Telangana News: మార్చి 1 నుంచి పరస్పర బదిలీలు
తెలంగాణలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరస్పర బదిలీల (మ్యూచువల్)కు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం మార్గదర్శకాలు జారీ చేసింది. దీనిపై జీవో 21 ఇచ్చింది. బదిలీ కోసం వచ్చే
15 వరకు దరఖాస్తుల స్వీకరణ
ఒకరితోనే అంగీకార పత్రం ఉండాలి
ప్రక్రియ అంతా ఆన్లైన్లోనే
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరస్పర బదిలీల (మ్యూచువల్)కు రాష్ట్ర ప్రభుత్వం బుధవారం మార్గదర్శకాలు జారీ చేసింది. దీనిపై జీవో 21 ఇచ్చింది. బదిలీ కోసం వచ్చే నెల ఒకటో తేదీ నుంచి 15 వరకు సమీకృత ఆర్థిక నిర్వహణ, సమాచార విధానం (ఐఎఫ్ఎంఐఎస్) వెబ్సైట్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. నిర్ణీత కాలపరిమితితో వీటిని పూర్తి చేస్తామని తెలిపింది. ఒకే శాఖ, ఒకే హోదా గల వారి మధ్యనే మ్యూచువల్ బదిలీలుంటాయని తెలిపింది. ‘‘ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు కూడా ఒకే యాజమాన్యం, ఒకే కేటగిరి, సబ్జెక్టు, మాధ్యమం చూస్తారు. బోధనేతర సిబ్బందికి సైతం జడ్పీ, ఎంపీ, ఇతర పాఠశాలల్లో పనిచేసే వారికి అదే జడ్పీ, ఎంపీ, ఇతర పాఠశాలల్లో వారితోనే పరస్పర బదిలీలుంటాయి.
ఇద్దరు దరఖాస్తు చేసుకుంటే వారు కొత్త జోనల్ విధానం కింద బదిలీ అయినవారు కావాలి. లేదా అందులో ఒక్కరైనా కొత్త విధానం కింద మారిన వారై ఉండాలి’’ అని సూచించింది. దీనికి అనుగుణంగా ప్రక్రియను నిర్వహించాలని అన్ని ప్రభుత్వ శాఖల ప్రత్యేక ప్రధాన, ముఖ్య కార్యదర్శులను సీఎస్ సోమేశ్కుమార్ ఆదేశించారు.
* బదిలీ జరిగే వారికి పాత సీనియారిటీ ఉండదు. వారు కొత్తగా చేరే చోట సీనియారిటీలో చివరగా ఉంటారు. ఉదాహరణకు కళ్యాణ్ బదిలీపై జనగామ నుంచి వరంగల్కు వెళితే... అప్పటికే అక్కడ సీనియారిటీలో చివరగా ఉన్న కార్తీక్ తర్వాత స్థానంలో ఉండాలి.
* ఉద్యోగుల వినతి మేరకు జరుగుతున్న ఈ ప్రక్రియలో పరస్పర బదిలీలు పొందిన వారికి ఎలాంటి టీఏ, డీఏ ఇవ్వరు.
* కోర్టు ఆదేశాల మేరకు కొనసాగుతున్న వారికి, సస్పెన్షన్లో ఉన్న వారికి, క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొంటున్న వారికి, దీర్ఘకాలికంగా అనధికారికంగా విధులకు హాజరు గానీ వారికి పరస్పర బదిలీలుండవు.
* ఒక కేడర్లో బదిలీ కోరుకునే ఉద్యోగి/అధికారి ఒక్కరితోనే అనుమతి తీసుకొని దరఖాస్తు చేసుకోవాలి. ఎక్కువ మంది లేఖలతో దరఖాస్తు చేసుకుంటే వాటిని అనుమతించరు.
* పరస్పర బదిలీలకు అంగీకార పత్రాలను ఆన్లైన్లో జత చేయాలి. వాటి ప్రతు (హార్డ్కాపీ)లను జిల్లా, జోనల్ శాఖాధిపతులకు అందజేయాలి. ఒకసారి దరఖాస్తు చేసిన తర్వాత మార్పులు, చేర్పులను అనుమతించరు. దరఖాస్తులో తప్పులుంటే వాటికి ఆ ఉద్యోగులే బాధ్యత వహించాలి.
* వచ్చిన దరఖాస్తులను శాఖాధిపతులు పరిశీలించి, బదిలీకి అనుమతిస్తూ తమ శాఖ కార్యదర్శికి ప్రతిపాదనలు పంపాలి. సాధారణ పరిపాలన శాఖ పరిశీలన అనంతరం బదిలీ ఉత్తర్వులు జారీ అవుతాయి.
