Amaravati: అంబరాన్నంటిన సంబరాలు
అమరావతిపై ఏపీ హైకోర్టు తీర్పుతో రాజధాని గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఇన్నాళ్లు రైతుల మోముల్లో కనిపించిన ఆవేదన తొలగి సంతోషం వెల్లివిరిసింది. తీర్పు వెలువడగానే శిబిరాల్లో రైతులు ఒకరికొకరు
రాజధాని గ్రామాల్లో పండగ వాతావరణం
ఈనాడు డిజిటల్- అమరావతి, తుళ్లూరు గ్రామీణం- న్యూస్టుడే: అమరావతిపై ఏపీ హైకోర్టు తీర్పుతో రాజధాని గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఇన్నాళ్లు రైతుల మోముల్లో కనిపించిన ఆవేదన తొలగి సంతోషం వెల్లివిరిసింది. తీర్పు వెలువడగానే శిబిరాల్లో రైతులు ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుని సంబరాలు చేసుకున్నారు. భారీగా బాణసంచా కాల్చి, సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఆకుపచ్చ కండువాలు చేతపట్టి నినాదాలతో హోరెత్తించారు. మహిళా రైతులు రంగులు పూసుకుని ఆనందాన్ని పంచుకున్నారు. తీర్పు అనుకూలంగా రాగానే టీవీల ముందు చప్పట్లు కొడుతూ కనిపించారు. శిబిరాల్లో జై అమరావతి నినాదాలు మిన్నంటాయి.
హైకోర్టు వద్ద సాష్టాంగ నమస్కారం
తీర్పు వెలువడిన తర్వాత రాజధాని రైతులు, మహిళలు, రైతు కూలీలు ఉదయం హైకోర్టు ఎదుట సాష్టాంగ నమస్కారం చేసి కృతజ్ఞతలు తెలిపారు. మోకాళ్లపై నిల్చుని రెండు చేతులు జోడించి నమస్కరించారు. మహిళలు హైకోర్టుకు హారతులిచ్చారు. ముస్లిం మహిళలు, రైతులు మోకాళ్లపై నిల్చుని కృతజ్ఞతలు తెలిపారు. న్యాయాన్ని కాపాడిన న్యాయదేవతకు వందనం అని నినాదాలు చేశారు. న్యాయవాదులంతా హర్షం వ్యక్తం చేశారు. సాయంత్రం హైకోర్టు వద్దకు రైతులు, మహిళలు భారీగా చేరుకున్నారు. హైకోర్టు వద్ద నుంచి సీడ్యాక్సిస్ రహదారి వరకు రోడ్డుకు ఇరువైపులా మానవహారంలా నిల్చుని ఆ రోడ్డులో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వెళ్లే వరకు వేచి ఉండి రెండు చేతులు జోడించి కృతజ్ఞతలు తెలిపారు. కొంతమంది రైతులు మోకాళ్లపై నిల్చుని ధన్యవాదాలు తెలిపారు.
న్యాయదేవత విగ్రహానికి పాలాభిషేకం
తుళ్లూరు, అబ్బరాజుపాలెంలో న్యాయదేవతకు పాలాభిషేకం చేశారు. మందడం శిబిరంలో న్యాయదేవత ఎదుట నిల్చుని నినదించారు. అనంతవరం శిబిరంలో అమరావతి ఉద్యమంలో అమరులైన రైతులకు నివాళి అర్పించారు. వెలగపూడిలో శిబిరంలో తెలుగుతల్లి విగ్రహానికి పూలమాల వేసి, నినాదాలు చేశారు. భాజపా ఎంపీ సుజనా చౌదరి మందడం, వెలగపూడి, తుళ్లూరు దీక్షా శిబిరాలను సందర్శించి రైతులకు మద్దతు తెలిపారు. ఆయనకు మందడం గ్రామంలో ఘనస్వాగతం పలికారు.
