ఆరు స్థానాలకు ఎన్నికలు
రాష్ట్రంలో శాసనమండలికి స్థానిక సంస్థల కోటాలో జరుగుతున్న 12 స్థానాల ఎన్నికల్లో ఆరుగురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరో ఆరు స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. శుక్రవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది.
ఆదిలాబాద్, మెదక్, నల్గొండ, ఖమ్మంతో పాటు కరీంనగర్లో రెండింటికి
స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆరు ఏకగ్రీవం
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో శాసనమండలికి స్థానిక సంస్థల కోటాలో జరుగుతున్న 12 స్థానాల ఎన్నికల్లో ఆరుగురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరో ఆరు స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. శుక్రవారం నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ విలేకరులతో మాట్లాడారు. ‘తొమ్మిది ఉమ్మడి జిల్లాల పరిధిలో 12 స్థానాలకు ఎన్నికల ప్రక్రియ చేపట్టాం. రంగారెడ్డి, మహబూబ్నగర్ జిల్లాల్లో రెండేసి స్థానాలు, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో ఒక్కో స్థానానికి సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
కరీంనగర్లో రెండు, ఆదిలాబాద్, ఖమ్మం, నల్గొండ, మెదక్ జిల్లాల్లో ఒక్కో స్థానానికి వచ్చే నెల పదో తేదీన పోలింగ్ జరుగుతుంది. ఈ ఆరు స్థానాలకు 26 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పోలింగ్ ఉంటుంది. మొత్తం 5,326 మంది ఓటర్లుండగా వారి కోసం 37 పోలింగు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. ఓట్ల లెక్కింపు 14న చేపడతాం. బ్యాలెట్ పత్రం ద్వారా పోలింగ్ జరుగుతుంది. ఓటర్లు ప్రాధాన్య క్రమంలో పోటీలో ఉన్న అభ్యర్థులకు ఓటు వేయాలి. ఏకగ్రీవమైన స్థానాలకు సంబంధించిన జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఎత్తివేశాం. హోటళ్లు, రిసార్టుల్లో ఓటర్లతో క్యాంపులు నిర్వహించటం నిబంధనలకు విరుద్ధం. ఈసీ రూపొందించిన కరోనా నిబంధనల మేరకు ఎన్నికల ప్రక్రియను నిర్వహిస్తాం’ అని డాక్టర్ శశాంక్ గోయల్ తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం నిజామాబాద్లో కల్వకుంట్ల కవిత, వరంగల్లో పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, రంగారెడ్డిలో శంభీపూర్రాజు, పట్నం మహేందర్రెడ్డి, మహబూబ్నగర్లో కూచికుళ్ల దామోదర్రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కేంద్ర ఎన్నికల సంఘం వారి ఫలితాలను ప్రకటించడంతో ఆయా జిల్లాల్లోని ఎన్నికల రిటర్నింగ్ అధికారులు విజేతలకు ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.
ఇక్కడ పోటీ అనివార్యం..
రెండు స్థానాలున్న కరీంనగర్లో 14 మంది నామినేషన్లను ఉపసంహరించుకోగా మరో 10 మంది బరిలో మిగిలారు. తెరాస అభ్యర్థులు భానుప్రసాద్రావు, ఎల్.రమణతో పాటు పార్టీకి రాజీనామా చేసిన రవీందర్ సింగ్, మరో ఏడుగురు పోటీలో ఉన్నారు. ఖమ్మంలో ఒక స్థానానికి తెరాస, కాంగ్రెస్ అభ్యర్థులు తాతా మధు, రాయల నాగేశ్వరరావులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు శ్రీనివాసరావు, సుధారాణి పోటీలో ఉన్నారు. మెదక్ జిల్లాలో తెరాస అభ్యర్థి యాదవరెడ్డి, కాంగ్రెస్ నుంచి నిర్మల, స్వతంత్ర అభ్యర్థి మల్లారెడ్డి పోటీలో నిలిచారు. నల్గొండలో తెరాస అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డితో పాటు మరో ఆరుగురు స్వతంత్రులు బరిలో ఉన్నారు.