* ఏ దరఖాస్తునైనా పరిపాలన పరమైన కారణాలతో తిరస్కరించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది.
బదిలీలు ఇలా...
* ఆంగ్లమాధ్యమ స్కూల్ అసిస్టెంటు (మ్యాథ్స్) అయిన మురళీకృష్ణ... మరో చోట ఆంగ్ల మాధ్యమంలో స్కూల్ అసిస్టెంటు (మ్యాథ్స్) పోస్టులో పనిచేసే వారితో మ్యూచువల్ బదిలీకి దరఖాస్తు చేసుకోవాలి. తెలుగు మాధ్యమంలోని ఎస్ఏ మ్యాథ్స్తో బదిలీ కుదరదు.
* రెవెన్యూ శాఖలో సీనియర్ అసిస్టెంటు అయిన మనోహర్ అదే శాఖలో తాను ఆశించిన జిల్లాలో సీనియర్ అసిస్టెంటుతో పరస్పర బదిలీకి అవకాశం ఉంటుంది. అదే శాఖలో జూనియర్ అసిస్టెంటుతో అవకాశం ఉండదు.
* వ్యవసాయ శాఖలో సూపరింటెండెంట్ అయిన ప్రతీక్కు అదే శాఖలో మరో సూపరింటెండెంట్తోనే పరస్పర బదిలీ జరుగుతుంది. పంచాయతీరాజ్ శాఖలో సూపరింటెండెంట్తో కుదరదు.
ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల కృతజ్ఞతలు
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు పరస్పర బదిలీలకు మార్గదర్శకాలు జారీ చేయడంతో టీజీవో, టీఎన్జీవో, పీఆర్టీయూటీఎస్ సంఘాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మమత, మామిళ్ల రాజేందర్, పింగిలి శ్రీపాల్రెడ్డి, సత్యనారాయణ, ప్రతాప్, బీరెల్లి కమలాకర్రావులు ముఖ్యమంత్రి కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేడు తెలంగాణ మంత్రి మండలి సమావేశం
రాష్ట్ర మంత్రి మండలి సమావేశం సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో జరగనుంది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. -
తిన్నోళ్లకు తిన్నంత అనారోగ్యం
పురుగులు పట్టిన, కాలం చెల్లిన ఆహార పదార్థాలు... కల్తీ మసాలాలు.. మళ్లీ మళ్లీ కాచి వాడుతున్న నూనెలు.. అపరిశుభ్రమైన వంటశాలలు.. రాష్ట్రంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, మండీలు, ఐస్క్రీం పార్లర్లు, కాఫీ షాప్లలో పరిస్థితి ఇది. -
ఆశతో పెట్టుబడి.. మోసాలకు పట్టుబడి
రూ.వెయ్యి పెడితే రూ.10 వేలు, రూ.లక్ష పెడితే రూ.10 లక్షల లాభం చూపిస్తామంటే ఎవరికైనా ఒకసారి ప్రయత్నిద్దామని ఆశ పుడుతుంది. -
మన వ్యాధుల భారంలో 56%.. తిండి వల్లే
మన జీవనశైలి, ఆహారపు అలవాట్లలో గణనీయ మార్పులు వస్తున్నాయి. ఇవి ఆరోగ్యంపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయి. -
దేశానికి తెలుగు ‘వెలుగు’లు
మీ ఇంట్లో కరెంటు వెలుగు రావాలన్నా, మీరు వినియోగించే అనేక ఉత్పత్తుల తయారీ పరిశ్రమలు నడవాలన్నా కావాల్సిన కీలక ఇంధనం బొగ్గు. -
‘నైరుతి’ ప్రయాణం మొదలైంది..