ఉద్యమాన్ని కొనసాగిస్తాం అభివృద్ధి చేపట్టేంతవరకు పోరుబాటే: ఐకాస
ఈనాడు డిజిటల్, అమరావతి: కోర్టు తీర్పునుబట్టి ప్రభుత్వం అమరావతిని అభివృద్ధి చేసేంత వరకు రాజధాని ఉద్యమాన్ని కొనసాగిస్తామని అమరావతి ఐకాస, అమరావతి పరిరక్షణ సమితి నేతలు స్పష్టం చేశారు. రాజధాని గ్రామాల్లో యథాతథంగా శిబిరాలు కొనసాగుతాయని వెల్లడించారు. రెండున్నరేళ్లలో పాలకుల విధానాల్ని చూసి రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మలేని పరిస్థితి ఉందని పేర్కొన్నారు. కోర్టు తీర్పునకు అనుగుణంగా రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు, అమరావతిలో అన్ని రకాల మౌలిక వసతులు సమకూరే వరకు పోరుబాట కొనసాగుతుందని వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇదీ సంగతి!
ఎంత ఎండలైనా కండువాని అలా కప్పుకోకండి సార్! దివాలా తీశారు అనుకొంటారు!! -
జవహర్రెడ్డి జగన్నాటకం
ఒక ఎత్తు కాకపోతే మరో ఎత్తు. ఒక వ్యూహం కాకపోతే మరో వ్యూహం. ఏది అమలుచేసినా అంతిమంగా వైకాపాకు మేలు చేయడమే లక్ష్యం. -
సుందరనాయుడి సేవలు నిరుపమానం
అందరూ ఆప్యాయంగా చిత్తూరు పెద్దాయన అని పిలుచుకునే.. కోళ్ల పరిశ్రమ పితామహుడు దివంగత డాక్టర్ ఉప్పలపాటి సుందరనాయుడి సేవలు చిరస్మరణీయమని కోళ్ల రైతులు పేర్కొన్నారు. -
గురుదక్షిణగా కారు.. అందజేసిన లేపాక్షి నవోదయ పూర్వవిద్యార్థులు
జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేలా స్ఫూర్తి నింపిన గురువుకు శిష్యులు రూ.12లక్షల విలువైన కారును బహుమతిగా అందజేశారు. -
విశాఖ తీరానికి విలాసవంతమైన నౌక
ప్రఖ్యాత అంతర్జాతీయ క్రూయిజ్ నౌక ‘ది వరల్డ్’ ఆదివారం విశాఖ పోర్టుకు చేరుకుంది. పోర్టు అధికారులు నౌకలో వచ్చిన వారికి ఘన స్వాగతం పలికారు. -
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
సాధారణంగా మనవళ్ల వివాహాలను తాత, నానమ్మలు దగ్గరుండి జరిపిస్తారు. ఇక్కడ మాత్రం తాత, నానమ్మల పెళ్లిని మనవళ్లందరూ కలిసి అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
అరగంట కరెంట్ నిలిపివేత నేపథ్యంలో హైదరాబాద్లోని హబ్సిగూడ సర్కిల్ కీసర డివిజనల్ ఇంజినీర్ (డీఈ) ఎల్.భాస్కర్రావును దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ శనివారం రాత్రి సస్పెండ్ చేశారు. -
తెలంగాణ భగభగ!
తీవ్రమైన ఎండలతో రాష్ట్రం మండిపోతోంది. అన్ని జిల్లాల్లో సాధారణం కన్నా దాదాపు ఐదు డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొద్ది రోజులుగా ప్రమాద హెచ్చరిక స్థాయి 45 డిగ్రీల మార్కును దాటి ఎండలు కాస్తున్నాయి. -
ఆర్టీసీ కార్మికులకు ఊరట
రుణపరపతి సహకార సంఘం(సీసీఎస్)లో దాచుకున్న పొదుపు సొమ్మును వెనక్కి తీసుకునేందుకు మూడున్నరేళ్లుగా ఎదురుచూస్తున్న వేలమంది ఆర్టీసీ కార్మికులకు త్వరలోనే ఊరట లభించనుంది. -
పెద్దపులులకు నీటి కష్టాలు!
