‘మహా’ విద్యుల్లత
పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా రాజధాని నగరానికి నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేశంలోని 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలన్నింటికన్నా...
15 రాష్ట్రాల కన్నా హైదరాబాద్లోనే గరిష్ఠ విద్యుత్తు డిమాండ్
భారీగా పెరుగుతున్న జనావాసాలు
5 వేల మెగావాట్లకు అవసరమైన సరఫరా వ్యవస్థకు ఏర్పాట్లు
ఈనాడు - హైదరాబాద్
పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా రాజధాని నగరానికి నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేశంలోని 15 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలన్నింటికన్నా గ్రేటర్ హైదరాబాద్లో రోజూవారీ విద్యుత్తు డిమాండ్ ఎక్కువ ఉంటోంది. ఆ రాష్ట్రాల్లో ఒక్కోదానిలో ఒకరోజు వినియోగించే మొత్తం కరెంటుకన్నా ఇక్కడే అధికంగా ఉంటుండటం గమనార్హం. హైదరాబాద్లో గరిష్ఠ రోజూవారీ డిమాండ్ గత వేసవిలో 3,431 మెగావాట్లు నమోదైంది. ఇది వచ్చే వేసవికి 4,000 మెగావాట్లకు చేరుతుందని అంచనా వేస్తున్న విద్యుత్ సంస్థలు పంపిణీ, సరఫరా వ్యవస్థ మెరుగుపై దృష్టి పెట్టాయి. 5,000 మెగావాట్ల సరఫరాకు సరిపడేలా లైన్లు, ట్రాన్స్ఫార్మర్ల స్థాయిని పెంచుతున్నాయి. ఏటా సాధారణంగా 7 నుంచి 8 శాతం వరకూ విద్యుత్ డిమాండ్ పెరుగుతుంటుంది. కానీ గ్రేటర్ పరిధిలోని కొన్ని సర్కిళ్లలో గరిష్ఠ డిమాండ్ ఏడాదిలోనే 10 నుంచి 20 శాతం పెరుగుతోంది. దీన్ని తట్టుకునేలా సరఫరా, పంపిణీ వ్యవస్థలను మెరుగుపరచడానికి రూ.వందల కోట్లు ఖర్చుపెడుతున్నారు. ఐటీ కారిడార్లో డిమాండ్ను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్ అవసరాలను తీర్చేందుకు ప్రత్యేకంగా రాయదుర్గంలో రూ.1200 కోట్లతో 400 కేవీ సబ్స్టేషన్ను నిర్మిస్తున్నారు. ఇప్పటికే నగరం చుట్టూ ఇలాంటి 400 కేవీ స్థాయి సబ్స్టేషన్లు 6 నిర్మించారు. బౌరంపేట, చంచల్గూడ ప్రాంతాల్లో 132 కేవీ సబ్స్టేషన్లను అదనంగా ఏర్పాటు చేస్తున్నారు.
జనావాసాలు, ఆకాశహర్మ్యాలు పెరగడమే కారణం
గ్రేటర్ చుట్టూ వెలుస్తున్న కాలనీలు, ఆకాశహర్మ్యాలు, పరిశ్రమల వల్ల గరిష్ఠ డిమాండ్ ఏటా భారీగా పెరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఏకంగా 30 నుంచి 50 అంతస్తులతో నిర్మిస్తున్న అపార్టుమెంట్లకు వందల మెగావాట్ల సామర్థ్యం గల విద్యుత్ సరఫరా వ్యవస్థలను కొత్తగా ఏర్పాటుచేయాల్సి వస్తోంది. పది, పదిహేనేళ్ల క్రితం 400 నుంచి 1000 గజాల స్థలంలో ఇల్లో, ఇళ్ల సముదాయాల్లో నిర్మించుకున్న పలు కుటుంబాలు ఇప్పుడు మరింత ఆదాయం కోసం ఆ స్థలాల్లో అపార్టుమెంట్ల నిర్మాణానికి అంగీకరిస్తున్నాయి. ఉదాహరణకు నగర శివారులో 400 గజాల చొప్పున రెండు స్థలాల్లో పక్కపక్కనే ఇళ్లు ఉండగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాటి యజమానులను ఒప్పించి వాటిని కూలగట్టి 40 ఫ్లాట్లలో భారీ అపార్టుమెంటు కట్టారు. అంతకుముందు అక్కడ ఉన్న రెండు ఇళ్లకు కలిపి నెలకు 1000 యూనిట్లకు మించి కరెంటు వినియోగం ఉండేది కాదు. కానీ ఇప్పుడు 40 ఫ్లాట్లు రావడంతో నెలవారీ వినియోగం 20,000 యూనిట్లు దాటింది. ఆ స్థాయిలో సరఫరాకు ఆ ప్రాంత విద్యుత్లైన్లు, ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యం పెంచాల్సి వచ్చింది. ఇలాగే కోకాపేటలో ఇటీవల ప్రభుత్వం భూములు వేలం వేసింది. ఒక్కో స్థలం 2 నుంచి 5 ఎకరాల దాకా ఉన్నందున అక్కడ భారీ ఆకాశహర్మ్యాలు, భవనాలు వస్తాయనే ఉద్దేశంతో అక్కడ 400 కేవీ సబ్స్టేషన్ ఏర్పాటుకు 5 ఎకరాల స్థలం కేటాయించింది. ప్రధానంగా ఐటీ పరిశ్రమలు ఎక్కువగా ఉన్న గచ్చిబౌలితో పాటు సైబరాబాద్ సహా దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పేకేరు సర్పంచికి అరుదైన గౌరవం
పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం పేకేరు గ్రామ సర్పంచి కునుకు హేమకుమారికి అరుదైన గౌరవం దక్కింది. -
ఐసీయూలో పనిచేయని ఏసీలు
కరీంనగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని అత్యంత కీలక విభాగమైన ఐసీయూలో ఏసీలు పని చేయడంలేదు. గత కొన్ని రోజులుగా పని చేయకున్నా అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారు. రెండు ఐసీయూ వార్డులో కలిపి మొత్తం ఆరు ఏసీలున్నాయి. -
గడువిస్తే అధికారులు నిద్రపోతారు
ఆంధ్రప్రదేశ్లో ఇసుక అక్రమ తవ్వకాల నియంత్రణకు 2023 మార్చి 23న జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) ఇచ్చిన తీర్పులోని అంశాలను క్షేత్రస్థాయిలో ఎంత మేరకు అమలు చేశారన్న దానిపై కేంద్ర పర్యావరణ, అటవీశాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జైప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థలు మే 9వ తేదీలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
65 ఏళ్లు నిండిన అంగన్వాడీ సిబ్బందికి విశ్రాంతి
అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లు, సహాయకులకు పదవీ విరమణ వయసును 65 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సంబంధిత వివరాలు ఏప్రిల్ 30 నాటికి పంపించాలని మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ కాంతివెస్లీ సోమవారం ఆదేశాలు జారీచేశారు. -
955 టీఎంసీలు అవసరం
కృష్ణా జలాల్లో తమ అవసరాలు 2,099 టీఎంసీలుగా రెండు తెలుగు రాష్ట్రాలు బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్కు నివేదించాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ తమ అవసరం 1,144 టీఎంసీలుగా పేర్కొనగా, తెలంగాణ 954.9గా తెలిపింది. -
పకడ్బందీగా టీఎస్ఈఏపీసెట్
రాష్ట్రంలోని ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశానికి జేఎన్టీయూహెచ్ ఆధ్వర్యంలో ఈఏపీసెట్-2024 పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి తెలిపారు. -
40 శాతం ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటించి అమలు చేయాలి
తెలంగాణలో పని చేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు 2023 జులై ఒకటి నుంచి రావాల్సిన 2వ పీఆర్సీ 40 శాతం ఫిట్మెంట్తో వెంటనే ప్రకటించి అమలు చేయాలని తెలంగాణ యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్(టీయూఎంహెచ్ఈయూ) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. -
వివేకా హత్యలో సునీల్
మాజీమంత్రి వివేకా హత్యలో సునీల్ యాదవ్ పాల్గొన్నట్లు అన్ని ఆధారాలు ఉన్నాయని సీబీఐ సోమవారం తెలంగాణ హైకోర్టుకు నివేదించింది. -
ఓయూలో నీటి కొరత.. విద్యుత్తు కోతలు!
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నీటికొరత.. విద్యుత్తు కోతల అంశం వివాదంగా మారింది. ఈ రెండింటి కారణంగా మే 1 నుంచి విద్యార్థుల వసతి గృహాలను మూసేస్తామంటూ చీఫ్ వార్డెన్ కొమరెల్లి శ్రీనివాస్ మార్చి 18న జారీ చేసిన ఉత్తర్వు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ ఉత్తర్వును ఎక్స్లో పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా రాజకీయ దుమారం రేగింది. -
తెలుగు వర్సిటీ సాహితీ పురస్కారాల ప్రకటన
తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో ఉత్తమ గ్రంథాలకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2022 ఏడాదికి గాను సాహితీ పురస్కారాలను ప్రకటించింది. -
‘మృత్యు’ ప్రయాణం!