భారతదేశ వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు జీవనాడి అయిన నైరుతి రుతుపవనాలు ఆదివారం దేశంలోని నికోబార్ దీవులపైకి ప్రవేశించాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) తెలిపింది. -
మత్తు అనర్థాలపై అవగాహన: ఐఎంఏ
మత్తుపదార్థాలు, మాదకద్రవ్యాల వినియోగంతో కలిగే అనర్థాలపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్.. తెలంగాణ రాష్ట్ర మానసిక ఆరోగ్య కమిటీ ప్రకటించింది. -
తగ్గిన గనులశాఖ ఆదాయం
రాష్ట్రంలో గనుల శాఖకు 2023-24లో రూ.5,439.93 కోట్ల ఆదాయం సమకూరింది. ఇందులో సగానికిపైగా బొగ్గు ద్వారానే వచ్చింది. కాగా ఇసుక ఆదాయ లక్ష్యసాధనలో గనులశాఖ వెనుకబడింది. -
తడిసిన ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలి
రాష్ట్రంలో తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని తెలంగాణ రైతు సంక్షేమ సమితి అధ్యక్షుడు, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
రెండు, మూడు నెలల్లో… బీబీనగర్-గుంటూరు డబ్లింగ్ పనులు
తెలుగు రాష్ట్రాల మధ్య కీలకమైన బీబీనగర్-గుంటూరు రెండో లైన్ పనులు రెండు, మూడు నెలల్లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. -
జేఈఈ మెయిన్ పేపర్-2 ఫలితాలు విడుదల
బీఆర్క్, బీప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ పేపర్-2 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆదివారం విడుదల చేసింది. -
థింపూలో ఏబీటీవో కార్యాలయం ప్రారంభం
భూటాన్ రాజధాని థింపూలో అసోసియేషన్ ఆఫ్ బుద్ధిస్ట్ టూర్ ఆపరేటర్ల (ఏబీటీవో) కార్యాలయం ఆదివారం ప్రారంభమైంది. -
29, 30 తేదీల్లో వనదేవతల గద్దెలకు తాళాలు
మేడారంలోని వనదేవతలు సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని ఈ నెల 29, 30 తేదీల్లో మూసివేస్తున్నట్లు పూజారులు ప్రకటించారు. -
నేటి నుంచే ‘టెట్’
రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) సోమవారం ప్రారంభం కానుంది. జూన్ 2వరకు జరిగే ఈ పరీక్ష మొదటి పేపర్కు 99,958 మంది, రెండో పేపర్కు 1,86,428 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. -
నేటి నుంచి యాదాద్రీశుడి జయంతి ఉత్సవాలు
యాదాద్రి క్షేత్రంలో ఈ నెల 20 నుంచి 22 వరకు నారసింహుడి వార్షిక జయంతి మహోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. -
‘మత్తు’ నియంత్రణకు కదిలిన యంత్రాంగం
రాష్ట్రంలో నాటుసారాను మూడు నెలల్లో నిర్మూలించడంతోపాటు గంజాయిని నియంత్రించాలనే లక్ష్యంలో భాగంగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాచరణ ప్రారంభించింది. -
ఆర్ఆర్ఆర్ నిర్మాణంతో పట్టణ రాష్ట్రంగా తెలంగాణ
పెట్టుబడులకు హైదరాబాద్ స్వర్గధామమని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. అనుకూలమైన వాతావరణం, మంచి నీటి వసతి, నిరంతర విద్యుత్తు సరఫరా, శాంతిభద్రతలు, స్నేహపూర్వక ప్రభుత్వం కారణంగా హైదరాబాద్ ప్రపంచస్థాయి నగరంగా ఎదుగుతోందని చెప్పారు. -
వాతావరణ మార్పులతో ‘ఆర్థిక విధ్వంసం’
ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులతో ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోందని, ఊహించిన దానికన్నా ఆరు రెట్లు ఎక్కువగా విధ్వంసం ఉందని ఓ అంతర్జాతీయ అధ్యయనం వెల్లడించింది. -
ప్రమాదంలో భావప్రకటన స్వేచ్ఛ
దేశంలో భావప్రకటన స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులు ప్రమాదంలో పడ్డాయని ఒడిశా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డా.ఎస్.మురళీధర్ అన్నారు. -
ముంచుకొచ్చిన వానలు.. మొలకెత్తిన వడ్లు
ములుగు జిల్లా వెంకటాపూర్లోని కొనుగోలు కేంద్రంలో సన్న ధాన్యం ఆరబోయగా మొత్తం ఇలా మొలకెత్తాయి. జిల్లా రైతాంగాన్ని పది రోజులుగా అకాల వర్షాలు వెంటాడుతున్నాయి. -
ఆధార్ అనుసంధానం కాకున్నా..‘డెత్ క్లెయిమ్’లు పరిష్కరించండి
ఉద్యోగుల భవిష్యనిధి ఖాతాకు ఆధార్ నంబర్ అనుసంధానం కాకుండా చనిపోయిన చందాదారుల క్లెయిమ్లు పరిష్కరించేందుకు ఈపీఎఫ్వో వెసులుబాటు కల్పించింది.