తెలంగాణలో జర్మనీ పరిశ్రమల క్లస్టర్
తెలంగాణలో జర్మనీ పెట్టుబడిదారుల కోసం క్లస్టర్ ఏర్పాటు చేస్తామని, సౌకర్యాల కేంద్రం ప్రారంభిస్తామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు అన్నారు. జర్మనీ సంస్థలు రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికి ముందుకొస్తే
పారిశ్రామికవేత్తలతో కలిసి పనిచేస్తాం
జర్మనీ పెట్టుబడిదారుల సదస్సులో కేటీఆర్
జహీరాబాద్లో రూ.1500 కోట్లతో వాహన విడిభాగాల పరిశ్రమకు ఒప్పందం
హైదరాబాద్లో నిర్వహించిన జర్మన్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో మంత్రి కేటీఆర్, జర్మన్ రాయబారి వాల్టర్ సమక్షంలో
ఒప్పంద పత్రాలు మార్చుకుంటున్న ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్రంజన్, లైట్ఆటో మేనేజింగ్ డైరెక్టర్ బాలానంద్
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలో జర్మనీ పెట్టుబడిదారుల కోసం క్లస్టర్ ఏర్పాటు చేస్తామని, సౌకర్యాల కేంద్రం ప్రారంభిస్తామని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు అన్నారు. జర్మనీ సంస్థలు రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికి ముందుకొస్తే మిగతా రాష్ట్రాల కంటే మెరుగైన ప్రోత్సాహకాలను అందిస్తామని తెలిపారు. ఇండోజర్మన్ పరిశ్రమలు, వాణిజ్యమండళ్ల సమాఖ్య ఆధ్వర్యంలో హైదరాబాద్లో సోమవారం జరిగిన జర్మనీ పెట్టుబడిదారుల సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘‘వాణిజ్య విధానాన్ని భారత్ నిర్ణయిస్తుంది. కార్యాచరణ రాష్ట్రాల్లో ఉంటుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతతో తెలంగాణ అన్ని రంగాల్లో రాణిస్తోంది. అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్తు సరఫరా అందుబాటులోకి తెచ్చాం. రెండు లక్షల ఎకరాల భూమి, మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయి. టీఎస్ఐపాస్ ద్వారా 15 రోజుల్లో 17,500 కంపెనీలకు అనుమతులు ఇచ్చాం’’ అని కేటీఆర్ పేర్కొన్నారు. భారత్లో జర్మనీ రాయబారి వాల్టర్ జె.లిండ్నర్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడుల సాధన కోసం నిబద్ధతతో పనిచేస్తోందని తెలిపారు. సమావేశంలో జర్మన్ కాన్సుల్ జనరల్ కరీన్ స్టోల్, ఇండోజర్మన్ పరిశ్రమలు, వాణిజ్య మండళ్ల సమాఖ్య డైరెక్టర్ జనరల్ స్టీఫన్ హలూసా, సైయెంట్ కార్యనిర్వాహక ఛైర్మన్ మోహన్రెడ్డి, పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్యకార్యదర్శి జయేశ్రంజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లిండ్నర్, కరీన్స్టోల్, పారిశ్రామికవేత్తలు మంత్రి కేటీఆర్ను జర్మనీ సందర్శించాలని ఆహ్వానించారు. జనవరి 16 నుంచి 19 వరకు దావోస్లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు అనంతరం... 20 తర్వాత జర్మనీలో తమ ప్రభుత్వం బృందంతో కలిసి పర్యటిస్తామని కేటీఆర్ తెలిపారు.
