వారసత్వ బదిలీ.. వివాదాలుగా మారి
‘నేను కొన్న భూమిని నా కుమారుడి పేరిట రిజిస్ట్రేషన్ చేశాను. అతను ఆకస్మికంగా మరణించాడు. ఆ భూమిని కోడలి పేరుపై వారసత్వ బదిలీ చేశారు. కుటుంబంలో భాగపంపిణీ జరగనేలేదు. నేను ఉండగా ఏకపక్షంగా ఎలా చేస్తారు. నాకు నోటీసైనా
రిజిస్ట్రేషన్ తరువాత అడ్డు చెబుతున్న కుటుంబ సభ్యులు
స్లాటు నమోదైతే ఆపలేమంటున్న అధికారులు
చట్టం అమలులో స్పష్టత లేకపోవడమే కారణం
ఈనాడు, హైదరాబాద్
‘నేను కొన్న భూమిని నా కుమారుడి పేరిట రిజిస్ట్రేషన్ చేశాను. అతను ఆకస్మికంగా మరణించాడు. ఆ భూమిని కోడలి పేరుపై వారసత్వ బదిలీ చేశారు. కుటుంబంలో భాగపంపిణీ జరగనేలేదు. నేను ఉండగా ఏకపక్షంగా ఎలా చేస్తారు. నాకు నోటీసైనా ఇవ్వలేదు. ఇది అన్యాయం’ అంటూ ఓ పెద్దావిడ ఉమ్మడి నల్గొండ జిల్లాలో న్యాయ పోరాటానికి దిగారు. ఇలా కుటుంబ సభ్యులందరి ఆమోదం లేకుండానే వారసత్వ బదిలీ చేశారంటూ పలు జిల్లాల్లో జరిగిన లావాదేవీలకు సంబంధించి ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వస్తున్నాయి. భూముల వారసత్వ బదిలీ ప్రక్రియలో స్పష్టత లేకపోవడం గందరగోళానికి తావిస్తోంది. ధరణి పోర్టల్ ఆధారంగా ఆటోమేటిక్ విధానంలో వారసత్వ బదిలీ (సక్సెషన్) పూర్తి చేసి రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేస్తున్న తీరుపై పలు విమర్శలు వస్తున్నాయి. కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయకుండా ఆన్లైన్లో ఉన్న సమాచారం ఆధారంగా ధరణిలో సులువుగా, ఆటోమేటిక్ విధానంలో రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల సేవలు పూర్తిచేస్తున్న తీరు బాగున్నా.. అదే తీరును వారసత్వ బదిలీలో అమలు చేయడంపైనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
అమలుకాని ముఖ్యమంత్రి ఆదేశాలు
వారసత్వ బదిలీ హక్కుల విషయంలో గందరగోళం నెలకొంటున్న నేపథ్యంలో ప్రభుత్వం నూతన విధానాన్ని అమలులోకి తెస్తుందని గతేడాది ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ప్రభుత్వం జారీ చేసే పాసుపుస్తకాల్లో ముందుగానే కుటుంబ సభ్యుల పేర్లను నమోదు చేస్తారని, తద్వారా వారసత్వ వివాదాలు ఉండవని సూచించారు. సీఎం నిర్ణయంపై హర్షం వ్యక్తమైనప్పటికీ రెవెన్యూశాఖ అమల్లోకి తేలేదు. పోర్టల్ అమల్లోకి వచ్చి ఏడాది దాటినా దీనిపై ఒక నిర్ణయం తీసుకోలేదు. దీంతో వారసత్వంపై అభ్యంతరాలు ఉన్నచోట వివాదాలు వస్తూనే ఉన్నాయి. వారసత్వ బదిలీ ప్రక్రియ పూర్తి చేయాలంటే రెవెన్యూ అధికారులకు క్షేత్రస్థాయి విచారణ అధికారం కల్పించాలని, లేనిపక్షంలో కుటుంబ ధ్రువీకరణ పత్రం(ఫ్యామిలీ సర్టిఫికెట్) తప్పనిసరి చేయడమనే నిబంధనను జోడించాలంటూ రెవెన్యూ సంఘం ప్రభుత్వాన్ని కోరుతోంది.
గతంలో ఇలా...
గతంలో భూయజమాని తదనంతరం వారసత్వ బదిలీకి క్షేత్రస్థాయి విచారణ ఉండేది. యజమాని కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేసేవారు. పది రోజుల వ్యవధిలో నోటీసులకు వచ్చిన వివరణ, క్షేత్రస్థాయి అధికారుల విచారణ నివేదిక ఆధారంగా తహసీల్దారు వారసులెవరనేది తేల్చి... రెవెన్యూ రికార్డుల్లో యాజమాన్య హక్కులు బదలాయించేవారు. గతేడాది నుంచి అమల్లోకి వచ్చిన కొత్త రెవెన్యూ చట్టం అనంతరం ఈ విచారణ చేపట్టడం లేదు. పైగా స్లాటు నమోదై తహసీల్దారు-సంయుక్త సబ్ రిజిస్ట్రారు వద్దకు వస్తే అడ్డుచెప్పకుండానే రిజిస్ట్రేషన్ చేయాలని చట్టం సూచిస్తోంది. దీంతో తహసీల్దార్లు వారసత్వ బదిలీని పూర్తి చేసేస్తున్నారు.
ఏడు రోజుల వ్యవధి ఎందుకో?
ధరణి పోర్టల్లో నిర్వహిస్తున్న వారసత్వ బదిలీ ప్రక్రియపై రెవెన్యూ అధికారుల్లోనూ స్పష్టత కొరవడింది. భూయజమానులు మీసేవలో లాగిన్ అయ్యాక.. 7 రోజులకు స్లాట్ నమోదు జరుగుతోంది. తరువాత తహసీల్దారు-సంయుక్త సబ్ రిజిస్ట్రారు వద్దకు వెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారు. మిగిలిన సేవలు ఒకట్రెండు రోజుల్లోనే పూర్తవుతున్నాయి. వారసత్వ బదిలీకి సంబంధించి భూయజమాని లాగిన్ అయినదీ, స్లాట్ నమోదు చేసుకున్నదీ తహసీల్దారు వద్దకు చేరేదాకా వారికి ఏ సమాచారం ఉండటంలేదు. ధరణి పోర్టల్ అమలు తర్వాత కూడా మార్గదర్శకాలు విడుదల కాకపోవడంతో.. దీనిలో స్పష్టత కొరవడిందని కొందరు అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ధరణి సేవల అమలు మినహా తహసీల్దార్లకు అధికారాలేవీ లేవు. గతేడాది పాత ఆర్ఓఆర్ చట్టం రద్దు చేశాక క్షేత్రస్థాయి విచారణ అధికారాలన్నీ రద్దయ్యాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు త్వరలో చట్టం
రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో రుసుముల నియంత్రణకు 3-4 నెలల్లో కొత్త చట్టం తెచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
‘గోవిందకోటి’ పూర్తిచేసిన కర్ణాటక విద్యార్థిని
కర్ణాటకలోని బెంగళూరులో ఇంటర్ చదువుతున్న కీర్తన 10,01,116 సార్లు గోవింద నామాలు రాసి తితిదే ‘గోవిందకోటి’ పథకం కింద మొట్టమొదటిసారిగా వీఐపీ బ్రేక్ దర్శనం పొందారు. -
వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ జగన్, భారతి వరకు వచ్చి ఎందుకు ఆగింది?
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీఎం జగన్, ఆయన సతీమణి భారతిరెడ్డిని సీబీఐ ఎందుకు విచారించలేదని వివేకా కుమార్తె సునీత ప్రశ్నించారు. -
పదిలో 91.31% ఉత్తీర్ణత
పదో తరగతి ఫలితాల్లో రాష్ట్ర విద్యార్థులు సత్తాచాటారు. 4,94,207 మంది రెగ్యులర్గా పరీక్ష రాయగా 4,51,272 మంది (91.31%) ఉత్తీర్ణత సాధించారు. -
హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ శ్రీనివాస్రావు, జస్టిస్ రాజేశ్వర్రావుల ప్రమాణం
తెలంగాణ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ జగ్గన్నగారి శ్రీనివాస్రావు, జస్టిస్ నామవరపు రాజేశ్వర్రావులు మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేశారు. -
అనర్హత పిటిషన్లు స్పీకర్ కార్యాలయానికి అందజేత
స్టేషన్ ఘన్పూర్, భద్రాచలం ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు భారాస నుంచి ఎన్నికై పార్టీ ఫిరాయించారని వారిపై అనర్హత వేటు వేయాలన్న కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ పిటిషన్లను స్పీకర్ కార్యాలయానికి అందజేసినట్లు అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్రెడ్డి హైకోర్టుకు నివేదించారు. -
50 మంది రచయిత్రులకు ‘మాతృవందనం’ పురస్కారాలు
హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, సీతాస్ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త నిర్వహణలో మంగళవారం వర్సిటీలోని ఎన్టీఆర్ కళామందిరంలో ‘మాతృవందనం’ (షష్టిపూర్తి కలాలకు సత్కారం) కార్యక్రమాన్ని నిర్వహించారు. -
జగన్ అక్రమాస్తుల కేసులు మళ్లీ మొదటికి
ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల కేసులపై విచారణ మళ్లీ మొదటికి వచ్చింది. నిందితులు దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్లపై తీర్పు వెలువరించాల్సిన సమయంలో న్యాయమూర్తి బదిలీ కావడంతో ఈ వ్యాజ్యాలపై తిరిగి విచారణ చేపట్టాలని(రీఓపెన్ చేయాలని) హైదరాబాద్లోని సీబీఐ కోర్టు నిర్ణయించింది. -
అనుమానం వచ్చిందంటే.. ఖాతా రద్దే
అడ్డగోలుగా చెలరేగిపోతున్న సైబర్ నేరగాళ్లకు ముకుతాడు వేయడంపై భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) దృష్టి పెట్టింది. అనుమానాస్పద ఖాతాలను వెంటనే స్తంభింపజేయాలంటూ అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. -
ఉల్లిపాయ.. సాగు తగ్గిపాయే..!
మహబూబ్నగర్ జిల్లా గోప్లాపూర్కు చెందిన రైతులు ఉల్లిని పండించారు. మార్కెట్లలో తిరిగినా గిట్టుబాటు ధర రావడం లేదని, పైగా రవాణా ఖర్చులు భారమవుతున్నాయని ఇలా రోడ్డును ఆనుకొనే కుప్పలు పోసి విక్రయిస్తున్నారు -
సుర్రుమంటూ.. నీరంతా జుర్రేస్తూ..
భానుడు నీటిని పీల్చేస్తున్నాడు. కృష్ణా, గోదావరి పరీవాహకంలోని ప్రధాన జలాశయాల్లో నీటి ఆవిరి శాతం పెద్దఎత్తున ఉంటోంది. రాష్ట్రంలో సగటు ఉష్ణోగ్రత 41.5, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలపైనే ఉంటున్నాయి. -
ఆర్టీసీ కార్మికులకు ఊరట
రుణపరపతి సహకార సంఘం(సీసీఎస్)లో దాచుకున్న పొదుపు సొమ్మును వెనక్కి తీసుకునేందుకు మూడున్నరేళ్లుగా ఎదురుచూస్తున్న వేలమంది ఆర్టీసీ కార్మికులకు త్వరలోనే ఊరట లభించనుంది. -
టీఎస్ఈఏపీసెట్ ఇంజినీరింగ్ హాల్టికెట్ల విడుదల
టీఎస్ఈఏపీసెట్-2024 ఇంజినీరింగ్ స్ట్రీమ్ పరీక్ష హాల్టికెట్లు మంగళవారం విడుదల చేసినట్లు సెట్ కన్వీనర్ బీడీ కుమార్ తెలిపారు. -
ఆలస్యరుసుంతో పాలిసెట్ దరఖాస్తు గడువు పెంపు
పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలిసెట్-2024)కు రూ.100 ఆలస్యరుసుంతో దరఖాస్తు గడువును మే ఏడో తేదీ వరకు పెంచామని ఎస్బీటీఈటీ కార్యదర్శి ఎ.పుల్లయ్య తెలిపారు. -
వ్యవసాయ విశ్వవిద్యాలయానికి కొత్త రిజిస్ట్రార్
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇన్ఛార్జి రిజిస్ట్రార్గా రఘురామిరెడ్డి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. -
7న బీసీ సంక్షేమ సంఘం కీలక సమావేశం: ఆర్.కృష్ణయ్య
రాష్ట్రంలోని బీసీల డిమాండ్లపై విస్తృతంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకునే ఉద్దేశంతో ఈ నెల 7న హైదరాబాద్లో రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశాన్ని నిర్వహించనున్నట్లు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
సమాజ సేవకులను సత్కరించుకోవాలి
‘‘లాభాపేక్ష లేకుండా సమాజం కోసం పనిచేసే వారిని గుర్తించి సత్కరించుకోవాలి. అయితే దురదృష్టవశాత్తూ ప్రస్తుత సమాజం రాజకీయాల్లో ఉన్నవారికి అధిక ప్రాధాన్యమిస్తూ గౌరవించుకుంటోంది’’ అని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. -
నేత్రాధికారులకు న్యాయం చేయాలి
రాష్ట్రంలోని నేత్రాధికారుల (ఆఫ్తాల్మిక్ ఆఫీసర్స్)కు న్యాయం చేసి, పదోన్నతులను చేపట్టాలని రాష్ట్ర పీఆర్సీ ఛైర్మన్ శివశంకర్ను రాష్ట్ర నేత్రాధికారుల సంఘం కోరింది. -
ఎన్వోసీల పేరుతో..కాసులవేట!
భవన నిర్మాణాలకు నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) ఇచ్చేందుకు నీటిపారుదల శాఖలోని కొందరు అధికారులు వసూళ్లకు పాల్పడుతున్నారు. చెరువుల బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు లేవంటూ ధ్రువీకరించేందుకు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. -
ఓయూలో సర్క్యులర్ ప్రచారంపై పోలీసు కేసు
సర్క్యులర్ను తప్పుగా మార్చి ప్రచారం చేస్తూ ఉస్మానియా ప్రతిష్ఠకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రయత్నిస్తున్నారని అధికారులు మంగళవారం ఓయూ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
ఎండ.. ప్రచండం
రాష్ట్రంలో సూరీడు నిప్పులు చెరుగుతున్నాడు. మంగళవారం ఎండ తీవ్రత తారస్థాయికి చేరింది. జగిత్యాల, నల్గొండ, కరీంనగర్లు మసిలిపోయాయి. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైన, నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 46.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది.
తాజా వార్తలు (Latest News)
-
ఆ కథనంపై వ్యాఖ్యానించం.. న్యూదిల్లీతో టచ్లో ఉన్నాం: అమెరికా
-
శంషాబాద్లో 5 మేకలతో ఎర.. అయినా చిక్కని చిరుత
-
ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్ కార్డులున్నాయా? ఈ ప్రయోజనాలు తెలుసా?
-
యంగ్గా కనిపించడం కోసం అలాంటి పనులు చేయను: ఆమిర్ ఖాన్
-
బీఎస్ఎన్ఎల్లో బ్రాడ్బ్యాండ్ ఇన్స్టలేషన్ ఛార్జీలు ఉండవ్
-
ఆర్సీబీకి ఇదేం శాపమో..? ఆ జట్టులోకొస్తే వైఫల్యం.. వేరే జట్లలో అదరహో!