యానిఫెస్టో మేరకు రూ.18 వేల స్థిర వేతనం అమలు చేయాలని భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్(బీఆర్టీయూ) రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
నల్లమలలో చిరుత మృతి
నల్లమల అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం ఓ చిరుత మృతి చెందడం కలకలం రేపింది. నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం ఈగలపెంట శ్రీశైలం ప్రాజెక్టు సమీపంలో రహదారి పక్కన మృతిచెందిన చిరుతను గమనించిన స్థానికులు అటవీ శాఖాధికారులకు సమాచారం ఇచ్చారు. -
మొలకెత్తింది కష్టాలే
జూన్ మొదటి వారంలో కురిసిన వర్షాలతో రైతులు పత్తి విత్తనాలు వేశారు. వారం రోజులుగా ఎండలు వేసవిని తలపిస్తున్నాయి. -
బీసీలు మిలిటెంట్ పోరాటాలకు సిద్ధం కావాలి
ఆత్మగౌరవం, రాజ్యాధికార సాధన కోసం బీసీలు మిలిటెంట్ పోరాటాలకు సిద్ధం కావాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పిలుపునిచ్చారు. -
కులగణన సర్వేకు స్వతంత్ర కమిషన్ ఏర్పాటు చేయాలి
కులగణన సర్వే చేసి రిజర్వేషన్లు ఖరారు చేశాకే.. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ కోరారు. -
నియంతృత్వ, నిర్బంధ పోకడలు తగవు
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి ఏళ్లు గడుస్తున్నా నేటికీ పరిపాలనలో సామాజిక మార్పు రాలేదని... నియంతృత్వ పోకడలు, అణచివేత, నిర్బంధాలు కొనసాగుతున్నాయని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.సుదర్శన్రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. -
రమేశ్కార్తీక్ నాయక్ను వరించిన ‘యువ పురస్కార్’
ఈనాడు- దిల్లీ, నిజామాబాద్, హైదరాబాద్: తెలంగాణకు చెందిన రమేశ్కార్తీక్ నాయక్ సహా 23 మంది రచయితలకు 2024 సంవత్సరానికి యువ పురస్కార్ అవార్డులను కేంద్ర సాహిత్య అకాడమీ ప్రకటించింది. -
అవసరాలకు సరిపడా ఎరువుల నిల్వలు
తెలంగాణలో వానాకాలం సీజన్కు సరిపడా ఎరువులను అందుబాటులో ఉంచాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో విక్రయించిన పత్తి విత్తనాలు రైతులకే చేరాయో లేదో... తేల్చేందుకు తనిఖీలు చేయాలని సూచించారు. -
వైఎస్ జగన్ ఇంటి ముందు అక్రమ నిర్మాణాల కూల్చివేత
హైదరాబాద్ లోటస్పాండ్లోని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంటి ముందున్న అక్రమ నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు శనివారం కూల్చివేశారు. గతంలో ఇక్కడ రహదారిని ఆక్రమించి ఇంటి సెక్యూరిటీ సిబ్బంది కోసం గదులను నిర్మించారు.
తాజా వార్తలు (Latest News)
-
కౌంటింగ్ వేళ ఈవీఎం అన్లాక్ ఘటన..ఎంపీ బంధువు అరెస్ట్
-
ఐపీఎస్ అధికారి గరికపాటి బిందు మాధవ్పై సస్పెన్షన్ ఎత్తివేత
-
మార్పొస్తుందని ఆశిస్తున్నా: పవన్ కల్యాణ్పై ఉపేంద్ర ఆసక్తికర వ్యాఖ్యలు
-
రేణుకాస్వామి హత్య కేసు.. ఆ కారు సీజ్!
-
శ్రీలంక-భారత్ ప్రతిపాదిత రోడ్డు మార్గం.. ద్వీపదేశం ఏమందంటే!
-
రష్యాలో కలకలం.. జైలు సిబ్బందినే బందీలుగా పట్టుకుని..!