9వేల మందికి ప్రత్యక్ష ఉపాధి
జర్మనీకి చెందిన ప్రముఖ ఆటోమోటివ్ సంస్థ ‘లైట్ ఆటో’ జహీరాబాద్లో 100 ఎకరాల్లో రూ.1500 కోట్లతో వాహన విడిభాగాలు, ముడిపదార్థాల ఉత్పత్తి పరిశ్రమ ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. మంత్రి కేటీఆర్, జర్మనీ రాయబారి లిండ్నర్ల సమక్షంలో పరిశ్రమలు, ఐటీ శాఖల ముఖ్యకార్యదర్శి జయేశ్రంజన్, లైట్ ఆటో ఎండీ బాలానంద్ ఒప్పందంపై సంతకాలు చేశారు. సంస్థ ద్వారా తొమ్మిది వేల మందికి ప్రత్యక్షంగా, మరో 18 వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తామని ఈ సందర్భంగా బాలానంద్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విశాఖ తీరానికి విలాసవంతమైన నౌక
ప్రఖ్యాత అంతర్జాతీయ క్రూయిజ్ నౌక ‘ది వరల్డ్’ ఆదివారం విశాఖ పోర్టుకు చేరుకుంది. పోర్టు అధికారులు నౌకలో వచ్చిన వారికి ఘన స్వాగతం పలికారు. -
ఇదీ సంగతి!
ఎంత ఎండలైనా కండువాని అలా కప్పుకోకండి సార్! దివాలా తీశారు అనుకొంటారు!! -
జవహర్రెడ్డి జగన్నాటకం
ఒక ఎత్తు కాకపోతే మరో ఎత్తు. ఒక వ్యూహం కాకపోతే మరో వ్యూహం. ఏది అమలుచేసినా అంతిమంగా వైకాపాకు మేలు చేయడమే లక్ష్యం. -
సుందరనాయుడి సేవలు నిరుపమానం
అందరూ ఆప్యాయంగా చిత్తూరు పెద్దాయన అని పిలుచుకునే.. కోళ్ల పరిశ్రమ పితామహుడు దివంగత డాక్టర్ ఉప్పలపాటి సుందరనాయుడి సేవలు చిరస్మరణీయమని కోళ్ల రైతులు పేర్కొన్నారు. -
గురుదక్షిణగా కారు.. అందజేసిన లేపాక్షి నవోదయ పూర్వవిద్యార్థులు
జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకునేలా స్ఫూర్తి నింపిన గురువుకు శిష్యులు రూ.12లక్షల విలువైన కారును బహుమతిగా అందజేశారు. -
తాత, నానమ్మల పెళ్లంట.. మనవలే పెద్దలంట!
సాధారణంగా మనవళ్ల వివాహాలను తాత, నానమ్మలు దగ్గరుండి జరిపిస్తారు. ఇక్కడ మాత్రం తాత, నానమ్మల పెళ్లిని మనవళ్లందరూ కలిసి అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
అరగంట కరెంట్ కట్.. కీసర డీఈపై సస్పెన్షన్ వేటు
అరగంట కరెంట్ నిలిపివేత నేపథ్యంలో హైదరాబాద్లోని హబ్సిగూడ సర్కిల్ కీసర డివిజనల్ ఇంజినీర్ (డీఈ) ఎల్.భాస్కర్రావును దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖీ శనివారం రాత్రి సస్పెండ్ చేశారు. -
తెలంగాణ భగభగ!
తీవ్రమైన ఎండలతో రాష్ట్రం మండిపోతోంది. అన్ని జిల్లాల్లో సాధారణం కన్నా దాదాపు ఐదు డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొద్ది రోజులుగా ప్రమాద హెచ్చరిక స్థాయి 45 డిగ్రీల మార్కును దాటి ఎండలు కాస్తున్నాయి. -
ఆర్టీసీ కార్మికులకు ఊరట
రుణపరపతి సహకార సంఘం(సీసీఎస్)లో దాచుకున్న పొదుపు సొమ్మును వెనక్కి తీసుకునేందుకు మూడున్నరేళ్లుగా ఎదురుచూస్తున్న వేలమంది ఆర్టీసీ కార్మికులకు త్వరలోనే ఊరట లభించనుంది. -
పెద్దపులులకు నీటి కష్టాలు!