మండు వేసవిలో తాగునీటి కోసం వన్యప్రాణులు అల్లాడుతున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతాల్లో వాగులు, చెరువులు, కుంటలు ఎండిపోవడంతో.. పెద్దపులులు సహా ఇతర జంతువులు నీళ్లు లభించే ప్రాంతాల్ని వెతుక్కుంటూ వలస పోతున్నాయి. -
రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు
రాజ్యాంగబద్ధత కలిగిన రిజర్వేషన్లకు తామెప్పుడూ వ్యతిరేకం కాదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. -
శంషాబాద్ విమానాశ్రయంలో చిరుత కలకలం
శంషాబాద్ విమానాశ్రయంలోకి ఆదివారం తెల్లవారుజామున చిరుత చొరబడింది. ఎయిర్పోర్టు దక్షిణ దిశలో ఉన్న ప్రహరీ పైనుంచి ఓ జంతువు దూకినట్లు కంట్రోల్ రూంకు సమాచారం అందటంతో కలకలం రేగింది. -
సాహస బాలుడు సాయిచరణ్కు ముఖ్యమంత్రి అభినందన
రంగారెడ్డి జిల్లా నందిగామలోని ఆలిన్ ఫార్మా పరిశ్రమలో ఈ నెల 26న జరిగిన అగ్నిప్రమాదం నుంచి ఐదుగురు కార్మికులను కాపాడటంలో భాగస్వామి అయిన సాహస బాలుడు ఎం.సాయిచరణ్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభినందించారు. -
వరి పొలంలో భారీ మొసలి పట్టివేత
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం భూత్కూర్లో భారీ మొసలి పట్టుబడింది. గ్రామానికి చెందిన రైతు శేఖర్కు ఆదివారం వరిపొలంలో మొసలి కనిపించింది. -
నేటి నుంచి కన్హ శాంతివనంలో బాబూజీ జయంతి ఉత్సవాలు
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హ శాంతివనంలోని అతిపెద్ద ధ్యాన మందిరంలో బాబూజీ మహరాజ్ 125వ జయంతి ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నట్లు శ్రీరామచంద్రమిషన్ పీఆర్వో చంద్రారెడ్డి ఆదివారం తెలిపారు. -
చిన్న జాగ్రత్తలతో పెద్ద ప్రమాదాన్ని ఆపగలం
చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఎంత పెద్ద ప్రమాదాన్నైనా ఆపగలమని కర్మాగారాలు, కార్మిక, ఉపాధి కల్పనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఐ.రాణి కుముదిని అన్నారు. -
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. కానిస్టేబుల్కు గాయాలు
వరంగల్ జిల్లా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లోని ఈవీఎం స్ట్రాంగ్ రూం వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఓ కానిస్టేబుల్ తుపాకీ ప్రమాదవశాత్తు(మిస్ఫైర్) పేలింది. -
సమస్యలపై ఐక్యంగా పోరాడాలి
దీర్ఘకాలంగా రాష్ట్రంలోని న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలు, డిమాండ్ల పరిష్కారానికి ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని హైకోర్టు బార్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. -
పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడిగా వెంకట్రెడ్డి
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) రాష్ట్ర అధ్యక్షుడిగా వెంకట్రెడ్డి (వరంగల్), ప్రధాన కార్యదర్శిగా సాంబ (కొత్తగూడెం) ఎన్నికయ్యారు. -
శ్రీవారిని కుటుంబసమేతంగా దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి
శ్రీవారిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇ.వి.వేణుగోపాల్ కుటుంబసమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. -
2047 కల్లా అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్
గడిచిన పదేళ్లలో ప్రధాని నరేంద్రమోదీ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా దేశాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని రాజస్థాన్ మంత్రి రాజ్యవర్ధన్సింగ్ రాఠోడ్ అన్నారు.