సెలవులు...శుభకార్యాలు. వెరసి వేసవికాలంలో..ముఖ్యంగా మే నెలలో అత్యధికంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. జాతీయ రహదారులు, హైవేల మంత్రిత్వశాఖ నివేదిక ప్రకారం 2022 సంవత్సరంలో అత్యధికంగా మే నెలలోనే రోడ్డు ప్రమాదాలు, మరణాలు నమోదయ్యాయి. -
భానుడు.. భీకరం
రాష్ట్రంలో మంగళవారం నుంచి వచ్చే నెల 3 వరకు ఎండలు కొనసాగుతాయని, పలు జిల్లాలకు వడగాలుల ముప్పు పొంచి ఉందని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రధానంగా ఉమ్మడి కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, నల్గొండ, మహబూబ్నగర్, ఖమ్మం జిల్లాల్లో వడగాలులు వీస్తాయని సూచించింది. -
రాజకీయ వేడి నడుమ సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రశాంతత
‘ఓ వైపు మండుతున్న ఎండలు.. మరో వైపు రాజకీయ వేడి.. ఇలాంటి పరిస్థితుల్లో మాలాంటి వారికి సాంస్కృతిక కార్యక్రమాలు మానసిక ప్రశాంతతను, సాంత్వన చేకూరుస్తాయి’ అని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అన్నారు. -
కన్హా శాంతివనంలో బాబూజీ మహరాజ్ 125వ జయంతి వేడుకలు
రామచంద్ర మిషన్ వ్యవస్థాపకులు, ఆధ్యాత్మిక గురువు బాబూజీ మహరాజ్ 125వ జయంతి వేడుకలు సోమవారం హైదరాబాద్ సమీపంలోని ప్రపంచ ఆధ్యాత్మిక శాంతి కేంద్రం కన్హా శాంతివనంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. -
ఇంకా చిక్కని చిరుత
ఎయిర్పోర్ట్ రన్వే మైదానంలో ప్రహరీ దూకిన చిరుతను బంధించడానికి అటవీ శాఖ, విమానాశ్రయంలో భద్రతాధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సోమవారం అదనంగా మరో బోనును ఏర్పాటు చేసి, అనుమానిత ప్రాంతాల్లో 10 ట్రాప్ కెమెరాలను బిగించారు. -
తాండూరు కందులకు రికార్డు ధర
వికారాబాద్ జిల్లా తాండూరు వ్యవసాయ మార్కెట్లో సోమవారం క్వింటాలు నాణ్యమైన కందులకు గరిష్ఠంగా రూ.12,705 ధర వచ్చింది. మార్కెట్ చరిత్రలో రికార్డు ధరగా నమోదైందని వ్యవసాయ మార్కెట్ పర్యవేక్షకులు హబీబ్ తెలిపారు. -
కేయూలో దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవాలి
కాకతీయ విశ్వవిద్యాలయంలో సమూహ సెక్యులర్ రైటర్స్ ఫోరం సభ్యులపై దాడికి పాల్పడ్డ ఏబీవీపీ, బజరంగ్దళ్ ప్రతినిధులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆ ఫోరం సభ్యులు డిమాండ్ చేశారు. -
మే 24న పాలిసెట్
పాలిటెక్నిక్ ప్రవేశాల్లో భాగంగా ‘పాలిసెట్’ మే 24న నిర్వహించనున్నట్లు హైదరాబాద్ జిల్లా సమన్వయాధికారిణి, మాసబ్ట్యాంక్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డా.ఎన్.రాజేశ్వరీదేవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
‘టెయిల్పాండ్’ నీటి తరలింపుపై వివరణ ఇవ్వండి
తమ అనుమతి లేకుండా నాగార్జునసాగర్ దిగువన ఉన్న టెయిల్పాండ్ నుంచి నీటిని తరలించడంపై వివరణ ఇవ్వాలంటూ కృష్ణా బోర్డు ఏపీ నీటి పారుదల శాఖకు తాజాగా లేఖ రాసింది. -
రాధాకిషన్రావు బెయిల్ పిటిషన్పై విచారణ నేటికి వాయిదా
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్టయిన మాజీ డీసీపీ రాధాకిషన్రావు బెయిల్ పిటిషన్పై విచారణను నాంపల్లి కోర్టు ఏప్రిల్ 30కి వాయిదా వేసింది. బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన అనంతరం పోలీసులు కౌంటర్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. -
ఎక్సైజ్ అధికారుల బదిలీ వ్యవహారంలో జోక్యం చేసుకోలేం హైకోర్టు
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపునిస్తూ ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయంపై ఈ దశలో జోక్యం చేసుకోలేమంటూ హైకోర్టు స్పష్టం చేసింది.