నేటి నుంచే సభా సమరం
పార్లమెంటు వేదికగా అధికార, విపక్ష పార్టీల మధ్య రసవత్తర పోరాటానికి రంగం సిద్ధమైంది! శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ), పెగాసస్,
పార్లమెంటు శీతాకాల సమావేశాలు
మద్దతుధర, నిరుద్యోగంపై విపక్షాల వ్యూహాలు
దీటుగా తిప్పికొట్టేందుకు ప్రభుత్వ సన్నాహాలు
టీజర్ను తలపించిన అఖిలపక్ష భేటీ
దిల్లీ: పార్లమెంటు వేదికగా అధికార, విపక్ష పార్టీల మధ్య రసవత్తర పోరాటానికి రంగం సిద్ధమైంది! శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ), పెగాసస్, చైనా చొరబాట్లు, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, చమురు ధరల పెరుగుదల వంటి అంశాలను లేవనెత్తడం ద్వారా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రతిపక్షాలు వ్యూహాలు సిద్ధం చేస్తుండగా.. వాటిని సమర్థంగా తిప్పికొట్టడమే లక్ష్యంగా పాలకపక్షం ప్రతివ్యూహాలు రచిస్తోంది. వివాదాస్పద వ్యవసాయ చట్టాల రద్దుకు ఉద్దేశించిన బిల్లు.. సమావేశాల తొలిరోజే లోక్సభకు రానుంది. సోమవారం తప్పనిసరిగా పార్లమెంటుకు హాజరుకావాలంటూ అధికార భాజపా, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ తమ ఎంపీలకు విప్ జారీచేశాయి. మరోవైపు- శీతాకాల సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో ఆదివారం నిర్వహించిన అఖిలపక్ష భేటీ వాడీవేడీగా సాగింది. ఈ సమావేశానికి ప్రధాని మోదీ హాజరు కాకపోవడంపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. దేశంలో రైతుల దుస్థితికి సంబంధించి ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకోవాలని కాంగ్రెస్ యోచిస్తోంది. ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించాలని తాజా సమావేశాల్లో ఆ పార్టీ ప్రధానంగా డిమాండ్ చేయనుంది. వ్యవసాయ చట్టాల రద్దుకు సంబంధించిన బిల్లును లోక్సభలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ ప్రవేశపెట్టనున్నారు. వచ్చేనెల 23 వరకు శీతాకాల సమావేశాలు కొనసాగనున్నాయి.
కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నేతృత్వంలో అఖిలపక్ష భేటీ
* ప్రభుత్వం ఆదివారం నిర్వహించిన అఖిలపక్ష భేటీ.. శీతాకాల సమావేశాలకు టీజర్లా కనిపించింది! ఎంఎస్పీపై చట్టం తీసుకురావాలని, పెగాసస్ గూఢచర్యం, ఇంధన ధరల పెరుగుదల, నిరుద్యోగం తదితర అంశాలపై పార్లమెంటులో చర్చ చేపట్టాలని, సాగుచట్టాలపై నిరసనల సమయంలో మృత్యువాతపడ్డ రైతులకు నష్టపరిహారం చెల్లించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. భేటీకి ప్రధాని గైర్హాజరవడంపై రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే పెదవి విరిచారు. సాగుచట్టాలను ప్రభుత్వం ప్రస్తుతానికి రద్దుచేసి మరేదైనా రూపంలో తీసుకొస్తుందేమోనని ఆందోళన వ్యక్తంచేశారు. అఖిలపక్ష భేటీకి ప్రధాని హాజరయ్యే సంప్రదాయమేదీ లేదని పార్లమెంటరీ వ్యవహారాలమంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టాలని తృణమూల్ కాంగ్రెస్, వైకాపా, డీఎంకే తదితర పార్టీలు డిమాండ్ చేశాయి.
* పార్లమెంటు కార్యకలాపాల కవరేజీకి సంబంధించి కొవిడ్ నేపథ్యంలో మీడియాపై విధించిన ఆంక్షలను సడలించాలని, డిప్యూటీ స్పీకర్ నియామకం చేపట్టాలని లోక్సభలో కాంగ్రెస్ పక్షనేత అధీర్రంజన్ చౌధరీ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు.
* శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్షాల విమర్శలను దీటుగా తిప్పికొట్టేందుకు సన్నద్ధమై రావాలని తమ ఎంపీలకు ఆదివారం భాజపా పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పార్టీ సీనియర్ నేతలు పిలుపునిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆర్ఆర్ఆర్ నిర్మాణంతో పట్టణ రాష్ట్రంగా తెలంగాణ
పెట్టుబడులకు హైదరాబాద్ స్వర్గధామమని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. అనుకూలమైన వాతావరణం, మంచి నీటి వసతి, నిరంతర విద్యుత్తు సరఫరా, శాంతిభద్రతలు, స్నేహపూర్వక ప్రభుత్వం కారణంగా హైదరాబాద్ ప్రపంచస్థాయి నగరంగా ఎదుగుతోందని చెప్పారు. -
‘నైరుతి’ ప్రయాణం మొదలైంది..
భారతదేశ వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు జీవనాడి అయిన నైరుతి రుతుపవనాలు ఆదివారం దేశంలోని నికోబార్ దీవులపైకి ప్రవేశించాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) తెలిపింది. -
నేడు తెలంగాణ మంత్రి మండలి సమావేశం
రాష్ట్ర మంత్రి మండలి సమావేశం సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో జరగనుంది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. -
తిన్నోళ్లకు తిన్నంత అనారోగ్యం
పురుగులు పట్టిన, కాలం చెల్లిన ఆహార పదార్థాలు... కల్తీ మసాలాలు.. మళ్లీ మళ్లీ కాచి వాడుతున్న నూనెలు.. అపరిశుభ్రమైన వంటశాలలు.. రాష్ట్రంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, మండీలు, ఐస్క్రీం పార్లర్లు, కాఫీ షాప్లలో పరిస్థితి ఇది. -
ఆశతో పెట్టుబడి.. మోసాలకు పట్టుబడి
రూ.వెయ్యి పెడితే రూ.10 వేలు, రూ.లక్ష పెడితే రూ.10 లక్షల లాభం చూపిస్తామంటే ఎవరికైనా ఒకసారి ప్రయత్నిద్దామని ఆశ పుడుతుంది. -
మన వ్యాధుల భారంలో 56%.. తిండి వల్లే
మన జీవనశైలి, ఆహారపు అలవాట్లలో గణనీయ మార్పులు వస్తున్నాయి. ఇవి ఆరోగ్యంపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయి. -
దేశానికి తెలుగు ‘వెలుగు’లు
మీ ఇంట్లో కరెంటు వెలుగు రావాలన్నా, మీరు వినియోగించే అనేక ఉత్పత్తుల తయారీ పరిశ్రమలు నడవాలన్నా కావాల్సిన కీలక ఇంధనం బొగ్గు. -
మత్తు అనర్థాలపై అవగాహన: ఐఎంఏ
మత్తుపదార్థాలు, మాదకద్రవ్యాల వినియోగంతో కలిగే అనర్థాలపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్.. తెలంగాణ రాష్ట్ర మానసిక ఆరోగ్య కమిటీ ప్రకటించింది. -
తగ్గిన గనులశాఖ ఆదాయం
రాష్ట్రంలో గనుల శాఖకు 2023-24లో రూ.5,439.93 కోట్ల ఆదాయం సమకూరింది. ఇందులో సగానికిపైగా బొగ్గు ద్వారానే వచ్చింది. కాగా ఇసుక ఆదాయ లక్ష్యసాధనలో గనులశాఖ వెనుకబడింది. -
తడిసిన ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలి
రాష్ట్రంలో తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని తెలంగాణ రైతు సంక్షేమ సమితి అధ్యక్షుడు, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
రెండు, మూడు నెలల్లో… బీబీనగర్-గుంటూరు డబ్లింగ్ పనులు
తెలుగు రాష్ట్రాల మధ్య కీలకమైన బీబీనగర్-గుంటూరు రెండో లైన్ పనులు రెండు, మూడు నెలల్లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. -
జేఈఈ మెయిన్ పేపర్-2 ఫలితాలు విడుదల
బీఆర్క్, బీప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ పేపర్-2 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఆదివారం విడుదల చేసింది. -
థింపూలో ఏబీటీవో కార్యాలయం ప్రారంభం
భూటాన్ రాజధాని థింపూలో అసోసియేషన్ ఆఫ్ బుద్ధిస్ట్ టూర్ ఆపరేటర్ల (ఏబీటీవో) కార్యాలయం ఆదివారం ప్రారంభమైంది. -
29, 30 తేదీల్లో వనదేవతల గద్దెలకు తాళాలు
మేడారంలోని వనదేవతలు సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని ఈ నెల 29, 30 తేదీల్లో మూసివేస్తున్నట్లు పూజారులు ప్రకటించారు. -
నేటి నుంచే ‘టెట్’
రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) సోమవారం ప్రారంభం కానుంది. జూన్ 2వరకు జరిగే ఈ పరీక్ష మొదటి పేపర్కు 99,958 మంది, రెండో పేపర్కు 1,86,428 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. -
నేటి నుంచి యాదాద్రీశుడి జయంతి ఉత్సవాలు
యాదాద్రి క్షేత్రంలో ఈ నెల 20 నుంచి 22 వరకు నారసింహుడి వార్షిక జయంతి మహోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. -
‘మత్తు’ నియంత్రణకు కదిలిన యంత్రాంగం
రాష్ట్రంలో నాటుసారాను మూడు నెలల్లో నిర్మూలించడంతోపాటు గంజాయిని నియంత్రించాలనే లక్ష్యంలో భాగంగా ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ కార్యాచరణ ప్రారంభించింది. -
వాతావరణ మార్పులతో ‘ఆర్థిక విధ్వంసం’
ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులతో ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతోందని, ఊహించిన దానికన్నా ఆరు రెట్లు ఎక్కువగా విధ్వంసం ఉందని ఓ అంతర్జాతీయ అధ్యయనం వెల్లడించింది. -
ప్రమాదంలో భావప్రకటన స్వేచ్ఛ
దేశంలో భావప్రకటన స్వేచ్ఛ, ప్రాథమిక హక్కులు ప్రమాదంలో పడ్డాయని ఒడిశా హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డా.ఎస్.మురళీధర్ అన్నారు. -
ముంచుకొచ్చిన వానలు.. మొలకెత్తిన వడ్లు
ములుగు జిల్లా వెంకటాపూర్లోని కొనుగోలు కేంద్రంలో సన్న ధాన్యం ఆరబోయగా మొత్తం ఇలా మొలకెత్తాయి. జిల్లా రైతాంగాన్ని పది రోజులుగా అకాల వర్షాలు వెంటాడుతున్నాయి. -
ఆధార్ అనుసంధానం కాకున్నా..‘డెత్ క్లెయిమ్’లు పరిష్కరించండి
ఉద్యోగుల భవిష్యనిధి ఖాతాకు ఆధార్ నంబర్ అనుసంధానం కాకుండా చనిపోయిన చందాదారుల క్లెయిమ్లు పరిష్కరించేందుకు ఈపీఎఫ్వో వెసులుబాటు కల్పించింది.
తాజా వార్తలు (Latest News)
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
-
ఆప్ రూ.7.08 కోట్ల విదేశీ నిధులను సేకరించింది: ఈడీ
-
బ్యాలెన్స్ రూ.6 లక్షలు ఇస్తామన్నా పాయల్ రాజ్పుత్ రాలేదు.. : నిర్మాతల మండలి
-
‘దాని తర్వాతే ధోనీ రిటైర్మెంట్పై నిర్ణయం తీసుకుంటాడు’
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
మరో హామీని తుంగలో తొక్కారు.. కాంగ్రెస్ సర్కార్పై హరీశ్రావు విమర్శ