ఆదిలాబాద్లో ఉద్రిక్తత
ఆదిలాబాద్లో నామినేషన్ల ఉపసంహరణ నాటకీయ పరిణామాల మధ్య తీవ్ర ఉత్కంఠకు, ఉద్రిక్తతకు దారి తీసింది. 22 మంది అభ్యర్థులు ఉపసంహరించుకోవడంతో తెరాస నుంచి దండె విఠల్, స్వతంత్ర అభ్యర్థిగా పెందూరు పుష్పరాణి పోటీలో ఉన్నారు. అంతకుముందు తుడుందెబ్బ ఆధ్వర్యంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన పెందూర్ పుష్పరాణి తరఫున సాయంత్రం 3 గంటలకు ఓ వ్యక్తి వచ్చి నామినేషన్ ఉపసంహరించుకుంటున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి సిక్తాపట్నాయక్కు తెలిపారు. కాగా పుష్పరాణిని ప్రతిపాదించిన పది మందిలో ఆయన పేరు లేకపోవడంతో అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏజెంట్గా వచ్చినట్లు ఆయన వివరించడంతో అభ్యర్థి పుష్పరాణితో మాట్లాడించాలని సూచించారు. సాయంత్రం 4 దాటినా ఎలాంటి సమాచారం రాలేదు. ఎన్నికల అధికారి నిర్ణయం కోసం మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు సహా అభ్యర్థి దండే విఠల్ కలెక్టరేట్ ఆవరణలోనే ఎదురుచూడాల్సి వచ్చింది. ఇదే సమయంలో భాజపాకు చెందిన కొంతమంది కలెక్టరేట్కు చేరుకొని నినాదాలు చేయడంతో తెరాస శ్రేణులు ప్రతినినాదాలు చేయడం, అనంతరం పుష్పరాణి సహా తుడుందెబ్బ శ్రేణులు వచ్చి బైఠాయించడంతో అక్కడ తోపులాట చోటుచేసుకుంది.
తెరాస శిబిరాలు
ఆరు స్థానాలకు ప్రాతినిధ్యం ఉన్న అయిదు ఉమ్మడి జిల్లాల్లో ఎన్నికలు జరగనుండడంతో ఆయా జిల్లాల్లో మెజారిటీ ఓట్లు ఉన్న తెరాస తమ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను ముందుజాగ్రత్తగా శిబిరాలకు తరలించినట్లు తెలిసింది. పోలింగ్ రోజైన డిసెంబరు పదో తేదీన వారు నేరుగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారని సమాచారం.
ఏపీలో 11 మంది ఎమ్మెల్సీలు ఏకగ్రీవం
ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని ఎనిమిది జిల్లాల పరిధిలోని 11 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో వైకాపా అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 11 మంది వైకాపా అభ్యర్థులు ఎన్నికైనట్లు ఆయా జిల్లాల ఎన్నికల రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. చిత్తూరు-కృష్ణ రాఘవ జయేంద్ర భరత్, అనంతపురం-ఎల్లారెడ్డిగారి శివరామిరెడ్డి, ప్రకాశం-తూమాటి మాధవరావు, గుంటూరు(2 స్థానాలు)- డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మురుగుడు హనుమంతరావు, కృష్ణా(2స్థానాలు)- తలశిల రఘురాం, మొండితోక అరుణ్కుమార్, తూర్పుగోదావరి-అనంత సత్య ఉదయ భాస్కర్, విశాఖపట్నం(2స్థానాలు)- వరుదు కళ్యాణి, చెన్నుబోయిన శ్రీనివాస్, విజయనగరం-ఇందుకూరి రఘురాజు ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విశాఖ తీరానికి విలాసవంతమైన నౌక
ప్రఖ్యాత అంతర్జాతీయ క్రూయిజ్ నౌక ‘ది వరల్డ్’ ఆదివారం విశాఖ పోర్టుకు చేరుకుంది. పోర్టు అధికారులు నౌకలో వచ్చిన వారికి ఘన స్వాగతం పలికారు. -
ఇదీ సంగతి!
ఎంత ఎండలైనా కండువాని అలా కప్పుకోకండి సార్! దివాలా తీశారు అనుకొంటారు!! -
జవహర్రెడ్డి జగన్నాటకం
ఒక ఎత్తు కాకపోతే మరో ఎత్తు. ఒక వ్యూహం కాకపోతే మరో వ్యూహం. ఏది అమలుచేసినా అంతిమంగా వైకాపాకు మేలు చేయడమే లక్ష్యం. -
సుందరనాయుడి సేవలు నిరుపమానం
అందరూ ఆప్యాయంగా చిత్తూరు పెద్దాయన అని పిలుచుకునే.. కోళ్ల పరిశ్రమ పితామహుడు దివంగత డాక్టర్ ఉప్పలపాటి సుందరనాయుడి సేవలు చిరస్మరణీయమని కోళ్ల రైతులు పేర్కొన్నారు. -
గురుదక్షిణగా కారు.. అందజేసిన లేపాక్షి నవోదయ పూర్వవిద్యార్థులు
జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేలా స్ఫూర్తి నింపిన గురువుకు శిష్యులు రూ.12లక్షల విలువైన కారును బహుమతిగా అందజేశారు. -
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
సాధారణంగా మనవళ్ల వివాహాలను తాత, నానమ్మలు దగ్గరుండి జరిపిస్తారు. ఇక్కడ మాత్రం తాత, నానమ్మల పెళ్లిని మనవళ్లందరూ కలిసి అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
అరగంట కరెంట్ నిలిపివేత నేపథ్యంలో హైదరాబాద్లోని హబ్సిగూడ సర్కిల్ కీసర డివిజనల్ ఇంజినీర్ (డీఈ) ఎల్.భాస్కర్రావును దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ శనివారం రాత్రి సస్పెండ్ చేశారు. -
తెలంగాణ భగభగ!