మండు వేసవిలో తాగునీటి కోసం వన్యప్రాణులు అల్లాడుతున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతాల్లో వాగులు, చెరువులు, కుంటలు ఎండిపోవడంతో.. పెద్దపులులు సహా ఇతర జంతువులు నీళ్లు లభించే ప్రాంతాల్ని వెతుక్కుంటూ వలస పోతున్నాయి. -
రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదు
రాజ్యాంగబద్ధత కలిగిన రిజర్వేషన్లకు తామెప్పుడూ వ్యతిరేకం కాదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. -
శంషాబాద్ విమానాశ్రయంలో చిరుత కలకలం
శంషాబాద్ విమానాశ్రయంలోకి ఆదివారం తెల్లవారుజామున చిరుత చొరబడింది. ఎయిర్పోర్టు దక్షిణ దిశలో ఉన్న ప్రహరీ పైనుంచి ఓ జంతువు దూకినట్లు కంట్రోల్ రూంకు సమాచారం అందటంతో కలకలం రేగింది. -
సాహస బాలుడు సాయిచరణ్కు ముఖ్యమంత్రి అభినందన
రంగారెడ్డి జిల్లా నందిగామలోని ఆలిన్ ఫార్మా పరిశ్రమలో ఈ నెల 26న జరిగిన అగ్నిప్రమాదం నుంచి ఐదుగురు కార్మికులను కాపాడటంలో భాగస్వామి అయిన సాహస బాలుడు ఎం.సాయిచరణ్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభినందించారు. -
వరి పొలంలో భారీ మొసలి పట్టివేత
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం భూత్కూర్లో భారీ మొసలి పట్టుబడింది. గ్రామానికి చెందిన రైతు శేఖర్కు ఆదివారం వరిపొలంలో మొసలి కనిపించింది. -
నేటి నుంచి కన్హ శాంతివనంలో బాబూజీ జయంతి ఉత్సవాలు
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హ శాంతివనంలోని అతిపెద్ద ధ్యాన మందిరంలో బాబూజీ మహరాజ్ 125వ జయంతి ఉత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నట్లు శ్రీరామచంద్రమిషన్ పీఆర్వో చంద్రారెడ్డి ఆదివారం తెలిపారు. -
చిన్న జాగ్రత్తలతో పెద్ద ప్రమాదాన్ని ఆపగలం
చిన్న జాగ్రత్తలు పాటిస్తే ఎంత పెద్ద ప్రమాదాన్నైనా ఆపగలమని కర్మాగారాలు, కార్మిక, ఉపాధి కల్పనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఐ.రాణి కుముదిని అన్నారు. -
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. కానిస్టేబుల్కు గాయాలు
వరంగల్ జిల్లా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లోని ఈవీఎం స్ట్రాంగ్ రూం వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఓ కానిస్టేబుల్ తుపాకీ ప్రమాదవశాత్తు(మిస్ఫైర్) పేలింది. -
సమస్యలపై ఐక్యంగా పోరాడాలి
దీర్ఘకాలంగా రాష్ట్రంలోని న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలు, డిమాండ్ల పరిష్కారానికి ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని హైకోర్టు బార్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. -
పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడిగా వెంకట్రెడ్డి
ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పీడీఎస్యూ) రాష్ట్ర అధ్యక్షుడిగా వెంకట్రెడ్డి (వరంగల్), ప్రధాన కార్యదర్శిగా సాంబ (కొత్తగూడెం) ఎన్నికయ్యారు. -
శ్రీవారిని కుటుంబసమేతంగా దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి
శ్రీవారిని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఇ.వి.వేణుగోపాల్ కుటుంబసమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. -
2047 కల్లా అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్
గడిచిన పదేళ్లలో ప్రధాని నరేంద్రమోదీ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా దేశాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని రాజస్థాన్ మంత్రి రాజ్యవర్ధన్సింగ్ రాఠోడ్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో పాలస్తీనా జెండా కలకలం
-
జైల్లో కేజ్రీవాల్ను చూసేందుకు భార్యకు అనుమతి నిరాకరణ..!
-
రిజర్వేషన్ల రద్దుపై అమిత్ షా నకిలీ వీడియో.. దిల్లీలో కేసు నమోదు
-
మ్యాచ్ పరిస్థితి గురించి వారికేం తెలుసు?: స్ట్రైక్రేట్పై కామెంట్లకు విరాట్ కౌంటర్
-
వైవిధ్య చిత్రాలు వచ్చేస్తున్నాయ్.. ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే!
-
లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,505