తీవ్రమైన ఎండలతో రాష్ట్రం మండిపోతోంది. అన్ని జిల్లాల్లో సాధారణం కన్నా దాదాపు ఐదు డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొద్ది రోజులుగా ప్రమాద హెచ్చరిక స్థాయి 45 డిగ్రీల మార్కును దాటి ఎండలు కాస్తున్నాయి. -
ఆర్టీసీ కార్మికులకు ఊరట
రుణపరపతి సహకార సంఘం(సీసీఎస్)లో దాచుకున్న పొదుపు సొమ్మును వెనక్కి తీసుకునేందుకు మూడున్నరేళ్లుగా ఎదురుచూస్తున్న వేలమంది ఆర్టీసీ కార్మికులకు త్వరలోనే ఊరట లభించనుంది. -
పెద్దపులులకు నీటి కష్టాలు!
మండు వేసవిలో తాగునీటి కోసం వన్యప్రాణులు అల్లాడుతున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతాల్లో వాగులు, చెరువులు, కుంటలు ఎండిపోవడంతో.. పెద్దపులులు సహా ఇతర జంతువులు నీళ్లు లభించే ప్రాంతాల్ని వెతుక్కుంటూ వలస పోతున్నాయి. -
రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు
రాజ్యాంగబద్ధత కలిగిన రిజర్వేషన్లకు తామెప్పుడూ వ్యతిరేకం కాదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. -
శంషాబాద్ విమానాశ్రయంలో చిరుత కలకలం
శంషాబాద్ విమానాశ్రయంలోకి ఆదివారం తెల్లవారుజామున చిరుత చొరబడింది. ఎయిర్పోర్టు దక్షిణ దిశలో ఉన్న ప్రహరీ పైనుంచి ఓ జంతువు దూకినట్లు కంట్రోల్ రూంకు సమాచారం అందటంతో కలకలం రేగింది. -
సాహస బాలుడు సాయిచరణ్కు ముఖ్యమంత్రి అభినందన
రంగారెడ్డి జిల్లా నందిగామలోని ఆలిన్ ఫార్మా పరిశ్రమలో ఈ నెల 26న జరిగిన అగ్నిప్రమాదం నుంచి ఐదుగురు కార్మికులను కాపాడటంలో భాగస్వామి అయిన సాహస బాలుడు ఎం.సాయిచరణ్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభినందించారు. -
వరి పొలంలో భారీ మొసలి పట్టివేత
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం భూత్కూర్లో భారీ మొసలి పట్టుబడింది. గ్రామానికి చెందిన రైతు శేఖర్కు ఆదివారం వరిపొలంలో మొసలి కనిపించింది. -
నేటి నుంచి కన్హ శాంతివనంలో బాబూజీ జయంతి ఉత్సవాలు
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హ శాంతివనంలోని అతిపెద్ద ధ్యాన మందిరంలో బాబూజీ మహరాజ్ 125వ జయంతి ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నట్లు శ్రీరామచంద్రమిషన్ పీఆర్వో చంద్రారెడ్డి ఆదివారం తెలిపారు. -
చిన్న జాగ్రత్తలతో పెద్ద ప్రమాదాన్ని ఆపగలం
చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఎంత పెద్ద ప్రమాదాన్నైనా ఆపగలమని కర్మాగారాలు, కార్మిక, ఉపాధి కల్పనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఐ.రాణి కుముదిని అన్నారు. -
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. కానిస్టేబుల్కు గాయాలు
వరంగల్ జిల్లా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లోని ఈవీఎం స్ట్రాంగ్ రూం వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఓ కానిస్టేబుల్ తుపాకీ ప్రమాదవశాత్తు(మిస్ఫైర్) పేలింది. -
సమస్యలపై ఐక్యంగా పోరాడాలి
దీర్ఘకాలంగా రాష్ట్రంలోని న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలు, డిమాండ్ల పరిష్కారానికి ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని హైకోర్టు బార్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. -
పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడిగా వెంకట్రెడ్డి
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) రాష్ట్ర అధ్యక్షుడిగా వెంకట్రెడ్డి (వరంగల్), ప్రధాన కార్యదర్శిగా సాంబ (కొత్తగూడెం) ఎన్నికయ్యారు. -
శ్రీవారిని కుటుంబసమేతంగా దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి
శ్రీవారిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇ.వి.వేణుగోపాల్ కుటుంబసమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. -
2047 కల్లా అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్
గడిచిన పదేళ్లలో ప్రధాని నరేంద్రమోదీ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా దేశాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని రాజస్థాన్ మంత్రి రాజ్యవర్ధన్సింగ్ రాఠోడ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరిన్ని వేసవి ప్రత్యేక రైళ్లు..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఇసుక అక్రమ తవ్వకాలు.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
-
4 రోజుల్లో 1800 కి.మీ పారిపోయినా.. పోలీసులకు చిక్కిన నటుడు..!
-
భాజపా సొంతంగా 370 సీట్లు సాధిస్తుంది: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
-
పొన్నూరులో రూ.2,500 కోట్లకు పైగా సహజ వనరుల దోపిడీ: తెదేపా మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల